M.S RAJU | TDP

3.3K subscribers

Verified Channel
M.S RAJU | TDP
June 4, 2025 at 07:57 AM
*Revised Press Release....* *ప్రెస్ రిలీజ్...04-06-2025.* *విధ్వంసకారుడిని తరమికొట్టి...విజనరీకి స్వాగతం చెప్పిన సుదినం జూన్-4* *- రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని జగన్ ఓర్చుకోలేకపోతున్నాడు* *- జగన్ ఎప్పుడూ నేరస్తులు, హంతకుల పక్షమే తప్ప, ప్రజల పక్షం కాదు...* *- ఓటమిని జీర్ణించుకోలేక కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతున్న జగన్..* *- వైసీపీ ఉడత ఊపులకు భయపడేవారు ఇక్కడ ఎవ్వరూ లేరు...* *- మడకశిర శాసనసభ్యులు, టీటీడీ బోర్డు మెంబర్ ఎం.ఎస్.రాజు..* *అనంతపురం :* వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని, విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డికి సెలవు చెప్పి, విజనరీకి ఈ రాష్ట్ర ప్రజలు స్వాగతం పలికిన సుదినం జూన్-4 అని మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు ఎం.ఎస్.రాజు అన్నారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎం.ఎస్.రాజు అనంతపురంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విధ్వంసకారుడిని, దుర్మార్గపు పాలనను రాష్ట్ర ప్రజలు వద్దు అనుకుని, విజనరీ లీడర్ కు స్వాగతం పలికిన సుదినం జూన్-4. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. రాజధానిని నిర్వీర్యం చేశారు. పోలవరాన్ని గోదావరిలో ముంచారు. పారిశ్రామికవేత్తలను బెదిరించి రాష్ట్రం నుండి తరిమేశారు. విధ్వంసం నుండి వికాసం వైపు చంద్రబాబుగారు రాష్ట్రాన్ని ముందుకు నడపడాన్ని జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి, వైసీపీ విషం కక్కుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా శవం ఉంటే, రౌడీషీటర్లు, సంఘవిద్రోహ శక్తులు జైలుకు వెళితే తప్ప ఏపీకి రానటువంటి జగన్ నేడు వెన్నుపోటు గురించి మాట్లాడుతున్నాడు. ప్రజలకు అన్యాయం జరిగితే ప్రజల కోసం ఉద్యమాలు చేయడం సహజం. ప్రజాపోరాటాలు చేసేవారు ఇచ్చే పిలుపు కూడా ఒక స్థాయిలో ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని, నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసే విధంగా వెన్నుపోటు దినోత్సవంగా పిలుపునివ్వడం జగన్ రాక్షస, సైకో, నేరపూరిత మనస్తత్వానికి నిదర్శనం. రోశయ్యగారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, చంద్రబాబుగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ ఇలాంటి నీచ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు. వెయ్యి రూపాయల పెన్షన్ పెంచడానికి జగన్ ఐదేళ్లు తీసుకుంటే, చంద్రబాబుగారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచి విడుదల చేశారు.రాష్ట్ర ప్రజలకు రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిని తెచ్చిన జగన్మోహన్ రెడ్డికి నోరు తెరిచే అర్హత ఉందా? తన ఐదేళ్ల పాలనలో తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకు రాని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో గుంతలు పడిన రోడ్లను కనీసం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నా పట్టనట్టు వ్యవహరించాడు. *అసలైన వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డే...* తనకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. శివకుమార్ అనే వ్యక్తి స్థాపించిన వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి మోసం చేసి లాక్కుని, అతనికి వెన్నుపోటు పొడిచాడు. లక్షకోట్లు అక్రమంగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి 16నెలలు జైల్లో ఉంటే వైసీపీని తన భుజస్కంధాలపై మోసిన తన తల్లి, చెల్లికి అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడిచాడు. కన్నతల్లికి ఆస్తుల విషయంలో వెన్నుపోటు పొడిచి రోడ్డున పడేశాడు. *రౌడీషీటర్లు, హంతకులకు జగన్ పరామర్శించడం నేర మనస్తత్వానికి నిదర్శనం :* జగన్మోహన్ రెడ్డికి బుద్ధి, జ్ఞానం లేదు. రౌడీ షీటర్లు, గంజాయి స్మగ్లర్లు, ప్రజలను ఇబ్బందులుపెట్టేవారిని పోలీసులు కఠినంగా శిక్షిస్తే...