
Unity Of GSWS GOVT Employees ( United Welfare GSWS Govt Employees Forum)
February 11, 2025 at 04:32 AM
తూర్పుగోదావరి జిల్లాలో
మరోసారి రెడ్ జోన్, సర్వే లెన్స్ జోన్ లు ఏర్పాటు
గోదావరి జిల్లాల్లో వైరస్ తో చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూ గా నిర్ధారణ.....
పెరవలి మండలం కానూరు గ్రామ పౌల్ట్రీల్లో శాంపిల్స్ కు బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా పూణె ల్యాబ్ నిర్ధారణ
రాజమండ్రి కలెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ 95429 08025 నెంబర్ తో ఏర్పాటు
బర్డ్స్ ఎక్కడ చనిపోతున్న పశు సంవర్ధక శాఖ అధికారులకు సమాచారాన్ని అందించాలనీ హై అలెర్ట్
ప్రజలు కొన్ని రోజులు పాటు చికెన్ తినడం తగ్గించాలనీ జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరికలు
ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో లక్షలాది కోళ్ళు మృత్యువాత
ఒక్కో పౌల్ట్రీ ఫాం లో రోజుకు 10 వేలకు పైగా మృతి చెందుతున్న కోళ్ళు
కానూరు శాంపిల్స్ కు ల్యాబ్ రిపోర్ట్ రావడంతో సంబంధిత శాఖలతో అత్యవసర సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెరవలి మండలం కానూరు గ్రామ పరిధిలో ఒక కిలోమీటర్ రెడ్ జోన్ గాను, పది కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ గా విధింపు*
ఈ పరిధిలో 144, 133 సెక్షన్ అమలు చేయాలని పోలీస్ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
వైరస్ లక్షణాలు ఏ ఒక్కరిలో కనిపించిన వారికి యాంటీ వైరస్ మందులు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న కలెక్టర్
ఆయా పౌల్ట్రీ నుంచి ఒక కిలోమీటర్ లోపు బర్డ్స్(కోళ్లు), క్రోడిగుడ్లను కాల్చి వేయాలన్న కలెక్టర్
ఇప్పటికే 75 శాతం వాటిని కాల్చి వేసిన పౌల్ట్రీ యజమానులు
గడచిన ఐదు, ఆరు రోజుల్లో పౌల్ట్రీ నుంచి కోళ్లను ఏ యే ప్రాంతాలకు వాహనాల ద్వారా రవాణా అయిన సమాచారం తెలుసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశాలు
ఇంకా మిగిలిన ప్రాంతాల కోళ్ల శాంపిల్స్ కు సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ లు రావాల్సి ఉంది.
🙏
1