HT Telugu
February 11, 2025 at 01:44 AM
> స్టాక్ మార్కెట్ అప్డేట్స్..
దేశీయ స్టాక్ మార్కెట్లో ఎఫ్ఐఐలు సెల్లింగ్ కొనసాగుతోంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2463.72 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1515.52 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఫిబ్రవరి నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు రూ. 12643.12 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 8,789.57 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. మంగళవారం ట్రేడింగ్ సెషన్ని ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.