
🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
92.2K subscribers
About 🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
🪷 *Tirumala Vaibhavam* 🪷 వాట్సాప్ లో అత్యుత్తమ తెలుగు ఆధ్యాత్మిక ఛానల్ .. ధర్మో రక్షతి రక్షితః 🕉️🙏🏻🕉️ The Best Telugu Spiritual Channel on whatsapp 🕉️🙏🏻🕉️ #tirumala #telugu #trumalavaibhavam #తెలుగు #తిరుమలవైభవం
Similar Channels
Swipe to see more
Posts

https://whatsapp.com/channel/0029Vb2r5KKGzzKbzTYicb3I Tirumala Vaibhavam English 🙏🏻 Plz do follow 🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

🔔 *మంత్ర బలం* 🔔 *మహామృత్యుంజయ మంత్రం* ఆ మంత్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ? అసలు ఈ మంత్రానికి అర్ధం ఏమిటి ? ఈ మంత్రం మరణాన్ని జయిస్తుందా ? ఈ మంత్రంలో ఓం, త్ర్యంబకం, యజామహే, సుగంధిం, పుష్టివర్థనం, ఉర్వారుకం, మృతోర్ముక్షీయ, అమృతాత్ … ఈ పదాలకు యెంత అద్భుతమైన , అమృతతుల్యమైన భావం ఉందో, శ్రీ ఆంజనేయ స్వామి వారు మృత్యుంజయులు ఎలా అయ్యారో తెలుసుకుందామా మరి… మహా మృత్యుంజయ మంత్రంను “మరణం జయించే మంత్రం” లేదా “త్రయంబక మంత్రం” అని అంటారు. మహా మృత్యుంజయ మంత్రం రోగాలను నయం చేయుటలో అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఒకటిగా భావిస్తారు. మహా మృత్యుంజయ మంత్రం శివుని గొప్ప మంత్రం. ఋషి మార్కండేయుల వారి ద్వారా సృష్టించబడిందని చెబుతారు. ఋషి మార్కండేయనిచే వ్యవహరించబడే ఒక రహస్య మంత్రంగా ఉంది. ఒకసారి చంద్రుడు దక్షరాజుతో నిందించబడి ప్రకాశం కోల్పోయాడు. అప్పుడు మార్కండేయడు ఈ మంత్రాన్ని ఇచ్చి కాపాడాడు. ” ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ “ ప్రతి పదార్ధం: ఓం = ఓంకారము, శ్లోకమునకు గాని, మంత్రము నాకు గాని ముందు పలికే ప్రణవ నాదము; త్రయంబకం = మూడు కన్నులు గలవాడు; యజామహే = పూజించు చున్నాము; సుగంధిం = సుగంధ భరితుడు; పుష్టి = పోషణ నిచ్చి పెరుగుదలకు తోడ్పడు శక్తి ; వర్ధనం = అధికము / పెరుగునట్లు చేయువాడు / పెంపొందించు వాడు; ఉర్వారుకం = దోస పండు; ఇవ = వలె; బంధనాత్ = బంధమును తొలగించు; మృత్యోర్ = మృత్యువు నుండి; అమృతాత్ = అమృతత్వము కొరకు / అమరత్వము కొరకు; మాం = నన్ను; ముక్షీయ = విడిపించు. తాత్పర్యం: అందరికి శక్తి నొసగే ముక్కంటి దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని నేను (మేము) పూజించు చున్నాము. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినటుల (అంత సునాయాసముగా లేక తేలికగా) నన్ను (మమ్ము) అమరత్వము కొరకు మృత్యు బంధనము నుండి విడిపించు గాక! ప్రాశస్త్యము: మనకు ఉన్న, తెలిసిన మంత్రాలలో గాయత్రి మంత్రం వలె ఈ “మహా మృత్యుంజయ మంత్రం” పరమ పవిత్రమైనది, అతి ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహలాన్ని రుద్రుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. ఈ మంత్రం జపించిన వారు కూడా ఆ రుద్రుని ఆశీస్సులు పొంది మృత్యుంజయులగుదురు అని పలువురి నమ్మకం. ఇది ఒక విధమైన మృత-సంజీవని మంత్రం అని చెప్ప వచ్చు. అంతేకాక ఆపదలు కలిగినపుడు కూడా దీనిని చదువుకో వచ్చును. సాధారణంగా ముమ్మారు గాని, తొమ్మిది మార్లు గాని, లేదా త్రిగుణమైన సంఖ్య లెక్కన దీనిని పారాయణం చేస్తారు. ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు, మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది. ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది. ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది. శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలాధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాతఃకాలన్నే 𝟏𝟎𝟖 సార్లు, ప్రదోషకాలంలో 𝟏𝟎𝟖 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది. ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి. త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని కీర్తిస్తున్నాం. యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు. సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రుంగిపోయిన స్వామీ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు. పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు. చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు. ఉర్వారుకం –ఇవ – బంధనం : దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు. మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే. ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటివన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం. అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు. శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు కామధేను వతడింట గాడి పసర మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు. మనకున్న చిరంజీవులలో ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం, రావణ వధానంతరం అయోధ్యకు చేరుకున్న రామచంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం. ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది. ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము. మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం..ఇది కాక "మృత్యుంజయ స్తోత్రము" లేదా "మహామృత్యుంజయ స్తోత్రము" అనే స్తోత్రం కూడా ఉంది. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట. 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

