
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
June 11, 2025 at 04:46 AM
🛕సనాతన ధర్మం ఒక్క విశ్వాసం కాదు – అది జీవనవిధానం. వేములవాడ ఆలయం కేవలం నిర్మాణం కాదు – అది సాంస్కృతిక సంకేతం. దాని రక్షణ కోసం ప్రతి వేదికపై నిలబడటం మన ధర్మబద్ధమైన బాధ్యత!
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం సందర్భంగా, హిందూ JAC పిలుపుకు స్పందిస్తూ జరిగిన కీలక సమావేశంలో పాల్గొని, భక్తుల మనోభావాలకు అండగా నిలిచి, సనాతన ధర్మ పరిరక్షణకు నా మద్దతును ప్రకటించాను.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం హిందూ సంప్రదాయాల ఆధ్యాత్మిక కేంద్రమే కాదు – అది కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. అభివృద్ధి పేరిట శతాబ్దాల నాటి హిందూ దేవతా విగ్రహాలను తొలగించే ప్రయత్నాలు, భక్తుల దర్శనాలను నిలిపివేయాలన్న భావన సనాతన ధర్మానికి, భక్తుల మనోభావాలకు తీవ్రంగా భంగం కలిగించే విధంగా ఉంది.
భక్తుల అసమ్మతి… ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్లు:
1. అభివృద్ధి పేరిట ఆలయ దేవతల విగ్రహాలు తొలగించరాదు – ఇది సనాతన ధర్మానికి అవమానం.
2. విస్తరణ సమయంలో భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలి.
3. “మూడు సంవత్సరాలపాటు పూజలు నిలిపివేస్తాం” అన్న ప్రకటనలపై ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి.
4. అయోధ్య, కాశీ, ఉజ్జయిని వంటి ప్రదేశాల్లో మాదిరిగా ఇక్కడ కూడా పూజలు కొనసాగుతూ అభివృద్ధి జరగాలి.
5. అభివృద్ధి ప్రణాళిక (DPR) పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
6. ఆలయ అభివృద్ధిపై కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి సూచనలు స్వీకరించాలి.
7. ఆలయానికి సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆదాయ వనరులను ముట్టుకోకుండా ప్రభుత్వం స్వంత నిధులతో అభివృద్ధి చేయాలి.
8. నిధుల ఆలస్యం వల్ల ఆలయ ప్రతిష్ఠ దెబ్బతిన్నచో బాధ్యత ఎవరికి? అనే అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి.
9. బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధిలో నిర్లక్ష్యం ఎందుకు జరుగుతోంది అనే విషయంపై సమగ్ర సమాచారం ఇవ్వాలి.
10. గుడి మూసివేత, పూజలపై ఆంక్షల విషయంలో భక్తుల అభిప్రాయాలను లెక్కచేయకపోతే తీవ్ర నిరసనలు తప్పవు.
ఇది కేవలం ఒక ఆలయ విశయం కాదు — ఇది హిందూ ధర్మం, భక్తుల విశ్వాసం, మన సంస్కృతికి సంబంధించిన అంశం.
భక్తుల మనోభావాలను లెక్క చేయని అభివృద్ధి దారిలో వెళ్తే, అది అభివృద్ధి కాదు — అది ధర్మానికి ముప్పు. వేములవాడ ఆలయం భౌతిక నిర్మాణం మాత్రమే కాదు, అది కోట్లాది హృదయాల్లో నిలిచే ఆధ్యాత్మిక ప్రతీక.
ఈ సందర్బంగా, హిందూ సమాజం ఒక్కటిగా నిలిచి ధర్మ పరిరక్షణకు స్పష్టమైన సంకేతం పంపించాలి. ప్రజల అభిప్రాయాలను గౌరవించని అభివృద్ధికి ఎప్పుడూ స్థానం ఉండదు. సనాతన ధర్మాన్ని కాపాడటమే ఈ తరానికి బాధ్యత – అందుకే ప్రతి హిందువు అప్రమత్తంగా ఉండాలి, ఐక్యంగా నిలవాలి.
🙏
2