
YSR Congress Party
96.5K subscribers
Verified ChannelAbout YSR Congress Party
YSRCP - Yuvajana Sramika Rythu Congress Party is a political party in Andhra Pradesh founded by YS Jaganmohan Reddy in 2011.
Similar Channels
Swipe to see more
Posts

ఈ ప్రభుత్వం పోలీసులు కలిసి పెట్టిన ప్రతి తప్పుడు కేసూ, తీసుకున్న ప్రతి స్టేట్మెంట్ బెదిరించి భయపెట్టి తీసుకున్నవి అనే వాస్తవాలను మా సిబ్బంది బయట పెడతారు. కోర్టులో అఫిడవిట్ వేసి జడ్జి ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతారు. -చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి

https://x.com/ysjagan/status/1931000325655388193?t=oMccNKgcVUPV4rg5KmF6KA&s=19

అధికార మదంతో కావాలని కడపలో మహానాడు నిర్వహించారు. జనాలు లేక, చంద్రబాబు ప్రసంగిస్తుండగానే ఛీత్కరించుకుంటూ వచ్చినవాళ్లూ వెళ్లిపోయారు. చంద్రబాబు అన్యాయాన్ని తెలియజేస్తూ వెన్నుపోటు దినోత్సవానికి ప్రజలకు వైయస్ఆర్ సీపీ పిలుపునిస్తే ప్రజలు లక్షల్లో వచ్చి తమ గళం వినిపించారు. ప్రజలు ఛీత్కరించకుంటున్నా ఈ ప్రభుత్వం సిగ్గుపడకపోగా జగన్ గారిని నిందిస్తున్నారు. -తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే

లిక్కర్ కేసును కూడా నాపై మోపుతున్నారు. డీజీపీ చేస్తున్న పాపాలు వారి కుటుంబాన్ని వెంటాడతాయి. దేవుడు విధించే శిక్షే కాదు న్యాయస్థానాలు కూడా శిక్ష విధిస్తాయి. మీరు చేస్తున్న ప్రతి తప్పూ ఈ కూటమి ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. -చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి

నా దగ్గర పనిచేసిన కానిస్టేబుల్ కు ఐదురోజులు నరకం చూపించి వాళ్లకు నచ్చినట్టు పోలీసులు స్టేట్మెంట్ రాయించుకున్నారు. తెల్లకాగితాల మీద సంతకం పెట్టించుకున్నారు. కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా ఎన్ని కేసులైనా పెట్టుకోనీయండి. విచారణ తర్వాత నిజాలు కోర్టుకు తెలుస్తాయి. -చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి

06.06.2025. తాడేపల్లి. మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు. పత్రికా ప్రకటన ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగాల పండుగ బక్రీద్ కాగా, త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని ఆయన అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. బక్రీద్ పండగ జరుపుకుంటారని శ్రీ వైయస్ జగన్ అన్నారు. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని చెప్పారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో చేసుకుంటారని గుర్తు చేశారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వైయస్ జగన్ తన సందేశంలో అభిలషించారు

ఈ రాష్ట్రంలో తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడదు. కానీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై వందల కేసులు. లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రానికి ఏం చేశారో కూటమి నాయకులు చెప్పాలి. పేరుకు నలుగురు నాయకులు రాష్ట్రానికి పట్టిన శనిలా తయారయ్యారు. గతంలో ఒకే ఒక్క నాయకుడు జగన్ రెండేళ్లు కరోనా ఉన్నప్పటికీ ఎంతో సంక్షేమాన్ని ప్రజలకు అందించారు. -తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే

దళితులను రోడ్డు మీద పడేసి కొడుతున్నారు. రాజ్యాంగంలో శిక్షలు వేసే అధికారం న్యాయస్థానాలకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గంజాయి వ్యాపారం చేసింది తెలుగుదేశం నాయకులే అని ఆ పార్టీ నేత గంటానే కేబినెట్ లో చెప్పాడు. తెలుగుదేశం పార్టీలో తప్పు చేసి, కేసులున్న నాయకులను కూడా ఇలాగే రోడ్డు మీదకు తెచ్చి కొట్టే దమ్ము, ధైర్యం హోం మంత్రి అనిత కి ఉందా అని ప్రశ్నిస్తున్నాం. -తాటిపర్తి చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్యే

https://x.com/ysjagan/status/1930994667820363965?t=20mt_Y0v4BLm1m141YqApA&s=19

ఎన్నికల సమయంలో ఎక్కడో ఒక వ్యాపారికి చెందిన డబ్బులు దొరికితే అవి చెవిరెడ్డివి అని లింక్ కలపాలని చూస్తున్నారు. సంవత్సరం అవుతున్నా ఆ డబ్బు ఎవరిదో పోలీసులు తెలియకుండా పోదు. ఆ డబ్బు నాదని ఒప్పించేందుకు నా సిబ్బందిని తీసుకువెళ్లి ఒత్తిడి చేస్తున్నారు. గతంలో నాకు గన్ మెన్ గా పని చేసిన కానిస్టేబుల్ ను నిర్బంధించి, బెదిరించి అతన్ని స్టేట్మెంట్ ఇమ్మని వేధిస్తున్నారు. నన్ను ఇబ్బంది పెట్టాలనే నా కొడుకుపై, నాపై తప్పుడు కేసులు పెట్టారు. -చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి