
Gottipati Ravikumar | TDP
February 25, 2025 at 02:27 PM
ఈరోజు సచివాలయంలో విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీపై ఉన్నతాధికారులతో చర్చించడం జరిగింది. గత ప్రభుత్వంతో పొల్చితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ కొనుగోళ్లు 60 శాతం తగ్గడం విశేషం. డిమాండ్కు సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరగడంతో కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి.ఇటీవల రికార్డ్ స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరగడం రాష్ట్ర విద్యుత్ శాఖ సాధించిన విజయం. గత 5 ఏళ్ల అసమర్థ వైసీపీ హయాంలో విద్యుత్ రంగం పూర్తిగా నిర్వీర్యం అయింది. కానీ ఈ 7 నెలల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు గారి విజన్ తో విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించాం. మున్ముందు దీర్ఘకాలిక, సమగ్రమైన ప్రణాళిలతో ఆంధ్రప్రదేశ్ను మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలబెడుతామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను.
#andhrapradesh #gottipatiravikumar #energydepartment #power
❤️
1