
PALLA RAJESHWAR REDDY
February 26, 2025 at 04:17 PM
జనగామ నియోజకవర్గం తేది :(26-2-2025)
సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలి
-మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డా.పల్లా గారు
బచ్చన్న పేట :
పాడి పంటలు సమృద్ధిగా పండాలి..ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి.. సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఈ సందర్బంగా కొమురవెల్లి మల్లన్న స్వామిని వేడుకున్నట్లు తెలిపారు. బుధవారం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా జనగామ నియోజకవర్గం బచ్చన్న పేట మండలం కొడువటూరు గ్రామంలోని శ్రీ సిద్దేశ్వర స్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా స్వామివారిని స్థానిక ప్రజాప్రతినిధు లు, నాయకులతో కలిసి ఎమ్మెల్యే పల్లా గారు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సిద్దేశ్వరుడు స్వామి వారి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలోని శివలింగానికి అభి షేకాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారికి ఆలయ అర్చకులు వేదా శీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు..అనంతరం స్థానిక బిఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే పల్లా గారు మాట్లాడుతూ..
నియోజకవర్గం సిద్దేశ్వరుడి అనుగ్రహంతో ఎంతో అభివృద్ధి జరగాలని కోరారు. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో పూజించి అభివృద్ధి చెందాలని ఈ సందర్బంగా కోరారు. అనంతరం ప్రజలందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.