హనుమాన్ దళ్
హనుమాన్ దళ్
February 22, 2025 at 04:12 PM
శ్రీ కృష్ణ జన్మ భూమి మధుర, కృష్ణుడు నడయాడిన ప్రదేశం బృందావనం. శ్రీకృష్ణ భగవానుడు ప్రపంచవ్యాప్త హిందువులందరికీ ఆరాధ్యుడు, ఇష్టదైవం; దశావతారాలలో ఆయన పూర్ణావతారం, భగవద్గీత బోధించిన జగద్గురువు. ఇప్పటికి శుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు, శ్రావణ బహుళ అష్టమి నాడు మథురా నగరం కారాగారంలో జన్మించాడు. శ్రీమద్భాగవతము ఆసాంతం శ్రీకృష్ణావతార అద్వితీయ లీలలే. శ్రీకృష్ణ జన్మస్థానం నేటి ఉత్తరప్రదేశ్ లోని మధురా నగరం; ఈ నగరానికి సమీపంలోనే, యమునాతీరంలో గోకులం, గోవర్ధన పర్వతం, బృందావనం ఉన్నాయి. పవిత్ర గోకులాష్టమి రోజున గోవింద భజనతో, రంగురంగుల హోళీ క్రీడలతో, ఈ ప్రదేశం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది. అయితే మధురానగరిలో శ్రీకృష్ణ జన్మస్థానంలో ఒకప్పుడు వైభవంగా ఉన్న శ్రీ కేశవనాథ దేవాలయం పరిస్థితి ఏమిటి? స్వతంత్ర భారతంలో కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎందుకు విముక్తి కలగట్లేదు? ముస్లిం సుల్తానులు ఈ దేశంలో ఎన్నో దేవాలయాలకు పట్టించిన దుస్థితినే, మధురలోనూ పునరావృతం చేసారు. అయోధ్య రామజన్మభూమిలో మందిరంపై బాబ్రీ కట్టడాన్ని నిర్మించినట్లే, ముస్లిం దురాక్రమణదారులు కృష్ణజన్మభూమిలో దేవాలయంపై ఈద్గా నిర్మించారు. ఇదే సంఘటన కాశీలోను పునరావృతమయ్యింది. మిగతా చాలా దేవాలయాలు కూల్చినట్లుగానే, మొఘల్ సుల్తాన్ ఔరంగజేబు శ్రీకృష్ణ జన్మస్థాన దేవాలయాన్ని కూడా కూల్చేసాడు. ఈ దేవాలయ పూర్వ చరిత్రను పరిశీలిస్తే ఎన్నో హృదయవిదారక సంగతులు బయటపడతాయి. మధురలోని షాహీ ఈద్గా పూర్తిగా హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసి, దానిపైనే కట్టినట్లు అప్పటి ఫోటో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ భారత పురాతత్వ పరిశోధన సంస్థ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) నోటీస్ బోర్డ్ కూడా కనిపిస్తుంది. దానిపై `శ్రీకృష్ణ జన్మభూమి’ అని స్పష్టంగా వ్రాసి ఉంటుంది. దీనిని భగవాన్ శ్రీకృష్ణుడు జన్మించిన స్థలమని హిందువుల విశ్వాసం అని కూడా ఆ బోర్డ్ పై వ్రాసి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ దివ్యమైన దేవాలయం ఉండేది. సా.శ. 1618లో ఓర్చా రాజైన రాజా వీర్ సింగ్ బుందేలా ఈ దేవాలయాన్ని నిర్మించాడు. దీని నిర్మాణానికి అప్పట్లోనే 33లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. అప్పట్లో రూపాయికి 296 కిలోల బియ్యం వచ్చేవంటే 33లక్షల రూపాయల విలువ ఎంతో అంచనా వేసుకోవచ్చును! ఔరంగజేబ్ ఈ శ్రీకృష్ణ దేవాలయాన్ని 1670లో ధ్వంసం చేసి ఆ శిధిలాలపైనే షాహీ ఈద్గా కట్టించాడు. 1804లో మథుర బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వెళ్లింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ స్థలాన్ని వేలం వేసినప్పుడు బెనారస్ కు చెందిన సంపన్నుడు `రాజా పత్నీమల్’ రూ.45లక్షలకు ఆ భూమిని సొంతం చేసుకున్నాడు. ఈ భూమిపై తమకు హక్కులు ఉన్నాయంటూ 1935లో ముస్లిములు కోర్ట్ లో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్ట్ అది `రాజా పత్నీమల్’ వారసులకు మాత్రమే చెందుతుందని తీర్పు చెప్పింది. అయినా ముస్లింలు అక్కడ శ్రీకృష్ణ దేవాలయాన్ని తిరిగి కట్టనివ్వమని అడ్డుపడ్డ, కేసు గెలిచినా, పత్నీమల్ వారసులు అనేకసార్లు ప్రయత్నించినా అక్కడ శ్రీకృష్ణ దేవాలయాన్ని కట్టలేకపోయారు. 1947 తరువాత బిర్లాలు ఆ స్థలాన్ని కొనుగోలు చేసి `కృష్ణజన్మభూమి సేవాసంఘ్’ ను ఏర్పాటుచేశారు. 1968లో `కృష్ణజన్మభూమి సేవాసంఘ్’కు, ఈద్గా కమిటీకి మధ్య జరిగిన విచిత్రమైన ఒప్పందంలో శ్రీకృష్ణదేవాలయాన్ని ధ్వంసం చేసికట్టిన కట్టిన ఈద్గాను ఒప్పుకుంటున్నట్లు `కృష్ణజన్మభూమి సేవాసంఘ్’ అంగీకారం తెలిపింది. దానితో అప్పటివరకూ ఎలాంటి గుర్తింపు లేని ఈద్గాకు చట్టపరమైన గుర్తింపు వచ్చింది. మరిన్ని వివరాలకు హన్స్ బాకర్ వ్రాసిన `The History of Sacred Places in India’ (1990)అనే పుస్తకం చదవండి. పవిత్ర శ్రీకృష్ణ జన్మభూమి తీర్పు ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఎటువైపు వెళుతుందో వేచి చూడాలి. హిందువుల చిరకాలవాంఛ ఎప్పటికి నెరవేరుతుందో మరి!
Image from హనుమాన్ దళ్: శ్రీ కృష్ణ జన్మ భూమి మధుర, కృష్ణుడు నడయాడిన ప్రదేశం బృందావనం.  శ్రీకృష...
🙏 ❤️ 😔 🚩 7

Comments