
GSWS UPDATES
5.7K subscribers
About GSWS UPDATES
All Information Schemes, Policies,News,G.os Employee Updated
Similar Channels
Swipe to see more
Posts

*V8.1 NTR Bharosa Pensions App :* కింద ఇవ్వబడిన 10 జిల్లాలో పెన్షన్ పంపిణీ చేయు అధికారులు వెంటనే V8.1 NTR Bharosa Pensions App ను డౌన్లోడ్ చేసుకోగలరు. [ Play Store లొ ఉండదు ] Download here https://t.me/gswsformsgos/167 1. అనంతపురం 2. చిత్తూర్ 3. తిరుపతి 4. అన్నమయ 5. శ్రీ సత్యసాయి 6. నంద్యాల 7. వైఎస్ఆర్ 8. నెల్లూరు 9. కర్నూలు 10. ప్రకాశం మిగిలిన 16 జిల్లాల వారు V8.0 యాప్ లొ పెన్షన్ పంపిణి చేయగలరు.


Clarification on clustering of secretariats Please note: *Map the adjacent secretariats based on geographical proximity. Don't consider population*

*ఏపి బడ్జెట్ కేటాయింపులు* మొత్తం రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ను రూపొందించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇందులో వ్యవసాయానికి రూ.48,340 కోట్లు, వయబులిటీ గ్యాఫ్ ఫండ్ రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. అలాగే ఎస్సీల గృహ నిర్మాణానికి రూ.50 వేలు, ఎస్టీల గృహ నిర్మాణానికి రూ.70 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు ఎన్టీఆర్ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి తెలిపారు. *ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..* ▪️పాఠశాల విద్యకు రూ.31,806 కోట్లు ▪️వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు ▪️పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.18,848 కోట్లు ▪️జలవనరుల అభివృద్ధికి రూ.18,020 కోట్లు ▪️మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధికి రూ.13,862 కోట్లు ▪️విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు ▪️వ్యవసాయానికి రూ.11,636 కోట్లు ▪️సాంఘిక సంక్షేమానికి రూ.10,909 కోట్లు ▪️ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు రూ.10,619 కోట్లు ▪️రవాణా శాఖకు రూ.8,785 కోట్లు ▪️ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్పులకు రూ.3,377 కోట్లు ▪️పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు, ▪️స్వచ్ఛ ఆంధ్ర కోసం రూ.820 కోట్లు ▪️ఐటీ, ఎలక్ట్రానిక్స్ రాయితీలు రూ.300 కోట్లు ▪️ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు ▪️మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు ▪️తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు ▪️అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ▪️దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు ▪️రోడ్ల నిర్మాణం, మరమ్మతులు రూ.4,220 కోట్లు ▪️బాల సంజీవని పథకం కోసం రూ.1,163 కోట్లు ▪️పోర్టులు, ఎయిర్పోర్టుల కోసం రూ.605 కోట్లు ▪️చేనేత, నాయీ బ్రాహ్మణుల ఉచిత విద్యుత్కు రూ.450 కోట్లు ▪️RTGSకు రూ.101 కోట్లు ▪️ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు రూ.27,518 కోట్లు ▪️అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు ▪️పోలవరం కోసం రూ.6,705 కోట్లు ▪️జల్జీవన్ విషన్కు రూ.2,800 కోట్లు ▪️వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు ▪️పౌరసరఫరాల శాఖకు రూ.3,806 కోట్లు ▪️బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు ▪️ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు ▪️ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు ▪️అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు ▪️మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, దివ్యాంగుల కోసం రూ.4,332 కోట్లు ▪️వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ.19,264 కోట్లు ▪️పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,156 కోట్లు ▪️ఆర్ అండ్ బీకి రూ.8,785 కోట్లు ▪️యువజన, సాంస్కృతిక శాఖకు రూ.469 కోట్లు ▪️తెలుగు భాష అభివృద్ధి, ప్రచారం కోసం రూ.10 కోట్లు ▪️నవోదయ 2.0 కార్యక్రమానికి రూ.10 కోట్లు ▪️డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.3,486 కోట్లు ▪️రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు రూ.500 కోట్లు ▪️ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు ▪️ITI, IITల కోసం రూ.210 కోట్లు ▪️దీన్దయాళ్ అంత్యోదయ యోజనకు రూ.745 కోట్లు ▪️రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు రూ.10కోట్లు ▪️ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు ▪️ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు ▪️మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లు ▪️ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్కు రూ.400 కోట్ల బడ్జెట్ను కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాజధాని ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడిందన్నారు. అన్ని రంగాలు మళ్లీ బలం పుంజుకుంటున్నాయని చెప్పారు. సేవల రంగంలో 11.7 శాతం వృద్ధి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు. పెన్షన్లను రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, దీపం పథకం ద్వారా అర్హులకు 3 ఉచిత సిలిండర్లు, 204 అన్న క్యాంటీన్లను ప్రారంభించినట్లు తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు, తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు, రూ.25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించినట్లు మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.

