Chinthakunta Vijaya Ramana Rao
June 17, 2025 at 10:33 AM
*▪️రైతుకు ఎంతో లాభం చేసిన ప్రభుత్వ మన కాంగ్రెస్ ప్రభుత్వం...*
*▪️రైతును రాజును చేసేందుకు ప్రభుత్వం కృషి..*
*▪️అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు..*
-----ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావుగారు..
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని పెద్దంపేట, లక్ష్మీపూర్, ఆరేపల్లి, మల్యాల, మీర్జంపేట గ్రామాల్లో మంగళవారం రోజున పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోసి ఇండ్ల మంజూరు పత్రాలు అందజేసిన గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ. చింతకుంట విజయరమణా రావు గారు...
అనంతరం మిర్జాంపేట గ్రామం ₹13 లక్షల రూపాయలతో దాతల సహాయంతో నిర్మించిన రామాలయం షెడ్డును ఎమ్మెల్యే విజయరమణా రావు గారు ప్రారంభించారు...
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు గారు మాట్లాడుతూ...
రైతు భరోసా ఈ వర్షాకాల పంటకు ఈ తొమ్మిది రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది రైతులకు ఎంత భూమి ఉన్న రైతు భరోసా పడుతుంది అన్నారు. ఇప్పటికే రెండు ఎకరాల వరకు ప్రభుత్వం అందజేసింది అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాతో పాటు, రెండు లక్షల రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం వలన రైతులకు ఎంతో లాభం కలుగుతుంది అన్నారు. రైతుకు లాభం చేసిన ప్రభుత్వం ఈ 30 ఏళ్లలో నేను ఎప్పుడూ చూడలేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతుకు ఎంతో లాభం జరుగుతుంది అన్నారు. నేను నియోజకవర్గంలో పాదయాత్ర చేసేటప్పుడు ఒక్క గింజ కటింగ్ లేకుండా ధాన్యం అందిస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఏ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో గింజ కటింగ్ లేకుండా వరి ధాన్యం అందించడం జరిగింది అన్నారు. అంతేకాకుండా ఈ వేసవి కాలంలో టేలాండ్ ప్రాంతాలకు సాగునీరు అందించి రైతుల పంటలను కూడా కాపాడడం జరిగింది అన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ,మట్టి మాఫియా జోరుగా జరిగిందని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇసుక మాఫియాను అరికట్టి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వారికి ట్రాక్టర్ల ద్వారా తీసుకపోయేందుకు వెసులుబాటు కల్పించాను అన్నారు. ఈ నియోజకవర్గంలో అక్కడక్కడ చెరువులలో ఇటుక బట్టీల యజమానులు ప్రస్తుతం బట్టీలకు మట్టిని ప్రభుత్వానికి లారీకి రూపాయలు 2700 జిల్లా కలెక్టర్ ధర నిర్ణయిస్తే ఆధర ప్రకారమే బట్టి యజమానులు మట్టిని తీసుకపోతున్నారు అన్నారు. ఈ మట్టి తీసుకపోవడంలో నేను ఎలాంటి అవినీతికి పాల్పడిన ఎవరైనా నిరూపిస్తే దానికి సిద్ధంగా ఉన్నానని మిర్జంపేట రామాలయం లోని ఈ దేవుని సాక్షిగా చెప్పుతున్నానని సవాల్ విసిరారు. మట్టి తీసుకపోయే యజమానులు రేపు ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వారికి ఇటుక తక్కువ ధరకు ఇవ్వాలని వారికి చెప్పడం జరిగిందని వారు అందుకు అంగీకరించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు గ్రామాల్లో ఎంతమంది కి భూమి ఉండి కట్టుకునే ఆలోచన ఉంటే అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పెద్దంపేట గ్రామంలో 2009లో నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు పందిళ్ళ, లక్ష్మీపూర్, పెద్దంపేట మీదుగా కాల్వ శ్రీరాంపూర్ కోటి రూపాయలతో బీటీ రోడ్డు వేయించాను అన్నారు. 2009 నుంచి 2014 వరకు నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప పది సంవత్సరాలు పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ ఏ గ్రామాల్లో చేసిన అభివృద్ధి ఎక్కడ కనబడడం లేదన్నారు. మిర్జంపేట సమ్మక్క సారలమ్మ జాతర రోడ్డుకు బీటీ రోడ్డు వేయిస్తానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అన్నారు. వరితో పాటు రైతులు పంట మార్పిడి చేసి అధిక లాభాలు పొందాలని రైతన్నలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పిటిసిలు లంక సదయ్య, వంగల తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాజన వేనసదయ్య,మునీర్, బంగారి రమేష్, మాదాసు సతీష్ మరియు మండల నాయకులు మరియు ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు మరియు ఎంపీడీవో పూర్ణచందర్ మరియు ఆయా గ్రామాల ప్రజలు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు తదితరులు పాల్గొన్నారు.