G4-The Hindu Dharma Channel (Geetha , Ganga , Gayatri and Govinda)
G4-The Hindu Dharma Channel (Geetha , Ganga , Gayatri and Govinda)
February 19, 2025 at 03:52 AM
ఓం నమో నారాయణాయ *శ్రీ పిప్పలాదుడు మహర్షి గురించి* మరియు శని గ్రహ భాధల నివారణ, తరుణోపాయం పిప్పలాదుడు పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని! జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడుII మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు, ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది. ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు. కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు. ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు. తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది. ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు. నారదుడు, రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు. నారదుడు-: నువ్వు ఎవరు? అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నారదుడు: నీ తండ్రి ఎవరు? అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి! నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి. నీ తండ్రి అస్తికలతో దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి (వజ్రాయుధం) రాక్షసులను జయించారు. మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు. అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి? నారదుడు: మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది. పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి? నారదుడు- శనిదేవుని మహాదశ. ఈ విషయం చెప్పి #దేవర్షి #నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు ‘#పిప్పలడు’ అనే పేరు పెట్టి, దీక్షను ఇచ్చాడు నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు ‘పిప్పలడు’ నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మాదేవుడు బాల పిప్పలాదుడిని వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాదుడు తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు. బ్రహ్మాదేవుడు ‘తధాస్తు’ అని వరం ఇచ్చాడు. బ్రహ్మ ఇచ్చిన వరము చేత, పిప్పలాదుడు కనిపించిన అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు. ఈ క్రమములో ‘#శనిదేవుడిని’ కూడా కాల్చివేయడంతో, శని శరీరం మందడం ప్రారంభమైంది. విశ్వంలో కలకలం రేగింది. సూర్య భగవానుడు కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు. #సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు. చివరికి బ్రహ్మదేవుడు పిప్పలాదుడు ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం కోరగా, పిప్పలాదుడు అంగీకరించడు. అప్పుడు బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు: 1. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలోనూ శని స్థానం ఉండకూడదు. తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు. 2. అనాథ అయిన నాకు #రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది. కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు. దానికి #బ్రహ్మాదేవుడు ‘తథాస్తు’ అని వరం ఇచ్చాడు. అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు. శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు. అందుకే శని, “శనిః చరతి య: శనైశ్చరః” అంటే మెల్లగా నడిచే వాడు #శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి. శని దేవుని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే. తరువాత #పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది. *శ్రీ వరాహస్వామి పరిపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహ సిద్దిరస్తు* శుభం భూయాత్ 🙏 స్వస్తి
🙏 1

Comments