
RB NEWS OFFICIAL✅
May 10, 2025 at 02:27 PM
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ కాల్పుల విరమణ కోసం పాకిస్తాన్ ముందుగా ఫోన్ చేసినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య చర్చలు ఈనెల 12వ తేదీన జరగనున్నట్లు పేర్కొంది. రెండు దేశాల మధ్య డీజీఎంఓల మధ్య జరిగిన చర్చల తర్వాత భూతలం, గగనతలం, సముద్ర మార్గాల్లో అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని వివరించింది. ఇక ఈ కాల్పుల విరమణను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి కూడా ధృవీకరించారు.