మన మంగళగిరి - మన లోకేష్
May 19, 2025 at 01:51 PM
*మంగళగిరిలో మూడు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం*
*స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ*
మంగళగిరి టౌన్: మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారితకు మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ తెలిపారు. మంగళగిరి పట్టణంలోని టిడ్కో రాజీవ్ గృహకల్ప వద్ద గల కమ్యూనిటీ హాలు నందు, ఇందిరా నగర్ కృష్ణబలిజ కమ్యూనిటీ హాలు నందు, మంగళగిరి మండలం కాజా గ్రామంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఈడబ్ల్యూఎస్ వారి సహకారంతో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను సోమవారం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రారంభించారు. అంతకు ముందు అనురాధకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ప్రభుత్వం ఉన్నతాశయంతో పెట్టిన ఈ కేంద్రం తమలాంటి పేదలకు వరం లాంటిందని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పంచుమర్తి అనురాధ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశం అని అన్నారు. మూడు నెలల పాటు శిక్షణ పొందిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయని చెప్పారు. మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చు అని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు ఉంటుందన్నారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా, వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చని కొనియాడారు. కుట్టు శిక్షణ కేంద్రాలను ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలోని 3508 మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి మిషన్లు అందజేసినట్లు తెలిపారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో అమలు చేసిన స్త్రీశక్తి కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా కుట్టు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు చెప్పారు. స్త్రీశక్తి కార్యక్రమంపై వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని మహిళలు తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ఏడీ మయూరి, ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ శకుంతల, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, మంగళగిరి పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, నియోజకవర్గ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మంచికలపూడి వైష్ణవి, రాష్ట్ర తెలుగు మహిళ కార్యదర్శి వింజమూరి ఆషాబాల, రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి గాదె పిచ్చిరెడ్డి, రాష్ట్ర సాధికార సమితి సభ్యులు అన్నం నాగబాబు, బీజేపీ నాయకులు తుళ్ళిమిల్లి రామకృష్ణ, మంగళగిరి పట్టణ తెలుగు మహిళ అధ్యక్షురాలు ఊట్ల దుర్గా మల్లేశ్వరి, మంగళగిరి పట్టణ తెలుగు మహిళప్రధాన కార్యదర్శి వాసా పద్మ, పల్లబోతుల శ్రీనివాసరావు, అప్పికట్ల వెంకటరత్నం నాయుడు, కారుమూరు శ్రీనివాసరావు, పల్నాటి నాగేశ్వరరావు, జొన్నాదుల వీరాంజనేయులు, ఉద్దంటి వీరాంజనేయులు, రాయపాటి విజయ్, పందేటి తిరుపతయ్య, దానబోయిన రామరాజు, కుక్కమళ్ళ దానియేలు, గోగుల సురేష్ కుమార్, సాంబశివరావు(స్వామి), సింహాద్రి భాస్కర్ రెడ్డి, బుదాటి శ్రీనివాసరావు, సురేష్, సింహాద్రి బేబీ రాణి, ఇండ్ల రజిని, గంజి శివసుధ, పందిరి శ్రీ కన్య, తదితరులు పాల్గొన్నారు.
❤️
👍
🙏
3