
Gottipati Ravikumar | TDP
February 18, 2025 at 04:14 PM
పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలో నిర్వహించిన ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను. కారంపూడి పరిసర ప్రాంతాల్లో ఉపాధ్యాయులు , పట్టభద్రులను కలిసి, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించాలని కోరడం జరిగింది. గత 5 ఏళ్ల జగన్ మోహన్ రెడ్డి పాలనలో మన రాష్ట్రం విధ్వంసంలో ఇతర రాష్ట్రాలతో పోటీపడితే, ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృధిలో పోటీ పడుతోంది. నేడు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా... ప్రజా సంక్షేమంలో రాజీ పడకుండా ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు, లక్షలాది మందికి సంక్షేమ పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని ఓటర్లకు వివరించాను. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది.
#andhrapradesh #gottipatiravikumar #palnadu #mlcelection2025
❤️
2