*💥💥NPCI Action Taken UPDATE* ✅ *NPCI inactive records:: It was observed that without activating, secretariat staff submitted that they have activated the bank Accounts.* 🟢 *All NPCI inactive cases verified with NPCI and repushed back to the secretariat employee logins*

28-02-2025 సాయంత్రం నాటికి అందరూ MPDO/MC లకు ఎపి సేవా పోర్టల్ నందు సచివాలయం రేషనలైజేషన్ సంబంధించి గ్రూపింగ్ చేయుటకు మొడ్యుల్ ఇవ్వబడును టెక్నికల్ ఫంక్షనరీ రేషనలైజేషన్ కొరకు ఎటువంటి విమర్శలకు తావు లేకుండా శ్రద్ధగా గ్రూపింగ్ చేయవలెను Alphatical ఆర్డర్ లో మరియు జనాభా/ భౌగోళిక సామీప్యత ఆధారంగా గ్రూపింగ్ చేయవలెను మండలం లేదా మున్సిపాలిటీ పరిధిలో సరి సంఖ్యలో సచివాలయాలు వున్నట్లయితే ప్రతి రెండు సచివాలయం లు ఒక గ్రూప్ చేయవలెను. బేసి సంఖ్యలో వున్నట్లయితే జనాభా/భౌగోళిక సామీప్యత ఆధారంగా మూడు,లేదా ఒకటి ఒక గ్రూప్ కి వచ్చేటట్లు చేయవలెను Join for updates https://whatsapp.com/channel/0029VaAU0tp2phHLZzXVff3V https://t.me/gswsformsgos


*అందరు PDO'S లకు తెలియచేయునది...* ఎన్టీఆర్ భరోసా పిన్షన్లు - ప్రతి నెల ఒకటో తారీకు ఉదయం 5:00 గంటలకే జరుగుతున్న సామాజిక భద్రత పిన్షన్లు పంపిణిను ఇక నుండి ఉదయం 07:00 గంటలకు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం వారు జిల్లా అధికారులను ఆదేశించి యున్నారు. ఆ సమయానికే APP పనిచేసేలా మార్పులు చేసియున్నారు. కావున, PDO'S అందురు కూడా రేపు అనగ తే.01-03-2025ది.న ఉదయం 06:50 గంటలకు మీకు కేటాయించిన క్లస్టర్ వద్దకు చేరుకొని రెడీగా ఉండి 07:00 గంటలకు 100% పంపిణీ ను స్టార్ట్ చేయవలసినదిగా కోరడమైనది. అలసత్యం చేయవద్దు. *Pension పంపిణి లో IVRS ద్వారా వస్తున్న సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి* IVRS issues - 1. సరియైన ప్రవర్తన తో పింఛనుదారులకు pension పంపిణి. 2. అవినీతి కి పాల్పడకుండా pension పంపిణి. 3. పింఛనుదారుల ఇంటి నుండి 300 మీటర్లు దాటి pension పంపిణి చేయాల్సి వస్తే ఎందుకు అలా చేయాలనే కారణం app లో నమోదు చేయాలి... (ఈసారి కొత్తగా reasons నమోదుకు mobile app లో option ఇవ్వడమైనది)

🔔 *WEA / WWDS Note :* *💥Leather Artisan Survey - Important Note* Dear All, 🔰 GSWS Employee Mobile App - Leather Artisan Survey కు సంబందించి, కొంతమంది WEAs/WWDS నేరుగా *"SUBMIT"* option click చేస్తున్నారు. *i) మీ సచివాలయ పరిధిలో వున్న Leather Artisans అందరికి సర్వే పూర్తి చేసిన తరువాత* *ii) మీ సచివాలయ పరిధిలో Leather Artisans లేనిచో,* 🛑అటువంటి సందర్బంలో మాత్రమే "SUBMIT" option పైన click చెయ్యాలి. గమనించగలరు.

Good afternoon to All *🟢All pension transactions status "success".* *✅Please ensure 100% cash withdrawal and update in mobile app.*

*ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు* * ఆంద్రప్రదేశ్ లో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లలో ఈ మార్పులు వర్తింపచేయనున్నారు. * పెన్షనర్ల సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. * ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలున్నాయి. * పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకు పెన్షన్ల పంపిణీ యాప్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. * ఇందులో భాగంగా చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పెన్షన్ పంపణీ యాప్ లో 20 సెకన్ల ఆడియో పెట్టినట్లు తెలిపింది. పెన్షన్ ఇచ్చే ముందు లబ్దిదారులకు సీఎం చంద్రబాబు సందేశంతో కూడిన ఈ ఆఢియో వినిపించాలని ఆదేశించింది. * అలాగే వృద్ధ పెన్షన్ దారులకు పెన్షన్ ఇచ్చేందుకు వెళ్లినప్పుడు నమస్కారాలు తెలియజేయాలని తెలిపింది. * అలాగే పెన్షన్ దారుల ఇంటికి 300 దూరంలో పెన్షన్ పంపిణీ జరిగితే దానికి గల కారణాన్ని మొబైల్ యాప్ లోనే నోట్ చేసేలా ఆదేశాలు ఇచ్చారు. * అలాగే పెన్షన్ దారుల సౌలభ్యం కోసం ఉదయం 6 గంటలకు బదులుగా 7 గంటలకు పెన్షన్లు పంపిణీ చేయాలని అధికారుల్ని ఆదేశించారు. * అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించడం ద్వారా పెన్షన్ దారులకు సంతృప్తికరంగా వాటిని పంపిణీ చేయాలని సెర్ఫ్ సీఈవో కరుణ ఆదేశాలు ఇచ్చారు. * ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని సచివాలయాలు, ఇతర అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. * రాష్ట్రంలో పెన్షన్ల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తోంది. * ఇప్పటికే అనర్హులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం అర్హత లేదని తెలియగానే వారిని జాబితా నుంచి తొలగిస్తోంది. * ఇప్పుడు తాజా మార్పులతో అర్హులకు సంతృప్తి కరంగా పెన్షన్ తీసుకునేలా ఏర్పాట్లు చేస్తోంది.