HT Telugu
February 10, 2025 at 04:13 AM
> ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా 2025 రోజుకో రికార్డు బ్రేక్ చేస్తోంది! కోట్లాది మంది భక్తులు కుంభమేళాను సందర్శించి పవిత్ర స్నానాలు చేస్తున్నారు. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ రికార్డు కూడా ఇప్పుడు కుంభమేళా పేరిట ఉండేడట్టు కనిపిస్తోంది! మహా కుంభమేళాకు దారితీసే రహదారుల్లో 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని సమాచారం! 5 కిలోమీటర్లు ప్రయాణించడానికి 5 గంటల సమయం పడుతోందని తెలుస్తోంది.