APTEACHERS
February 1, 2025 at 02:52 AM
*♻️నేటివార్తలు(01.02.2025)*
*✳️నేటి ప్రత్యేకత:*
▪️భారత తీర రక్షక దళ దినోత్సవం (భారత తీర రక్షక దళం ఫిబ్రవరి 1 1977 నుండి పనిచేయడం ప్రారంభించింది. దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1 ఈ దినోత్సవం నిర్వహిస్తారు)
▪️భారతదేశంలో తపాలా బీమా ఫిబ్రవరి 1, 1884 న ప్రారంభమైంది.
*✳️అంతర్జాతీయ వార్తలు::*
▪️జన్మతః పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే తప్ప యావత్ ప్రపంచం అమెరికాకు వచ్చి పోగు పడడానికి ఉద్దేశించింది కాదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
▪️అమెరికాలో వాషింగ్టన్ డిసి సమీపంలో గగనతలంలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొన్న దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య 67 మందికి చేరినట్లు అధికారులు తెలియజేశారు.
▪️ఏడాది ఎన్నికలు నిర్వహిస్తామని ఇదివరకే ప్రకటించిన మయన్మార్ లోని సైనిక ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు తన పదవీ కాలాన్ని పొడిగించుకుంది.
▪️పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో కౌలికోరో ప్రాంతంలోని బంగారు గనిలో బుధవారం నాడు కొండ చరియలు విరిగిపడిన సంఘటనలో పదిమంది ప్రాణాలు కోల్పోయారు.
▪️అమెరికాలోని వెర్టెక్స్ ఫార్మా అనే సంస్థ అభివృద్ధి చేసిన జర్నావెక్స్ అనే కొత్త నొప్పి నివారణ మందుకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్.డి.ఏ) ఆమోదం తెలిపింది.
▪️సెర్బియా లో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా సమ్మె చేస్తున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల గుండా ప్రదర్శనలు చేపడుతూ ఉత్తర ప్రాంత నగరమైన నోవీసాడ్ లో డాన్యూబ్ నదిపై నిర్మించిన వంతెనలను దిబ్బందించడానికి నిర్ణయించారు.
*✳️జాతీయ వార్తలు:*
▪️భారతదేశం భవిష్యత్తులో ఆవిష్కరణల కేంద్రంగా మారనుందని నిన్న బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో భాగంగా నిర్వహించిన ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలియజేశారు.
▪️వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత దేశ అభివృద్ధి రేటు 6.3% నుండి 6.8% మధ్య ఉంటుందని 2024-25 సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే తెలియజేసింది.
▪️షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారి నిరోధక) చట్టం 1989 లోని సెక్షన్ 3 (1) (ఆర్) కేసులలో దూషణ బహిరంగంగా జరిగి ఉండాలని, అలా నిరూపించినప్పుడే అవి చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
▪️త్వరలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న పార్టీకి రాజీనామా చేశారు.
▪️పోలింగ్ సమయంలో వీడియోలను భద్రపరచాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ)ని సుప్రీంకోర్టు నిను ఆదేశించింది.
▪️సాంకేతికతను వినూత్నంగా వినియోగించి గ్రామీణ విద్య గతిని మార్చిన రాజస్థాన్ కు చెందిన మార్గదర్శక విద్యావేత్త మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ మేవాతి, జెమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ -2025 తుది పది మంది జాబితాలో చోటు సంపాదించారు.
▪️ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో దేశంలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్య అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) నిన్న తెలిపింది.
*✳️రాష్ట్ర వార్తలు:*
▪️వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధిరేటులో 2011-12 నుంచి 2020-21 వరకు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడించింది.
▪️రాష్ట్రంలో సైబర్ నేరాల నియంత్రణకు 200 మంది కమాండోలను నియమించనున్నామని రాష్ట్ర నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు.
▪️శాసనమండలి ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నీ నిర్వహించనున్నామని వచ్చే విద్యా సంవత్సరం ఆరంభంలో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేపట్టనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు.
▪️ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు లోయలో రెండు రోజులు పాటు జరిగే చలి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ నిన్న ప్రారంభించారు.
▪️రాష్ట్రంలో రాబోయే రోజులలో గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
▪️రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 117 ను రద్దుచేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి 7500 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
▪️రాష్ట్రవ్యాప్తంగా సగటున 20% చొప్పున పెంచిన భూముల రిజిస్ట్రేషన్ విలువ నేటి నుంచి అమలులోకి రానుంది.
▪️విశ్వవిద్యాలయాల పరీక్షల విధానాన్ని డిజిటలైజ్ చేయడంలో భాగంగా ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టడానికి సాఫ్ట్వేర్ సంస్థలను ఎంపిక చేయడానికి ఉన్న త విద్యాశాఖ టెండర్లను ఆహ్వానించింది.
*✳️క్రీడా వార్తలు:*
▪️భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టి20 క్రికెట్ సిరీస్ లో భాగంగా నిన్న పుణె లో జరిగిన నాలుగో మ్యాచ్ లో భారత జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించి సిరిస్ ను 3-1 తో సొంతం చేసుకుంది.
▪️కౌలాలంపూర్ లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ పోటీలలో భాగంగా నిన్న జరిగిన తొలి సెమీఫైనల్స్ మ్యాచ్ లో భారత జట్టు ఇంగ్లాండ్ ను 9 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్స్ లో ప్రవేశించింది.
❤️
1