
Nara Chandrababu Naidu | CBN | TDP
February 2, 2025 at 04:07 PM
నీటిపారుదల ప్రాజెక్టులపై ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు నేను పర్యటిస్తుంటే గత ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి నన్ను అడ్డుకున్నది. పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు. రూ.400 కోట్లతో కట్టిన డయాఫ్రమ్ వాల్ ను చెడగొట్టారు. ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలతో కట్టాల్సి వస్తున్నది. ఎప్పుడూ గెలవని రాయచోటి లో కూడా తెలుగుదేశాన్ని మీరు గెలిపించారు. దాంతో ఢిల్లీలో ప్రతిష్ట పెరిగింది. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందింది. పోలవరం కు 12 వేల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి 2027 కల్లా పూర్తి చేస్తాం.
❤️
🙏
👍
💛
✌️
🚳
🫡
57