
YSR Congress Party
February 13, 2025 at 04:40 PM
టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనలో వల్లభనేని వంశీపై తనతో అన్యాయంగా కేసు పెట్టించారని జడ్జిగారి ముందు సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనివల్ల గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికేసు నీరు గారిపోయింది. కేసు నీరుగారిపోతే వాళ్ల ప్రతిష్ట దెబ్బతింటుందని సీఎం చంద్రబాబు, లోకేష్ సాయింత్రానికల్లా సత్యవర్ధన్ ఇంటిమీదకు టీడీపీ శ్రేణులను పంపారు. బెదిరించి వారితో మరో తప్పుడు కేసు పెట్టించి, వల్లభనేని వంశీని అరెస్ట్ చేయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతోనే కొందరు పోలీస్ ఉన్నతాధికారులకు పని చేస్తున్నారు.
-వేల్పుల రవికుమార్ గారు, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి
👍
😢
❤️
🙏
20