
Warangal District Congress Social media
June 10, 2025 at 06:40 AM
*ఆషాఢ మాస బోనాల రివ్యూ మీటింగులో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు*
మొత్తం 28 టెంపుల్స్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరపాలి.
ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు రావొద్దు.
బడ్జెట్ లోటు కూడా లేదు... ప్రభుత్వం నుండి ఇప్పటికే రూ 20 కోట్లు ఇచ్చినo.
ఇంకా కావాలంటే సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం. ప్రభుత్వం సానుకూలంగా ఉంటుంది.
ఇక ఇబ్బందులు ఎక్కడా రావొద్దు... గత సంవత్సరం పొన్నం ప్రభాకర్ గారికే ఇబ్బంది వచ్చింది. ఈసారి అలాంటిది రావొద్దని అధికారులకి సూచిస్తున్న.
ఇక ఆషాఢ మాస బోనాలు సందర్భంగా అమ్మవారి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి.
గతంలో ఏం ప్రాబ్లం వచ్చింది...
ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేయాలనేదానిపై ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి ముందుకు వెళ్ళాలి.
జూన్ 26తో తొలి బోనం గోల్కొండ లో ప్రారంభం అవుతుంది.
బల్కంపేట, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజ బోనాలు ఉంటాయి.
రంగం, తొట్టెల ఊరేగింపు కూడా ఉంటుంది.
దేవాలయాలకు ఇచ్చే చెక్స్ రెవెన్యూ & ఎండోమెంట్ కోఆర్డినేట్ చేసుకొని పండగ లకు ముందే పూర్తి చేయాలి.
అధికారులు ఉద్యోగం లాగ కాకుండా సేవ చేస్తున్నామనే దృక్పథంతో చేయాలి.
సాంస్కృతిక కార్యక్రమాలు దైవ చింతనతో జరగాలి.
పోలీస్లు లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకోవాలి.
అధికారులు ఎక్కడ లోపం లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి.