
Warangal District Congress Social media
June 12, 2025 at 12:59 PM
దేవుడి భూములు కబ్జా చేస్తే పీడీ యాక్ట్ పెడతాం
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరిక
చెంగిచెర్ల దేవుడి మాన్యాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సురేఖ
ఎండోమెంటు ల్యాండ్లకి ఫెన్సింగ్ వేయించి పరిరక్షించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్ః
రాష్ట్రంలో దేవాదాయ శాఖకు సంబంధించిన భూమిని కబ్జా చేసేవారిపై పీడీ యాక్టులు పెడతామని, అసలు దేవాదాయ శాఖకు చెందిన భూములు కబ్జా కాకుండా చూస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. దేవుడి భూములు పరిరక్షించడమే తమ ప్రభుత్వ ధ్యేయం అని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి దేవుడి భూములు కాపాడుతున్నట్టు సురేఖ వివరించారు. గురువారం మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో దేవాదాయ శాఖ భూమి అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఫిర్యాదు మేరకు మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, మేడ్చల్ జిల్లా రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ కార్పొరేషన్ చెంగిచెర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబరు 33/8 లో 10.33 ఎకరాలు, సర్వే నెంబరు 33/9 లో 13 ఎకరాలు, సర్వే నెంబరు 33/10 లో 6.33 ఎకరాల చొప్పున మొత్తం 30.28 ఎకరాల భూమిని 1968 లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ కు భూ పట్టదారులైన తోటకూర ఎల్లయ్య యాదవ్, రామయ్య చౌదరి తదితరుల ద్వారా... సీలింగ్ యాక్ట్ నిబంధనల మేరకు సదరు భూమిని 1976 సంవత్సరంలో దేవాదాయ శాఖకు అప్పగించారని తెలిపారు. అప్పటి నుంచి ఈ భూమి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నదని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ భూమిని కాపాడుతూ వచ్చాయన్నారు. అయితే, ఈ భూములను కబ్జా చేసేందుకు కొంతమంది పని చేస్తున్నారని మంత్రి ఆగ్రహించారు. దేవాదాయ శాఖ భూములు కబ్జాకు పాల్పడిందే ఎవరైనా సరే వదిలే ప్రసక్తే లేదని మంత్రి సురేఖ హెచ్చరించారు. అయినా, భూములను స్వాధీనం చేసుకొని కబ్జా దారులపై పీడీ యాక్ట్ పెడుతామని హెచ్చరించారు. మంత్రి వెంట పర్యటించిన వారిలో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్, కీసర ఆర్డీవో ఉపేందర్ రెడ్డి, మేడిపల్లి తహసీల్దారు హసీనా, దేవాదాయ శాఖ సర్వేయర్లు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఈ భూములు పరిరక్షించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. చెంగిచెర్ల భూములు, 1976లో టీఎల్పీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేవాదాయ శాఖకు దక్కాయని గుర్తు చేశారు. అయితే, వీటిని కొంతమంది ప్రయివేటు వ్యక్తులు కబ్జా చేసి విల్లాల నిర్మాణాలు చేపడుతున్నట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక ఎమ్మార్వోతో కలసి కొంతమంది నకిలీ సర్వే చేయించి అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నం చేసినట్టు వివరించారు. కాగా, తాజాగా ఏడీ సర్వే చేయించగా ఈ భూములన్నీ దేవాదాయ శాఖకు చెందిన భూములుగా తేలినట్టు మంత్రి సురేఖ చెప్పుకొచ్చారు. అయితే, ఈ కబ్జా అంశం, మేడ్చల్ కాంగ్రెస్ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, జంగయ్య యాదవ్... వరంగల్ వెళ్తున్న మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకొచ్చారన్నారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి కొండా సురేఖ వెనువెంటనే రెవెన్యూ, దేవాదాయ, పోలీసు అధికారులను పిలిపించి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్తోనూ ఫోన్లో మాట్లాడారు. దేవాదాయ శాఖకి చెందిన ఈ 30 ఎకరాల భూములను రక్షించి బార్ కోడ్ చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
గత ప్రభుత్వంలో దేవుడి భూములపై నిర్లక్ష్యం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేవుడి భూములపై నిర్లక్ష్యం కొనసాగింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో ఆలయ భూములపై ఫోకస్ పెట్టింది. ఎక్కడెక్కడ భూములున్నాయో... ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో... అన్యాక్రాంతమైన జాగలెన్నో... అనే లెక్కలు తీశారు. రాష్ట్రంలో వివిధ ఆలయాల పరిధిలో మొత్తం 91,827 ఎకరాలున్నట్టు ఎండోమెంట్ గుర్తించింది. అందులో 25 వేల ఎకరాలు కబ్జా అయినట్టు నిర్ధారించింది. మరో 6 వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉన్నట్టు తేలిందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.