SURYAA NEWS PAPER(ND)
SURYAA NEWS PAPER(ND)
February 28, 2025 at 11:26 AM
*ప్రజలను మరో సారి దగా చేసిన చంద్రబాబు* రాష్ట్ర బడ్జెట్ పై ధర్మాన కృష్ణదాస్** నరసన్నపేట : భారీగా అప్పుల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. మళ్లీ అన్ని వర్గాలను దగా చేసిందని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణందాస్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.. అందులో ఏముందంటే " సూపర్ సిక్స్ హామీలకు మంగళం పాడే విధంగానే ఈసారి బడ్జెట్ను రూపొందించింది. పైగా కిందటిసారి లాగే సంక్షేమం పేరుతో కోతల నాటకానికి తెర తీసింది. ఎన్నికల హామీలను గాలికి వదిలేసి చంద్రబాబు బడ్జెట్.. కీలక హామీలకు కూడా ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మహిళల మహాశక్తి, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంకి పైసా ఇవ్వని ప్రభుత్వం.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం పథకాలకు భారీగా కోత విధించింది. అప్పులతోనే అమరావతి కడతామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు నెలకు 1500 ఇస్తామని దగా చేసిన చందబ్రాబు ప్రభుత్వం.. మహిళలకు ఏడాదికి 32 వేల కోట్లు ఎగనామం పెట్టింది. దీపం పథకానికి భారీగా కోత పెట్టింది. కోటి 55 లక్షల మంది లబ్దిదారులను 90 లక్షలకు కుదించింది. బడ్జెట్లో 4 వేల కోట్లకు గాను రూ. 2601 కోట్లు మాత్రమే కేటాయించింది. డ్వాక్రా మహిళలకు బడ్జెట్లో కూటమి ప్రభుత్వం టోకరా వేసింది. 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు పథకం ప్రభుత్వం ప్రకటించలేదు. ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడా హామీని బడ్జెట్లో చూపించలేకపోయింది. అన్నదాత సుఖీభవకు కూడా కూటమి సర్కార్.. భారీగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవకు కేవలం రూ.6300 కోట్లు మాత్రమే కేటాయించింది. ఉచిత బస్సు పథకాన్ని గాలికి వదిలేసింది" అని ఆయన ఆ ప్రకటనలో విమర్శించారు.
Image from SURYAA NEWS PAPER(ND): *ప్రజలను మరో సారి దగా చేసిన చంద్రబాబు*  రాష్ట్ర బడ్జెట్ పై ధర్మాన కృష్...
👌 1

Comments