
SURYAA NEWS PAPER(ND)
February 15, 2025 at 09:33 AM
కళ్లు చెదిరే జయలలిత ఆస్తులు
27 కిలోల బంగారం.. 601 కిలోల వెండి..10వేల చీరలు.. 750 జతల పాదరక్షలు ఎవరివీ అనుకుంటున్నారా?
బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో భద్రపరిచిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను కోర్టు అధికారులు నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. 2004లో ఆమెపై అక్రమార్జనకు సంబంధించి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంగళూరు కోర్టు విచారణ చేపట్టి అప్పుడు స్వాధీనం చేసుకున్న ఆస్తులను తాజాగా తమిళనాడు ప్రభుత్వానికి వాటిని అందజేసింది. ఆరు ట్రంకు పెట్టెలలో వీటిని తమిళనాడుకు తరలించారు. వీటి విలువ రూ.4వేల కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను కర్ణాటకకు తరలించి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఇప్పటి వరకు భద్రపరిచారు.
👍
1