⚡SchoolEdu 👈 Join Now
February 4, 2025 at 02:02 AM
*🔊మూడు స్థాయులకూ ఒకేసారి ‘స్థానిక’ ఎన్నికలు!* *🔶ప్రభుత్వ ఆదేశంతో అధికారుల కసరత్తు* *🔷సాధ్యాసాధ్యాలపై తర్జనభర్జనలు* *🍥ఈనాడు, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించింది. దీనిపై ఎన్నికల సంఘం, రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే, ఒకేసారి మూడు స్థాయుల ఎన్నికలు నిర్వహించడం సాధ్యమయ్యే పనేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామ పంచాయతీల ఎన్నికలు పార్టీ రహితంగా... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయి. ఒకేసారి నిర్వహించాల్సి వస్తే పోలింగ్‌ కేంద్రాలు, బూత్‌లు, పార్టీ గుర్తులు, బ్యాలెట్‌ పత్రాలు విడివిడిగా తయారు చేయాల్సి ఉంటుంది. పైగా ఒక ఓటరు... వార్డు సభ్యుడికి ఒకసారి, సర్పంచికి రెండోసారి ఓటు వేయాలి. తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఒక్కొక్కటి చొప్పున మరో రెండు వేయాలి. మొత్తంగా ప్రతి ఓటరు నాలుగు ఓట్లు వేయాల్సి వస్తుంది. ఒకేసారి ఎన్నికలకు వెళితే... వేర్వేరు పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని, అలాంటప్పుడు ఒకేసారి ఇలా నాలుగేసి ఓట్లు వేయడం చాలాచోట్ల సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల లెక్కింపు, ఫలితాల వెల్లడి కూడా వేర్వేరుగా నిర్వహించాలి. పైగా సిబ్బంది, భద్రత దళాలు కూడా భారీగా అవసరం అవుతారు. బ్యాలెట్‌ బాక్స్‌లు సైతం భారీఎత్తున అవసరం. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల కోసమే ఏపీ, కర్ణాటకల నుంచి వాటిని తెప్పించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరపాల్సి వస్తే మరిన్ని బాక్స్‌లు అవసరం పడతాయి. ఒకేసారి ఎన్నికలు జరపాల్సి వస్తే ఒకేరోజు గాకుండా దశల వారీగా నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.* *💥స్థానాల రిజర్వేషన్లు ఒకే దఫాకు పరిమితం!* *🌀గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లకు రానున్న ఎన్నికల్లో ఆయా స్థానాల రిజర్వేషన్లు మారనున్నాయి. గత ప్రభుత్వ హయాంలో 2019లో నిర్వహించిన ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఖరారు చేసిన రిజర్వేషన్లు రెండు దఫాలకు వర్తించేలా పంచాయతీరాజ్‌ చట్టం(2018)లో నిబంధన ఉంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక దాన్ని సవరించింది. డిసెంబరులో నిర్వహించిన శాసనసభ సమావేశాల్లో దీనికి సంబంధించిన పంచాయతీరాజ్‌ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం లభించింది. ఫలితంగా ఆయా స్థానాల రిజర్వేషన్లు ఒకే దఫా మాత్రమే అమలు చేయాల్సి ఉంటుంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లో స్థానాలకు పాత రిజర్వేషన్లకు బదులు కొత్త రిజర్వేషన్లు రానున్నాయి. డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల శాతంపై నిర్ణయం తీసుకొని ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తుంది. దాని ప్రకారం ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేస్తుంది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments