AP Samagra Shiksha Employees JAC
AP Samagra Shiksha Employees JAC
February 23, 2025 at 02:30 PM
ఏలూరు: సమగ్ర శిక్ష ఉద్యోగులకు సమ్మె కాలపు హామీలను అమలు చేయాలని, తక్షణమే హెచ్ఆర్ పాలసీ అమలు కొరకు కమిటీ వేయాలని, మినిమం ఆఫ్ టైం స్కేల్ ఉద్యోగులందరికీ అమలు చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కాంట్రాక్ట్ పద్ధతులోనికి మార్చి నేరుగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షుడు వినోద్ అధ్యక్షతన వహించారు. గౌరవ అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు గారు,రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసా శ్రీనివాస్ పాల్గొని ప్రసంగించారు. జిల్లా నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Comments