
Gottipati Ravikumar | TDP
February 14, 2025 at 03:03 PM
ఈరోజు అద్దంకి నియోజకవర్గంలోని గుండ్లకమ్మ ముంపు గ్రామాల్లో పర్యటించాను. ముందుగా యర్రబాలెంలో రూ. 20 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నాను. అనంతరం ఏడు ముంపు గ్రామాల ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను. ఆయా గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, పాఠశాలలు, దేవాలయాలు నిర్మించాలని అధికారులకు ఆదేశించాను. గత 5 ఏళ్లు అసమర్థ వైసీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టునే కాదు నిర్వాసితులను గాలికి వదిలేసింది. కనీసం తట్ట మట్టి కూడా ముందుకు కదల్లేదు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసంతో రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఆగిపోయాయి. నిజానికి గుండ్లకమ్మ నిర్వాసితుల సమస్యలు ఎప్పుడో పరిష్కారం అవ్వాల్సి ఉన్నా, వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో పనులు ఆలస్యమై, ముంపు గ్రామాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గుండ్లకమ్మ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే కాకుండా, 7 ముంపు గ్రామాల ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చాను. అనంతరం యర్రబాలెం గ్రామంలోని ఎస్సీ కాలనీని సందర్శించి, కాలనీ వాసుల సమస్యలపై ఆరా తీశాను. వెంటనే ఎస్సీ కాలనీవాసులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది.
#andhrapradesh #gottipatiravikumar #addanki #idhimanchiprabhutvam
❤️
👍
5