మన మంగళగిరి - మన లోకేష్
January 27, 2025 at 12:22 PM
*యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిన మంత్రి నారా లోకేష్*
*పాదయాత్ర ప్రారంభమై నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళగిరిలో వేడుకలు*
*టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో కేక్ కట్ చేసిన నాయకులు*
*అరాచక పాలకుల్లో వణుకు పుట్టించిన యువగళం పాదయాత్ర*
*హామీల అమలుదిశగా ప్రజాప్రభుత్వం అడుగులు*
మంగళగిరి టౌన్, జనవరి 27: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చేసిందని గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాస్ అన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభమై నేటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్లో టీడీపీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్కట్ చేసి పార్టీ శ్రేణులకు తినిపించారు. ఈ సందర్భంగా పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 5 కోట్లమంది ఆశలు, ఆశయాలను ప్రతిబింబిస్తూ కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంత నుంచి 2023 జనవరి 27వ తేదీన పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన మంత్రి నారా లోకేష్ యువగళంతో రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్నే మార్చేశారని పేర్కొన్నారు. అరాచక పాలకుల్లో వణుకు పుట్టించిన యువగళం యాత్రను అడ్డుకునేందుకు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటూ పట్టువదలని విక్రమార్కుడిలా మంత్రి లోకేష్ ముందుకు సాగిన తీరు టిడిపి కేడర్ లో నూతనోత్సాహాన్ని నింపిందన్నారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీలు, 2,097 గ్రామాల మీదుగా 226 రోజులపాటు 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగిందని చెప్పారు. ప్రజల కష్టాలు వింటూ, కన్నీళ్లు తుడుస్తూ సాగిన యువగళం పాదయాత్ర ప్రజాచైతన్యంలో సంపూర్ణ విజయం సాధించిందన్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి, ప్రజాప్రభుత్వాన్ని స్థాపించడంలో యువగళం కీలకపాత్ర పోషించిందని అన్నారు. అధికారంలోకి వచ్చాక యువతకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ అమలుకు ప్రణాళికాబద్ధమైన కృషి జరుగుతోందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడు నెలల్లోనే రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షలమందికి పైగా ఉద్యోగాలు కల్పించేందుకు ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయన్నారు. మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో ఆర్సెలర్స్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్స్, గూగుల్, టిసిఎస్, వీడియోకాన్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూకట్టాయన్నారు.
రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి మాట్లాడుతూ అనివార్యమైన పరిస్థితుల్లో మినహా ఎటువంటి విరామలేకుండా యువగళం పాదయాత్ర సాగిందన్నారు రాయలసీమలో 48 డిగ్రీల మండుటెండల్లో సైతం మంత్రి లోకేష్ పాదయాత్రను ఆపలేదని, ఎండ, వాన, తుపానులను సైతం లెక్కచేయకుండా మంత్రి లోకేష్ పాదయాత్రను కొనసాగించారని అన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జోరువర్షాన్నిలో సైతం యాత్రను కొనసాగించినట్లు తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఉక్కుసంకల్పంతో లక్ష్యంగా దిశగా సాగారు. యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ 70 బహిరంగసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకున్నారని అన్నారు. లక్షలాది ప్రజలు నేరుగా యువనేతను కలుసుకుని తమ కష్టాలు చెప్పుకున్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ను కుటుంబసభ్యుడిలా భావించి తమ బాధలు చెప్పుకుంటూ యువనేతకు జనం నీరాజనాలు పట్టారన్నారు.
రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు మాట్లాడుతూ అడుగడుగునా అభద్రతాభావం, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు నేనున్నానంటూ మంత్రి నారా లోకేష్ ఆనాడు జనంలోకి వెళ్లారని అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యువనేత ప్రచారరథం నుంచి నిలబడే స్టూల్ వరకు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. యువనేత లోకేష్ ఏ మాత్రం వెన్నుచూపకుండా కోట్లాదిమంది ప్రజల గొంతుకనే తనగళంగా వినిపిస్తూ రెట్టింపు ఉత్సాహంతో ముందుకుసాగారు. కుప్పంలో యువగళం పాదయాత్ర తంబళ్లనియోజకవర్గం చేరేసరికి ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తం 25 కేసులు బనాయించినట్లు చెప్పారు. ఇందులో యువనేత లోకేష్ పై 3 కేసులు నమోదు చేశారని అన్నారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్ తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. ఎంతలా వేధించినా, ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా క్రమశిక్షణకు మారుపేరైనా లోకేష్ నేతృత్వంలో యువగళం బృందాలు మొక్కవోని పట్టుదలతో ముందుకు సాగిందన్నారు. యువగళాన్ని స్వాగతిస్తూ గ్రామాల్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చించడం, రాళ్లు రువ్వడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పసుపు సైనికులు ఎక్కడా సంయమనం కోల్పోలేదన్నారు. భీమవరం, ఉంగుటూరు, గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో వైసిపి ముష్కరమూకలు, పోలీసులు కలిసి యువగళం వాలంటీర్లను రెచ్చగొట్టి తిరిగే వారిపైనే తప్పుడు కేసులు పెట్టారు. 40 మంది యువగళం వాలంటీర్లను నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు పంపారు. గన్నవరం నియోజకవర్గంలో విదేశాల్లో ఉన్నవారితోసహా 46మంది కీలకనాయకులపై తప్పుడు కేసులు పెట్టడం అప్పటి అధికారపార్టీలో నెలకొన్న భయానికి అద్దంపట్టిందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివ శేషగిరిరావు, పట్టణ ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లవరపు వెంకటరావు, రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పోలుమట్ల ప్రేమ్ కుమార్, రాష్ట్ర రైతు కార్యదర్శి గాదె పిచ్చిరెడ్డి, పట్టణ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు వాకా మాధవరావు, పట్టణ కార్యదర్శులు కొదమల సైమన్, బైరుబోయిన శ్రీనివాస్, పట్టణ మహిళా అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు దిండ్ల సత్యానందం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎడ్లూరి చిరంజీవి, వెలగపాటి విలియం, జొన్నాదుల బాలకృష్ణ, ఊట్ల శ్రీమన్నారాయణ, తాడిబోయిన వెంకటేశ్వరరావు, షేక్ నజీర్, రుద్ర నాగరాజు, కొల్లి వెంకట్రావు, చావలి వుల్లయ్య, చందు సురేష్, బుదాటి శ్రీనివాసరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, తోట శీను బాబు, తోట కరుణ, షేక్ సుభాని ( గల్ఫ్) సాల్మన్ రవి, ఆకురాతి లక్ష్మణ్, ఎడ్లూరి కోటేశ్వరరావు,తోట పవన్ , మోడీ తిరుపతయ్య, పందిరి వెంకన్న బాబు, మహిళా నాయకురాలు ఎలమంచిలి పద్మజ, వాసా పద్మావతి, అప్పల శాంతి, విజయలక్ష్మి, దుర్గా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
❤️
👍
💐
🙏
5