🔔 *తిరుమల వైభవం* 🔔 *శ్రీమహావిష్ణువు కి చిహ్నాలైన శంఖు చక్రాది పంచ ఆయుధాలను *ఆయుధాలలో ఉన్నతమైన చక్రం.. "చక్రత్తాళ్వార్"అని కీర్తించబడుతున్నది. తిరుమల తిరుపతిలో …శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై అనేక లీలా విశేషాలు చూపించాడు.* *తొండైమాన్ చక్రవర్తి పుట్టలోనున్న అర్చావతారమూర్తిని పాలతో అభిషేకించి, ఆ మూర్తిని వెలుపలికి తీసుకువచ్చి పిండితో చేసిన సిరి ధాన్యాల ఆహారపిండిని నివేదించాడు. అతని భక్తికి సంతోషించిన మహావిష్ణువు తొండైమాన్ తో స్వయంగా సంభాషించాడు. ఇద్దరూ స్నేహితులయ్యారని పురాణగాధ. క్రమంగా తొండైమాన్ భక్తి, మహావిష్ణువు అభిమానము పెరుగుతూ వచ్చాయి.* *ఒకనాడు తొండైమాన్ చక్రవర్తి సభకి కొంతమంది మునులు వచ్చారు. చక్రవర్తి వారిని సకల మర్యాదలతో ఆహ్వానించి వారి రాకకు కారణాన్ని వినయంగా అడిగాడు.*అందుకు ఆ మునులు " మేము ఈ ప్రక్కనున్న కొండమీద తపస్సు చేసుకునే మునులం. అక్కడ ‘సిమ్మాదనుడు’ అనే దానవుని హింసలు భరించలేక పోతున్నాము. మా యజ్ఞయాగాలకు తపస్సుకు విఘాతం కల్పిస్తున్నాడు. మీరు ఆ దానవుని సంహరించి మమ్మల్ని కాపాడండి." అని కోరారు.* *తొండైమాన్ ఆలోచనలో పడ్డాడు. సాటి రాజులతో తలపడి యుధ్ధంచేయడానికి సిధ్ధమే. కాని కౄరుడైన దానవుని సంహరించడం మానవుడినైన నాకు అంత తేలికైన పని కాదు.” అని అన్నాడు.* *దానికి ఆ మునులు… “మీరు వేంకటేశ్వరస్వామికి మిత్రులని మాకు తెలుసు. స్వామివారి అనుమతితో మీరు ఆ దానవునితో యుధ్ధం చేసినట్లైతే మీరు తప్పక విజయం సాధిస్తారు. మా మాట కాదనకండి" అని అన్నారు.*తొండైమాన్ సంతోషించాడు. "ముని శ్రేష్టులారా.. మీరు చెప్పినది వాస్తవం. స్వామి, నాకు యుధ్ధం చేయడానికి అనుమతి యిస్తే, తప్పకుండా యుధ్ధం చేస్తాను." అన్న తొండైమాన్ చక్రవర్తిని మునులు ఆశీర్వదించారు.* *తల ఎత్తి చూసిన చక్రవర్తికి ఇంద్రాది దేవతలు సాక్షాత్కారమిచ్చారు.* *తొండైమాన్ కి ఆశ్చర్యం కలిగింది. మహా సంతోషంగా మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు.* *మహావిష్ణువు చక్రవర్తిని ఆహ్వానించాడు. మహావిష్ణువు కి సంగతి తెలిపి ఆ దానవునితో యుధ్ధానికి సమ్మతి కోరాడు."నీవు సిమ్మాదనునితో యుధ్ధం చెయ్యి, విజయం నీకే లభిస్తుంది. నీకు సహాయంగా నా శంఖు, చక్ర, గద, ధనుర్బాణ, కరవాల మొదలైన పంచాయుధాలను యిస్తున్నాను. నా అనుగ్రహం నీకు లభిస్తుంది." అని ఆశీర్వదించి పంపాడు.