అలాంటి నేరస్తులను జగన్మోహన్ రెడ్డి వెళ్లి పరామర్శించడం జగన్ నేర మనస్తత్వానికి నిదర్శనం. జగన్ పాలనలో దళితులపై దమనకాండ జరిగితే వారి కుటుంబాల్లో కనీసం ఒక్కరిని కూడా జగన్ వెళ్లి ఎందుకు పరామర్శించలేదు? జగన్ అధికారంలో ఉండగా ఏపీని గంజాయికి క్యాపిటల్ గా మార్చాడు. నేడు గంజాయి బ్యాచ్ కి తగిన శాస్తి జరుగుతుంటే వారికి అండగా నిలబడడమే లక్ష్యంగా జగన్ తీరు బాధాకరం. జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని 30ఏళ్లు వెనక్కి నెట్టి, నేడు ఏమీ ఎరుగని సుద్దపూసలా కబుర్లు చెప్పడం సిగ్గు చేటు. అన్ని రంగాల్లో వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని నేడు చంద్రబాబుగారు, కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడు? ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు, పెన్షన్లు ఇవ్వకుండా వేధించిన జగన్మోహన్ రెడ్డి నేడు వారు సంతోషంగా ఉంటే నచ్చడం లేదు. *ఆర్థిక ఇబ్బందుల్లోనూ సంక్షేమమే ధ్యేయంగా కూటమి పనిచేస్తోంది :* జగన్ ఐదేళ్లలో సుమారు రూ.11లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోయాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో కూడా తీవ్రంగా శ్రమిస్తోంది. అమ్మ ఒడి పథకాన్ని జగన్ అమలు చేయడానికి సమయం తీసుకోలేదా? రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు జగన్ ఒక్క రూపాయి అయినా ఖర్చుపెట్టాడా? రాయలసీమ నీటి ప్రాజెక్టులకు జగన్ కనీసం ఒక్క రూపాయి ఖర్చుపెట్టాడా? తట్టడు మట్టి తీసి పూడిక తీయించాడా? పోలవరాన్ని ఏమైనా ముందుకు తీసుకెళ్లాడా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క రైతు కుటుంబాన్ని అయినా ఆదుకున్నాడా? ఇలాంటి వాళ్లు నేడు నీతులు మాట్లాడడం దారుణం. నీ నేరాలను నిలదీసిన న్యాయవ్యవస్థల మీద నీ సైకోలతో దాడి చేయించిన నువ్వు నేడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదం. *చీకటి జీఓలు తెచ్చిన జగన్ కు మాట్లాడే నైతిక హక్కు లేదు :* జీఓ నంబర్-1 తెచ్చి ప్రజాస్వామ్యంపై దాడికి పాల్పడిన జగన్ కు నేడు రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న ప్రభుత్వంపై బురదజిమ్మడం జగన్ విధ్వంసపూరిత మనస్తత్వానికి నిదర్శనం. వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి నిజాన్ని అబద్దంగా.....అబద్దాన్ని నిజంగా చిత్రీకరించడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం వెన్నతోపెట్టిన విద్య. జగన్ చెప్పే అబద్దాలన్నింటినీ ప్రజలు నమ్ముతారు అనుకోవడం మీ అవివేకం. మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఛీ కొట్టారో ఆలోచించకుండా....ప్రజలకు మంచి చేసే ప్రభుత్వంపై కుట్రపూరిత దాడి చేయడం అన్యాయం, ప్రజాద్రోహం. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హెచ్చరిస్తున్నాం. *మీ ఉడత ఊపులకు భయపడేవారు ఎవరూ లేరు తోపుదుర్తి....:* జగన్ ఫోటో చూస్తే భయపడిపోతున్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. సైకోలకు, ఫ్యాక్షనిస్టులకు వైసీపీ వాళ్లు భయపడతారేమో కానీ, టీడీపీ కార్యకర్తలు నాయకులు భయపడరు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏదైనా ప్రభుత్వ కార్యాలయంలో ఉంటే నడిరోడ్డుమీదకు తీసుకొచ్చి పగలకొట్టండి అని పిలుపునిచ్చాను. నీకు అవేమీ వినపడలేదా? నువ్వు మీసాలు తిప్పినంత మాత్రాన ఎవరూ భయపడే పరిస్థితి లేదు. హంద్రీనీవా గురించి, రైతుల గురించి మాట్లాడే నువ్వు, వైసీపీ నాయకులు హంద్రీనీవా ద్వారా చుక్క నీరు కూడా తీసుకురాలేకపోయిన నువ్వు సిగ్గుతో తల దించుకోవాలి. మీ బెదిరింపులకు ఇక్కడ బెదిరేవారు ఎవ్వరూ లేరు. మీరు ఏ విధానంలో ముందుకొస్తారో, మీకు బుద్ధి చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని మర్చిపోవద్దు అని హెచ్చరిస్తున్నాం. *(మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు వారి కార్యాలయం నుండి జారీ....)*
👍 2

Comments