🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
February 8, 2025 at 06:30 AM
🔔 *తీర్థ యాత్ర* 🔔 (అంతర్వేది ఏకాదశి - లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య రథోత్సవ వేళ... ) ‌ *వశిష్ఠ గలగలలు... సాగరం సవ్వళ్లు... వాటిని మరిపించేలా గోవింద నామస్మరణ. ఇది ప్రఖ్యాత నృసింహ క్షేత్రం అంతర్వేది వైభవం. దేవదేవుడి కల్యాణోత్సవానికి సర్వం సిద్ధమైన తరుణాన తూర్పుగోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం వేలాది మంది భక్తులతో ఇల వైకుంఠంగా మారనుంది.* *స్తంభంలో నుంచి ఆవిర్భవించి ప్రహ్లాదుని రక్షించినా...* *శ్రీశైల మహారణ్యంలో సింహగర్జనలు చేస్తూ ఆదిశంకరులను కాపాడినా...* *సర్వకాల సర్వావస్థల్లోనూ సరహరి భక్తులవెంట తానున్నానని చాటుతూనే ఉన్నారు.* అలాంటి నృసింహుడు వెలసిన ప్రఖ్యాత క్షేత్రాల్లో *అంతర్వేది* ఒకటి. నిత్య హోమాలతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే స్వామివారి వైభవం ఇక్కడ చూసి తరించాల్సిందే. ప్రస్తుతం అంతర్వేది ఆలయం ఉన్న ప్రాంతంలో బ్రహ్మ, యజ్ఞం చేశాడని చెబుతారు. అఖండగోదావరి నుంచి ఓ పాయను తెచ్చి సాగరంలో కలిపిన పశిష్ట మహర్షి తపస్సు చేస్తుండగా హిరణ్యాక్షుని కుమారుడైన రక్తవిలోచనుడు ఆయన సంతానాన్ని నాశనం చేశాడని, మహర్షి ప్రార్ధనతో ప్రత్యక్షమైన నారసింహుడు రాక్షస సంహారం చేశాడని... వశిష్టుడి అభ్యర్ధన మేరకు లక్ష్మీనృసింహస్వామిగా ఇక్కడ వెలిశాడని పురాణ కథనం. ‌ స్వామి ఇక్కడ పశ్చిమాభిముఖుడై ఉంటారు. ఇక్కడికి సమీపంలోని కేశవదాసుపాలేనికి చెందిన మందపాటి కేశవదాసు అనే యాదవుడు కర్రలతో పందిరిని నిర్మించాడు. కొంతకాలానికి సప్తసాగర యాత్రకొచ్చిన రెడ్డిరాజులు చెక్కతో ఆలయాన్ని నిర్మించారు. క్రీ.శ. 1823లో ఓడలరేవుకు చెందిన *కొపనాతి కృష్ణమ్మ* ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల్లో ఉంది. పెద్దాపురం సంస్థానాధీశులు, మొగల్తూరు రాజవంశీయులు ఆలయాన్ని పరిరక్షించారు. ఏటా మాఘ మాసంలో స్వామివారి దివ్య కల్యాణోత్సవాలు జరగుతాయి. ఆగమోక్తంగా పది రోజుల పాటు జరిగే పరిణయోత్సవాలు నేత్రపర్వం కలిగిస్తాయి. కల్యాణోత్సవాల అంకురార్పణలో భాగంగా తొమ్మిది పాళికల్లో నవధాన్యాలు పోసి అవి బాగా చిగురించాలని మంత్రోచ్ఛరణతో పూజలు చేస్తారు. అదే రోజు ఆలయం ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద గరుడపటాన్ని ఆవిష్కరించి సకల దేవతాగణాన్ని కల్యాణానికి ఆహ్వానం పలుకుతారు. నాలుగో రోజు దశమినాటి రాత్రి ఆరుద్రా నక్షత్ర యుక్త తులాలగ్న పుష్కరాంశలో స్వామివారి కల్యాణం జరుగుతుంది. ఆలయానికి ఎదురుగా ఉండే వేదికపై ఈ క్రతువును నిర్వహిస్తారు. ఏడో రోజు పండిత సదస్యం అనంతరం రాత్రి స్వామివారిని అశ్వవాహనం పై ఊరేగిస్తారు. ఉత్సవమూర్తులను 16 కాళ్లమంపడం వద్దకు తీసుకువస్తారు. అక్కడ ఆలయంలోని అర్చకులు, పేరూరు బ్రాహ్మణులకు మధ్య *చోర సంవాద మట్టం* ఆసక్తిదాయకంగా జరుగుతుంది. ఆలయంలోని సుదర్శన పెరుమాళ్ విగ్రహం ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. 15 చేతులు, 16 ఆయుధాలతో చుట్టూ జ్వాలలు, వెనుక సుదర్శన యంత్రం, కింద గురుడ వాహనంతో ఉన్న దీనిని *బలిబేరం* గా సంబోధిస్తారు. కల్యాణోత్సవాల్లో సాగర జలాల్లో స్వామివారికి ఏటా సుదర్శన పెరుమాళ్ కు చక్రస్నానోత్సవాన్ని నిర్వహిస్తారు. తొమ్మిదో రోజు *మాఘ పౌర్ణమి* నాడు ఈ కార్యక్రమం జరుగుతుంది. పదో రోజున ఆలయానికి సమీపంలో దక్షిణ దిశగా ఉన్న తటాకంలో తెప్పోత్సవం వైభవంగా జరుగుతుంది. రోజూ ఉదయం, సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులకు వాహన సేవ జరుగుతుంది. *సింహ, హనుము, శేష, హంస, గరుడ, ఆశ్వ, గజ, పొన్న, రాజాధిరాజు వాహనాల* పై లక్ష్మీ నృసింహస్వామి ఊరేగుతారు. కల్యాణం జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం *దివ్య రథయాత్ర* జరుగుతుంది. స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి దిక్కులన్నీ పిక్కటిల్లేలా భక్తులంతా గోవింద నామస్మరణలు చేస్తుండగా రథాన్ని ముందుకు కదుపుతారు. రధం స్వామివారి సోదరి ఆయిన *గుర్రాలక్కమ్మ* ఆలయం చెంతకు చేరుతుంది. ఆమెకు చీర, సారె సమర్పించే ఘట్టాన్ని మంత్రోచ్ఛారణలతో నిర్వహిస్తారు. నృసింహస్వామి రక్తవిలోచనుణ్ణి చంపుతున్నప్పుడు అతని శరీరం నుంచి నేలపై పడిన ప్రతి రక్త బిందువు నుంచి ఒక్కో రాక్షస రూపం రావడంతో ప్రత్యక్షమైన *అశ్వరూఢాంబిక* తన నాలుక రాసి అసురుడి రక్తం నేలపై పడకుండా చేసిందని చెబుతారు. ఆ అశ్వరూపంబినే గుర్రాలక్కమ్మగా ఆరాధిస్తుంటారు. పసుపు, కుంకుమలతో పూజలు చేసి ప్రసాదాలను అందజేస్తారు. *శ్రీ లక్ష్మీనారసింహాయనమః* https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏 ❤️ 👍 25

Comments