Govt Updates✅
Govt Updates✅
February 6, 2025 at 07:23 AM
*వీరికి రేషన్ కట్ అయ్యే అవకాశం...* ☛ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY) లబ్దిదారుల్లో అనర్హులను గుర్తించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ☛ ఇందులో భాగంగా ఆదాయపు పన్ను చెల్లింపుదారుల వివరాలను ఆహార మంత్రిత్వ శాఖతో ఐటీ విభాగం పంచుకోనుంది. ☛ తద్వారా ఏరివేత ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను చెల్లించని వారికి పీఎంజీకేఏవై కింద పేద కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ☛ 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం రూ.1.97 లక్షల కోట్లు వెచ్చించనుంది. ☛ 2025-26 ఆర్థిక సంవత్సరానికి తాజా బడ్జెట్లో రూ.2.03 లక్షల కోట్లను ప్రతిపాదించింది.
👍 1

Comments