
Putta Mahesh Kumar
June 10, 2025 at 05:38 AM
మూడుముళ్ల బంధంతో ఒకటైన నూతన దంపతులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన కార్యాలయం ప్రతినిధుల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. కైకలూరుకు చెందిన "సేన" దినపత్రిక ఎడిటర్ అద్దంకి వెంకట శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు వెంకట రాజేష్ కు, గుంటూరు వాస్తవ్యులు గంగిశెట్టి కోటేశ్వరరావు, హనుమాయమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీ ప్రియాంక వివాహ వేడుక ఈనెల 7న గుంటూరు శ్రీ సువర్చల ప్రసన్నాంజనేయ కళ్యాణ మండపంలో కన్నుల పండుగగా జరిగింది. కైకలూరు సిఎన్ఆర్ గార్డెన్స్ లో సోమవారం జరిగిన రిసెప్షన్కు ఆహ్వానితుల పిలుపు మేరకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం ప్రతినిధులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి, "మహేష్ అన్న పెళ్లి కానుక" అందజేశారు.
#puttamaheshkumar
#maheshannapellikanuka
#eluruparliament
#narachandrababunaidu
#naralokesh #tdp

👍
4