* *యుధ్ధం చాలా తీవ్రంగా సాగింది. ఆఖరికి తొండైమాన్ ప్రయోగించిన చక్రాయుధం దానవుని శిరస్సు ఖండించినది.*దేవతలు పుష్పవాన కురిపించారు.*తొండైమాన్ మహావిష్ణువు వద్ధకు వచ్చి పంచ ఆయుధాలను తిరిగి సమర్పించాడు.* *కాని మహావిష్ణువు "రాజా.. నేను ఒకరికి యిచ్చిన వస్తువును తిరిగి తీసుకునే ఉద్దేశ్యంతో అనుగ్రహించను. ఇవి నీ దగ్గరనే వుండనీ, నీవు,నేను వేరు కాదు." అని అన్నాడు.*తొండైమాన్ దానికి అంగీకరించలేదు. కారణమేమిటి అంటే శంఖు చక్రాలు మహావిష్ణువుకే సొంతమైనవని, వాటిని పొందే అర్హత తనకు లేదని భక్తిపూర్వకంగా చెప్పాడు.* *"దేవా! శంఖు, చక్రాలు మీ యొక్క చిహ్నాలుగా భక్తులు భావిస్తారు" అని అన్నాడు.*మహావిష్ణువు యొక్క అర్చావతారమూర్తికి శంఖు, చక్రాలు ప్రధాన చిహ్నాలు. అంతేకాని శంఖు, చక్రాలు ధరించిన మూర్తులు మహా విష్ణువుమూర్తి కాలేవు. ఆలయాల వద్ద వుండే ద్వారపాలకులు కూడా శంఖు చక్రాలు ధరిస్తారు కాని మహావిష్ణువు కాలేరు కదా..* *శ్రీ మహా విష్ణువుకి నిరంతరమైన చిహ్నం ఒకటి వుంది. అదే శ్రీవత్సం. అది ఒకటే చాలు శ్రీ మహావిష్ణువు కి చిహ్నం అని చెప్పడానికి అని ఆళ్వారులు కీర్తిస్తారు.* *శ్రీ మహావిష్ణువు చక్రవర్తిని అర్ధం చేసుకున్నాడు.* *తొండైమాన్ తో.. "నీకు యిచ్చిన పంచ ఆయుధాలు నీకు అవసరం లేకపోతే తిరుమలలో ఏదో ఒక ప్రాంతాన విడిచిపెట్టు. భవిష్యత్ లో నా భక్తుడే వాటిని తిరిగి నాకు సమర్పిస్తాడు. అంతవరకు నేను శంఖు, చక్రాలు లేకుండానే దర్శనమిస్తాను." అని తొండైమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు వేంకటేశ్వరుడు.* *మహావిష్ణువు చెప్పిన విధంగా తొండైమాన్ చక్రవర్తి పంచ ఆయుధాలను ఒక్కొక్క ప్రాంతంలో వదలి వేశాడు. కాలక్రమేణా ఆ ప్రాంతాల్లో పుణ్య తీర్ధాలు ఏర్పడినవి. ఈనాటికీ తమని దర్శించ వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నవీ పంచాయుధ తీర్ధాలు.* *కొన్ని వేల సంవత్సరాలు గడిచాక తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి. శ్రీ రామానుజాచార్యుల వారు శంఖు, చక్రాలు సమర్పించారు. ఆ శంఖు చక్రాలనే ఈనాడు మనము దర్శిస్తున్నాము.* https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

