
🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
February 11, 2025 at 03:42 AM
🔔 *జై శ్రీరాం* 🔔
*ఆనాడు - ఈనాడు*
🌿హనుమంతుడు సీతమ్మను వీపు మీద కూర్చోమని అడిగేసరికి "నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి వచ్చేటప్పుడు నేను సముద్రంలో పడిపోవచ్చు, లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డురావచ్చు, అప్పుడు నీకు వాళ్ళకి యుద్ధం జరగచ్చు.
🌸ఆ సమయంలో నువ్వు వాళ్ళతో యుద్ధం చేస్తావ లేక నన్ను కాపాడుకుంటావా. ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకి దొరికితే రావణుడు నన్ను ఎవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు.
🌿అందుచేత నేను నీ వీపు మీద కూర్చుని ఆవలి ఒడ్డుకి రావడం కుదరదు. అమ్మా! నేను యుద్ధం చెయ్యగలను, నిన్ను క్షేమంగా రాముడి దగ్గరికి తీసుకువెళతాను అని అంటావేమో, నేను స్పృహలో ఉండగా, తెలిసి తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో స్పృశించను.
🌸రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి" అని చెప్పింది.
🌿అప్పుడు హనుమంతుడు "ఒక మనుష్య స్త్రీగా ఉండి ఇన్ని కష్టాలు పడుతూ, ఇటువంటప్పుడు కూడా 'నేను రాను' అనడం నీకే చెల్లింది తల్లి.
🌸నువ్వు నా వీపు మీద కూర్చుని రాను అంటున్నావు కదా, పోని రాముడి దగ్గరికి నేను వెళ్ళి చెప్పడానికి ఏదన్నా ఒక విషయం చెప్పు తల్లి" అన్నాడు.
🌿సీతమ్మ చెబుతుంది చిత్రకూట పర్వతం పై అరణ్యవాసము జరుపుతున్నప్పుడు జరిగిన విషయము.
🌸 ఒకరోజు చిత్రకూట పర్వతానికి ప్రక్కన ఉన్న చిన్న చిన్న పర్వతాలమీద విహరిస్తు ఈశాన్య పర్వతము మీద ఉన్న కొలనులో రాముడు స్నానము చేసి తడి బట్టలతో రాముడు సీత వద్దకు వస్తాడు.
🌿 అప్పుడు సీతమ్మ తల్లి అక్కడ ఒరుగులు (వడియాలు) ఎండపెట్టుకొంటు ఉంటుంది.
ఆ సమయములొ ఒక కాకి అక్కడకు వచ్చిఆ వడియాలు తినడడం ప్రాంభిస్తుంది.
🌸అది చూసిన సీత ఆ కాకి మీద ఒక మట్టి బెడ్డ విసురుతుంది. అప్పుడు ఆ కాకి సీతమ్మ తల్లి వక్షస్థలము పై వ్రాలి ముక్కుతో సీతమ్మ వంటి నుండి మాంసపు ముక్క కరచు కుంది
🌿 దానితో సీతమ్మ చాలా బాధ పడుతున్న సమయములొ ఆమె పట్టు చీర సడలి వడ్డాణము కూడా వదులౌతుంది. చేతికందిన ఆ వడ్డాణాన్ని తీసి ఆ కాకిని కొట్ట బోతుంది.
🌿అదిచూసి రాముడు సీత ఒక కాకిని కొట్టడానికి మెలనూలు (వడ్డణం) తీసి దానిమీద విసురుతావేమిటి అని నవ్వుతాడు.
🌸 ఆ తరువాత కాకి వెళ్ళిపోతుంది, కొంత సమయం పోయాక సీతమ్మ రాముడి ఒడిలొ నిద్ర పోతుంది,
🌿 ఇంకొద్ది సమయము పోయాక సీతమ్మ తల్లి నిద్ర లేచి రాముడిని ఒడిలో పడుకొబెట్టు కొంటుంది.
🌸సీతమ్మ రాముడి ఒడిలొ నిద్ర పోతున్నంత సమయం కాకి రాదు, సీత ఒడిలో రాముడు నిద్రకు ఉపక్రమించిన వేంటనే వచ్చి అమ్మవారి వంటిపై మళ్ళి వ్రాలి ముక్కురతో మాంసాన్ని గ్రుచ్చుకొని తింటుంది.
🌿 దానితో సీతమ్మ వక్షస్థలము నుండి రక్తము కారుతుండగా ఆ రక్తపు తడి
శ్రీరాముడు నుదురు మీద పడుతుంది.
🌸శ్రీరాముడు వేంటనే నిద్ర లేచి ఎవరురా ఐదు తలల పాముతో ఆట అడుతున్నారు అని ప్రక్కన ఉన్న దర్భను తీసి బ్రహ్మాస్త్రాన్ని అబిమంత్రీంచి ఆ కాకి మీద వేస్తాడు.
🌿ఆ కాకి అక్కడ నుండి అన్ని లోకాలకు పరుగు పెట్టుతుంది. ముల్లోలాలలో ఆ కాకిని రక్షించేవారు కనపడరు.
🌸చివరకు గతిలేకా ఆ కాకి వచ్చి రాముడిని వేడుకొంటుంది. అప్పుడు రాముడు సీత శాంతించడం చూసి బ్రహ్మాస్త్రానికి ఏదో ఒకటి సమర్పించవలెనని పలుకగా కాని ఒకసారి బ్రహ్మాస్త్రం వేసిన తరువాత ప్రాణములతో సమానమైనదానిని ఇచ్చేయ్యాలి.
🌿మరి నువ్వు ఏమిస్తావు' అని ఆ కాకసురుడిని రాముడు అడిగాడు. అప్పుడా కాకాసురుడు తన కుడి కన్నుని బ్రహ్మాస్త్రానికి ఆహారంగా వేసి రాముడికి నమస్కారం చేసి, వెళ్ళిపోయాడు.
🌸ఆనాడు ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం వేసిన రాముడు ఇవ్వాళ ఎందుకు ఊరుకున్నాడో ఆలోచించమని ఒకసారి రాముడికి చెప్పు" అని సీతమ్మ కాకాసుర వృత్తాంతాన్ని హనుమకి చెప్పింది... స్వస్తీ..🌞🙏🌹🎻
https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏
❤️
👍
😂
😮
76