
శ్రీ హనుమాన్ శక్తి జాగరణ సమితి
June 11, 2025 at 08:51 AM
*హైదరాబాద్ నుంచి 'వన్ డే'లో తిరుపతి టూర్.. ఉదయం 7కు బయల్దేరితే, సాయంత్రం 8కి ఇంటికి..*
తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
హైదరాబాద్ నుండి ఒక్కరోజులోనే తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని తిరిగి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
ఉదయం 7 గంటలకు బయలుదేరి, దర్శనం అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి చేరుకునేలా రూపొందించారు.
ఈ ప్యాకేజీ ధర రూ.12,499 కాగా, రెండు రోజుల ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది.
మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్సైట్ను సందర్శించవచ్చు.
తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఒక్క రోజులోనే తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకుని.. తిరిగి వచ్చేందుకు ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం కావాలంటే ఎంత లేదన్నా రెండు రోజుల సమయం పడుతుంది. విమానంలో వెళ్తే తిరుమలకు త్వరగా చేరుకోవచ్చు. కానీ అక్కడ భక్తుల రద్దీని బట్టీ దర్శనానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది.
ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వెళ్తున్నారు. క్యూ కాంప్లెక్స్లు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి ఏకంగా 20 గంటల సమయం పడుతుందంటే.. భక్తుల రద్దీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈక్రమంలో తాజాగా తెలంగాణ ప్రభుత్వం.. శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు శుభవార్త చెప్పింది. ఒక్కరోజులోనే తిరమల వెళ్లి దర్శనం చేసుకుని.. తిరుగు ప్రయాణం అయ్యేలా ఓ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఆ వివరాలు..
ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలు దేరితే.. తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుని.. సాయంత్రం 8 గంటల వరకు తిరిగి ఇంటికి చేరుకునేలా దీన్ని రూపొందించింది.
అయితే ఈ టూర్ ప్యాకేజీ ధరలు కాస్త భారీగానే ఉన్నాయి. ఒక్కరికి రూ.12,499లు చెల్లించాలి.
దీనితో పాటుగా తెలంగాణ టూరిజం శాఖ మరో రెండు రోజుల టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
దీని ధర రూ.15,499గా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం www.tourism.telangana.gob.in వెబ్సైట్కు వెళ్లి తెలుసుకోవచ్చు
డే తిరుమల టూర్ ఎలా ఉండనుంది..
ఈటూర్లో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లాలనుకుంటే..
ఉదయం 6.55 గంటలకు విమానం ఎక్కితే.. 8 గంటలవరకు రేణిగుంటలో దిగుతాము.
అక్కడ నుంచి కారులో తిరుపతి హోటల్కు తీసుకెళ్తారు.
అక్కడకు వెళ్లి ఫ్రెషప్ అయిన తర్వాత.. కారులో తిరుమలకి తీసుకెళ్తారు.
మధ్యాహ్నం 1 గంటలోపు తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని.. తిరిగి తిరుపతికి చేరుకుంటారు
హెటల్కు వచ్చి గంటసేపు రెస్ట్ తీసుకోవచ్చు
తర్వాత తిరుచానూర్లో పద్మావతి అమ్మవారిని దర్శించుకోవచ్చు
ఆతర్వాత అటు నుంచి విమానాశ్రయం తీసుకెళ్తారు.
సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ఫ్లయిట్ బయలుదేరుతుంది
హైదరాబాద్ వచ్చే సరికి రాత్రి 7.45 గంటలకు దిగుతారు
ఇక తిరుపతి వన్ డే ఫ్లయిట్ టూర్ ప్యాకేజీ ధర ఒక్కొక్కరికి రూ.12,499లుగా నిర్ణయించారు.
ఈప్యాకేజీలో ఫ్లైట్ టికెట్, కారు ట్రావెల్ ఛార్జెస్,రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలకు అవకాశం ఉంది.
🙏
2