త్వరలో మరిన్ని ఆధ్యాత్మిక అంశాలతో రాబోతున్న మన సత్సంగం ఛానెల్ తప్పక subscribe చేసుకోండి 🙏🏻 https://youtube.com/@satsangam7?si=M1zavtjRbJlMF2NS 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

🔔 *సుభాషితమ్* 🔔 శ్లో𝕝𝕝 *కలిః శయానో భవతి సంజిహానస్తు* *ద్వాపర ఉత్తిష్ఠన్ర్తేతా భవతి కృతం* *సంపద్యతే చరన్ చరైవేత్తి, చరైవేత్తి* తా𝕝𝕝 అంటే *నిద్రపోతుంటే కలియుగం, లేచి కూర్చుంటే ద్వాపర, లేచి నుంచుంటే త్రేతా*, లేచి తన *లక్ష్యం వైపు అడుగులు వెయ్యడం సత్యయుగం*. లక్ష్య ప్రాప్తి కొరకు అడుగులు వెయ్యాలి..... ముందుకు వెళ్ళాలి https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

🔔 *అనగనగా...* 🔔 *నేను లేకపోతే?* అశోక వనంలో రావణుడు... సీతమ్మ వారి మీదకోపంతో... కత్తి దూసి, ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు.... హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని రావణాసురుని తలను ఖండించాలి' అని కానీ మరుక్షణంలోనే మండోదరి... రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! ఆశ్చర్య చకితుడయ్యాడు. '"నేనే కనుక ఇక్కడ లేకపోతే... సీతమ్మను రక్షించే వారెవరు... అనేది నా భ్రమ అన్నమాట" అనుకున్నాడు హనుమంతుడు! బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం, 'నేను లేకపోతే ఎలా?' అని. సీతామాతను రక్షించే పనిని, ప్రభువు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు. అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది 'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో... వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. **మరింత ముందుకు వెళితే త్రిజట ....తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందనీ, అది లంకను కాల్చివేస్తుందనీ..దాన్ని నేను చూశాను ....అనీ చెప్పింది. అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి మాత్రమే రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. తాను లంకను కాల్చడం ఎలా సాధ్యం.. అనుకున్నాడు అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను ...అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు... తను ఇప్పుడు ఏం చేయాలి? సరే, ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది.... అనుకున్నాడు. * హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు... హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. అప్పుడు హనుమంతునికి అర్థమైంది, తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని పై ఉంచాడు అని. ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే .... విభీషణుడు ఆ మాట చెప్పగానే... రావణుడు ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. కోతులకు తోకంటే మహా ఇష్టం . తోకకు నిప్పు పెట్ట0డి' అన్నాడు. అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. "ప్రభువు నాకే చెప్పి ఉంటే... నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! "ఆలోచనల వరంపరతో ఆశ్చర్యంలో మునిగిపోయాడు. పరమాశ్చర్యం ఏంటంటే... వాటన్నిటికే ఏర్పాట్లు... రావణుడే స్వయంగా చేయించాడు. అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు ....తనకు"లంకను చూసి రా"అని మాత్రమే ఆజ్ఞాపించడంలో ఆశ్చర్యం ఏముంది! ** అందుకే ఒకటి గుర్తుంచుకోండి. ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం . అందువల్ల * నేను లేకపోతే ఏమవుతుందో* అన్న భ్రమలో ఎప్పుడూ పడవద్దు 'నేనే గొప్పవాడి'నని గర్వపడవద్దు. *భగవంతుడి కోటానుకోట్ల దాసులలో అతి చిన్నవాడను* అని ఎఱుక కలిగి ఉందాం. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

🔔 *సంస్కారం* 🔔 *దేవాలయ దర్శన* *నియమాలు* దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి. దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము. 1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి. 2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు. ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు.) 3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు. 4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి. 6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి. 7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి. 8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి. తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి. 9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడు రాకుండా తీస్కోవాలి. 10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి. 11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి. 12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి. 13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు. 14) అనవసరంగా మాట్లాడటం.. పరుష పదజాలం ఉపయోగించకూడదు 15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు. https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B 16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు. 17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు. 18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు. 19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు. 20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు. 21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి. 22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు. 23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు. 24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు. 25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు. 26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు. 27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు. 28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు. 29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు. 30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు. 31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి. 32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి. 33) గోపుర దర్శనం తప్పక చేయాలి. 34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6 గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు. 35) ఆలయం లోపల గట్టిగా మాట్లాడకూడదు. 36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు. 🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