Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
Dr. Bairi Naresh (డా.బైరి నరేష్-MNS)
February 7, 2025 at 06:13 AM
రమాబాయి గూర్చి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ అంబెడ్కర్ ని ఒక మహా పర్వతంగా నిలబెట్టింది మాత రమాభాయి అంబెడ్కర్ జన్మదినం: ఫిబ్రవరి 7, 1898 మరణం: మే 27 ,1935. భారత దేశ చరిత్రలో అమ్మ రమాబాయికి ఒక పేజీ ని పెట్టాల్సిందే, బాబా సాహెబ్ ను గుర్తించినంతగా తన స్వంత జాతి ప్రజలు బాబా సాహెబ్ విజయాలకు కారణమైన రామబాయిని గుర్తించలేదనే చెప్పాలి. తన త్యాగాల పునాదుల మీద బాబా సాహెబ్ ని నిలబెట్టింది. డాక్టర్ అంబేద్కర్ గారి ఒకొక్క మెట్టు వెనుక రమాబాయి అమ్మ పంటి బిగువున బిగపట్టిన బాధ తాలూకు గాయలున్నాయి. బాబా సాహెబ్ ఇదంతా గుర్తించారు. ఆమెకు గుర్తుగా 1941 ఆయన వ్రాసిన ' థాట్స్ ఆన్ పాకిస్తాన్"పుస్తకాన్ని అంకిటమిచ్చారు. అతి తొందరగా "నా" అనుకునే వారిని పోగొట్టుకున్న రమాబాయితో బాబా సాహెబ్ వివాహం 1906 లో బైకుల్లా మార్కెట్ లో జరిగింది. అప్పుడు బాబా సాహెబ్ కి 14 ఏళ్ళు, రమాబాయి కి 9 ఏళ్ళు. అతి చిన్నవయసులోనే వివాహం జరగడం వలన రమాబాయి చదువుకు దూరం అయ్యింది. బాబా సహేబ్ తనకు చదువు చెప్పించాలని ప్రయత్నం చేయడం జరిగింది, ఈ ప్రయత్నంలో ఆమె కొద్దిగా వార్త పత్రికల హెడ్ లైన్ లు చదవవలగడం నేర్చుకుంది. తన పెళ్లి తరువాత బాబా సాహెబ్ మెట్రిక్యులేషన్ పాస్ అయ్యారు. డాక్టర్ అంబెడ్కర్ గారికి ఎల్లవేళలా తోడుంటూ ఎన్నో కష్టాలను ఓర్చుకుంటూ జీవనం సాగించడం జరిగింది. ఉన్నత చదువులకు బరోడా రాజు ప్రోద్బలంతో బాబా సాహెబ్ లండన్ వెళ్లడం జరిగింది. ఆ సమయంలో ఇంటి బాధ్యతలు రమాబాయి ఒక్కరే నెరవేర్చుకున్నారు. బాబా సాహెబ్ ఉన్నత చదువులకోసం తాను ఎన్నో బాధలను అనుభవించింది. ఇల్లు గడవని స్థితిలో అమ్మ పిడకలు చేసి అమ్మేవారు, ఆ డబ్బులతో ఇల్లు గడిచేలా చూడటమే కాకుండా అందులో కొంత డబ్బు డాక్టర్ అంబెడ్కర్ కి పంపించేవారు. ఆమె జీవిత కాల కష్టమే ఈ రోజున రాజ్యాంగం ద్వారా హక్కులు అణగారిన వర్గాల ప్రజలు అనుభవిస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఈ విషయాలు స్వయంగా డాక్టర్ అంబెడ్కర్ గారు 3 ఫిబ్రవరి 1928 న బహిష్కృత భారత్ పక్ష పత్రికలో తన సంపాదకీయంలో వ్రాయడం జరిగింది. ఒకొక్కరుగా తన బిడ్డలు రాలిపోతున్నా మొక్కవోని ధైర్యం అమ్మ సొంతం. ఎంతటి బాధనైన తన గుండెల్లోనే దాచుకుని బాబా సాహెబ్ కి ధైర్యాన్నీ నూరిపోసేవారు. ఈ దంపతుల కష్టాలు వింటే పగవాడికి కూడా ఇన్ని కష్టాలు రావద్దని కోరుకుంటాం. 