M.S RAJU | TDP
February 10, 2025 at 03:50 PM
*సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు...*
*- అధికారులు, గ్రామస్తులతో ఎం.ఎస్.రాజు, తిప్పేస్వామి సమీక్ష*
*అమరాపురం :*
అమరాపురం మండలం, హేమావతి గ్రామంలో శివరాత్రి పర్వదినాన జరిగే శ్రీ ఎంజరు సిద్దేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు ఆదేశించారు. మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామితో కలిసి హేమావతి గ్రామంలో శ్రీ ఎంజరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎం.ఎస్.రాజు అధికారులు, గ్రామస్తులతో సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. గ్రామస్తులు కూడా బ్రహ్మోత్సవాలకు సంబంధించి చేసే ఏర్పాట్ల విషయంలో అధికారులకు సహాయసహకారాలు అందించాలని కోరారు. అందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.