
Gottipati Ravikumar | TDP
February 19, 2025 at 04:10 PM
ఈరోజు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల జిల్లాలోని, వేమూరు, బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో జిల్లా ఇంఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి గారు, ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు, నరేంద్రవర్మ గారితో కలిసి పట్టభద్రులతో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగస్థులు, పట్టభద్రులకు మేలు జరిగేలా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించాను. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తూ, ఎన్నికల్లో యువతకు ఇచ్చిన మాట ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు శ్రమిస్తున్న చంద్రబాబు గారికి మద్దతుగా రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది.
#andhrapradesh #gottipatiravikumar #bapatla #mlcelection2025
❤️
👍
4