GSWS UPDATES
GSWS UPDATES
January 29, 2025 at 09:44 AM
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో మూడు చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి..మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. https://t.me/gswsformsgos/131

Comments