Chinthakunta Vijaya Ramana Rao
February 16, 2025 at 08:50 AM
*🔹బిగ్ బ్రేకింగ్ న్యూస్...*
*🔹బీ ఆర్ ఎస్ కు భారీ షాక్.*
*🔹కాంగ్రెస్ లో చేరిన జూలపల్లి మాజీ ఎంపీపీ, పలువురు నాయకులు..*
*🔹కండువా కప్పి ఆహ్వానించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు..*
పెద్దపల్లి బీ ఆర్ ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆపార్టీకి చెందిన జూలపల్లి మాజీ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి రాంగోపాల్ రెడ్డి, పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అము చేస్తున్న సంక్షేమ పధకాలు, మరియు ప్రజల కష్టాలను తమ కష్టంగా భావించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారి పనితీరుకు ఆకర్షితులై జూలపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం ఎలిగెడు మండలం శివపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ. చింతకుంట విజయరమణ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూలపల్లి మండల మాజీ ఎంపీపీ కూసుకుంట్ల రమాదేవి రామ్ గోపాల్ రెడ్డి గార్లు, రామకృష్ణ రెడ్డి గారు, గాండ్ల చంద్రయ్య గారు, ముప్పిడి శ్రీనివాస్ గార్లకు గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు గారు మాట్లాడుతూ...
ఈనెల 27న జరగనున్న కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పిలుపునిచ్చారు. ఎలిగేడు మండలం శివపల్లి ఆయన నివాసంలో ఆదివారం మాట్లాడుతూ కాంగ్రస్ అభ్యర్ధి నరేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన స్థానికుడని, ప్రజల సమస్యలు తెలిసిన కాంగ్రెస్ అభ్యర్థికి పట్టభద్రులు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇతరులకు ఓటువేసి వృధా చేసుకోవద్దని, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమన్నారు. ప్రచారంలో భాగంగా ఈనెల 17న పెద్దపల్లి సమీపంలోని బంధంపల్లి స్వరూప గార్డెన్ లో ఉదయం 10:00గంటలకు నిర్వహించే సమావేశానికి పెద్దపల్లి నియోజక వర్గంలోని పట్టభద్రులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి హాజరవుతున్నట్లు చెప్పారు. సదస్సుకు సకాలంలో హాజరు కావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘసాని రాజారాంరెడ్డి , గంగిపెల్లి చొక్కయ్య ,అలకొండ అనంతరెడ్డి ,దాడి కుమార్ తదితరులు పాల్గొన్నారు..