1907 నుండి మొదలయిన బాబా సాహెబ్ చదువు ప్రస్థానం 1953 ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో ముగిసింది. ఇవి సాధించటానికి వాళ్ళు ఇద్దరూ కారణమే, ఈ ప్రతీ చదువు వెనుక అమ్మ రమాబాయి త్యాగo ఉంది. బాబాసాహెబ్ లండన్ కి వెళ్తున్నపుడు రమాబాయి గర్భవతిగా ఉంది. డాక్టర్ అంబెడ్కర్ గారి సమకాలికులు చాలా సుఖంగా బ్రతుకుతూoటే ఈ దంపతులు తమ రక్తంను చమటగా మారుస్తూ, తమ కన్నీళ్లతో పీడిత వర్గాలకు భవిష్యత్ బాటలు ఐనారు. రమాబాయి అమ్మ - అబ్బాయి రమేష్ చనిపోయారు, గంగాదర్ చనిపోయారు, ఒక్కగానొక్క ఆడ కూతురు ఇందు చనిపోయారు, చివరివారు బాబా సాహెబ్ కి అత్యంత ఇష్టుడు చిన్నవాడు అయినా రాజా రతన్ కూడా చనిపోయాడు, యశ్వంత్ ఒక్కరే మిగిలాడు. బాబా సాహెబ్ జీవితం అంటే పోరాటo ఆ పోరాటంలో తనతో పాటు రమాబాయి అమ్మకూడా తన వంతు పనిచేసింది. రమాబాయికి చదువు విషయంలో బాబాసాహెబ్ ని చూసి గర్వపడేది. ఆయన అసమాన ప్రతిభను చూసి నివ్వెర పోయేది, సమానత్వం కోసం ఆయన పడుతున్న తపణకు చలించిపోయేది, ఇదంతా చేస్తూ ఆయన ఆరోగ్యo కాపాడుకోలేక పోతున్నారు అంటూ అనుక్షణం తపన పడేది. తన కొడుకు చనిపోయినప్పుడు బాబా సాహెబ్ చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితి చూస్తూ తన కొంగును చింపి కొడుకు శవం మీద కప్పి ,తమ పరిస్థితి ని ఎదుటివారికి చూపించకుండా జాగ్రత్త పడిన విషయం తెలిస్తే బాబా సాహెబ్ కోసం ఆమె పడిన ఆవేదన ఇట్టే అర్థం అవుతుంది. బాబాసాహెబ్ చదువులు, జ్ఞానం అమ్మ రమాబాయి అండతోనె సాధ్యపడింది. ఎవరు ఏమనుకున్నా ఇది నిజం. భావోద్వేగాల మాటలు అనుకునేల ఉన్నా తన తొమ్మిదేళ్ల వయసులో బాబాసాహెబ్ లోకి వచ్చి ముప్పయి ఏళ్ళు ఆయనతో ఉండి అత్యున్నత శిఖరాలు ఎదగడం లో అమ్మ పడిన కష్టo ,ఈ భూమి మీద ఎవరికి ఇప్పటికి రాలేదు అనిపిస్తుంది. రమాబాయి అమ్మ అంటే త్యాగo రమాబాయి అమ్మ అంటే ఒక పోరాటం... చివరికి ఈ పోరాటం అలిసి జబ్బుపడి, చివరిగా 1935 లో విశ్వాంతరాలల్లో కలిసి పోయింది. అమర్ రహే ...అమ్మ రమాబాయి...అమర్ రహే.... మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుల కోసం సేకరించినది. ఎందరో త్యాగాలతో మనం ఈ హక్కులు అవకాశాలు పొందుతున్నాము. కాని మన అమాయక ప్రజలు దేవుళ్ళ భజన చేస్తున్నారు. ఏ ఒక్క దేవుడు పేదల బతుకులు మార్చలే, గర్భగుడిలో ఉండి అటు వ్యాపారులకు ఇటు పూజారులకు కూర్చున్న కాడికి సంపద వచ్చేలా చేస్తాయి. నీవు గుడికి వెళితె ఎంత డబ్బుతో వెళ్ళినా నుదిటికి పూసే బూడిద బొట్టు తప్ప నీకేమి మిగలదు. చర్చీకెలితె సంకలో బిబిల్ దిండుగా తప్ప దేనికి పనికి రాదు పైగా దశమభాగం నొక్కేస్తారు. ఏమతం చూసినా నిన్ను దోచుకోవడానికి తప్ప విజ్ఞాన వంతం చైతన్యం చేయడానికి కాదని గ్రహించాలని మనవి. ఇట్లు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఫౌండర్ & జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్ 7013160831 ఈరోజు వాట్సాప్ గ్రూప్ లో పెట్టె రమాబాయి జీవితచరిత్ర పుస్తకం పిడిఎఫ్ అందరూ చదవాలని మనవి. ఇంకా ఎవరైనా నాస్తికులు హేతువాదులు చారువాక లోకాయుత సిద్ధాంత పరులు ఉంటె మన జిల్లా వాట్సాప్ గ్రూప్ లో ఆడ్ చేయగలరు. అలాగే వారి వివరాలు 7013160831 కు పంపగలరు. దయచేసి ఇతర అనవసర విషయాలు గ్రూప్ లో పెట్టకండి.
🙏 ❤️ 👍 😢 23

Comments