
Telangana CMO
374.4K subscribers
Verified ChannelAbout Telangana CMO
Official Channel of Telangana Chief Minister's Office (CMO).
Similar Channels
Swipe to see more
Posts

https://www.instagram.com/reel/DGp2zAkxUNX/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో అందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలియజేశారు. * సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, ఎంపీలు కావ్య గారు, బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి గారు, నాయిని రాజేందర్ రెడ్డి గారు, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజు గారు, డీసీసీ అధ్యక్షుడు భరత్ చందర్ రెడ్డి గారితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి అభినందనలు తెలిపారు.


తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్కు సంబంధించి వెబ్సైట్ https://yipschool.in ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్సైట్తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్ను విడుదల చేశారు. ✅ 2025-26 విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో పిల్లలకు స్కూల్ యూనిఫామ్తో పాటు ఇతర అంశాలను ముఖ్యమంత్రి గారు పరిశీలించారు. సైనిక్ స్కూల్ తరహాలో పోలీస్ స్కూల్ను కూడా దేశానికి ఒక రోల్ మాడల్గా ఉండేలా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు సూచించారు. ✅ విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంభించాలని, క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అడ్మిషన్లలో పోలీసు అమరుల కుటుంబాల పిల్లలకు మొదటి ప్రాధాన్యతను ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ✅ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గారు, అదనపు డీజీపీ (ఆపరేషన్స్) స్టీఫెన్ రవీంద్ర గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీసు కుటుంబాల పిల్లల కోసం అంతర్జాతీయ స్థాయి స్కూల్ నిర్మాణం కోసం గత ఏడాది అక్టోబర్ 21 న ముఖ్యమంత్రి గారు భూమి పూజ చేశారు.

వరంగల్ మామునూరు విమానాశ్రయానికి అనుమతి మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల తరఫున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కె. రామ్మోహన్ నాయుడు గారికి అలాగే ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కు ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేశారు.
