
Telangana CMO
February 9, 2025 at 05:25 AM
బాబా ఆమ్టేగా ప్రసిద్ధులైన మురళీధర్ దేవదాస్ ఆమ్టే గారి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. సమాజంలో చిన్న చూపుకు గురైన కుష్టురోగులను చేరదీసి, ఆనంద్వన్ ఆశ్రమంలో వారికి సేవలందించిన మానవతావాది బాబా ఆమ్టే గారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడి దీన జనుల బాంధవుడిగా పేరు పొందారని ముఖ్యమంత్రి గారు కొనియాడారు. స్వాతంత్య్ర సమరంలో గాంధీజీ వెంట నడిచి, జీవితాంతం మహాత్ముడి ఆశయాల సాధన కోసం బాబా ఆమ్టే గారు కృషి చేశారని గుర్తుచేశారు.
🙏
❤️
👍
👎
🩴
55