⚡SchoolEdu 👈 Join Now
4.5K subscribers
About ⚡SchoolEdu 👈 Join Now
SchoolEdu channel for Information related to 🔅Teacher Info 🔅UDISE Plus 🔅Student Info 🔅Aadhar 🔅CCE 🔅FRS 🔅MDM 🔅Transfers 🔅School Education GO's 🔅Notification and latest updates 💠Other formats, Proceedings, YouTube tutorials related to School Education Department Telangana💠
Similar Channels
Swipe to see more
Posts
*బడిబాట కోసం ఉపయోగపడే స్లొగన్స్* 🏫 ప్రభుత్వ పాఠశాలలు – విద్యలో నూతన దిశలు! 📢 తెలుగు నినాదాలు: 1. 🎓 ప్రభుత్వ పాఠశాలలో చేరండి – డిజిటల్ విద్యను పొందండి! 2. 📚 ఉచిత పుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం – విద్యార్థులకు అన్నీ ఉచితం! 3. 🏫 బడి బాటలో అడుగెండి – ప్రభుత్వం పాఠశాలలో విద్య పొందండి! 4. 👩🏫 అర్హత కలిగిన ఉపాధ్యాయులు – నాణ్యమైన బోధన! 5. 💧 ఆర్.ఓ. నీరు, శుభ్రమైన మరుగుదొడ్లు – ఆరోగ్యవంతమైన పాఠశాలలు! 6. 🧪 సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు – అభ్యాసానికి ఆధునిక మద్దతు! 7. 📺 స్మార్ట్ టీవీలు, డిజిటల్ క్లాస్రూమ్లు – శ్రేయోభిలాషి విద్యా వాతావరణం! 8. 💰 స్కాలర్షిప్లు, ప్రయోజనాల పథకాలు – ప్రతీ విద్యార్థికి అవకాశాలు! 9. 🔒 సీసీ కెమెరాలు, ప్రహరీ గోడ – పిల్లల భద్రతకు ముందడుగు! 10. 🌟 ప్రభుత్వ పాఠశాల – ప్రతీ పల్లె పిల్లకి ప్రకాశవంతమైన భవిష్యత్తు! *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*బడిబాట కొరకు ఉపయోగపడుతుంది* 🏫 మా ప్రభుత్వ పాఠశాల - మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు పునాది 🌟 పాఠశాల ప్రత్యేకతలు: ✅ అర్హత కలిగిన, నిపుణులైన ఉపాధ్యాయులు ✅ సాంకేతిక విద్యా పరికరాలు – స్మార్ట్ టీవీలు, డిజిటల్ క్లాస్రూములు ✅ గ్రంథాలయాలు, సైన్స్ & కంప్యూటర్ ప్రయోగశాలలు ✅ ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల కోసం ప్రత్యేక ఉపాధ్యాయులు --- 🎁 విద్యార్థులకు లభించే ప్రయోజనాలు: 🎒 ఉచిత యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ 🍱 పోషకాహారంతో కూడిన ఉచిత మధ్యాహ్న భోజనం 🩺 ఆరోగ్య పరీక్షలు, బాలికల కోసం శానిటరీ న్యాప్కిన్లు 💰 SC/ST/BC/MINORITY విద్యార్థులకు స్కాలర్షిప్లు 🎓 ముఖ్యమంత్రి విద్యా దీవెన & అమ్మ ఒడి లాంటి పథకాల లాభాలు --- 🏗️ మౌలిక సదుపాయాలు: 🏠 శుభ్రమైన తరగతి గదులు – ఫ్యాన్స్, లైట్స్, బెంచీలు 🚽 బాలురూ, బాలికలూ కోసం వేరు వేరు మరుగుదొడ్లు 🧼 శుద్ధమైన తాగునీటి కోసం ఆర్.ఓ. ప్లాంట్ 🔒 భద్రతా ఏర్పాట్లు – సీసీ కెమెరాలు, ప్రహరీ గోడలు 🚌 అవసరమైతే ట్రాన్స్పోర్ట్ లేదా ప్రయాణ ఖర్చు రీయింబర్స్మెంట్ --- 📞 మరిన్ని వివరాలకు: పాఠశాల పేరు: _______________________ సంప్రదించండి: _______________________ *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊పుస్తకాల్లేని చదువులు* *🔶ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్యపుస్తకాల ముద్రణ* *🔷నెలన్నర రోజులు ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి* *🔶తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం* *🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఈసారి కనీసం మరో నెలా నెలన్నర రోజులు పాఠ్య పుస్తకాలు లేకుండానే చదువుకోక తప్పదు. జూన్ 2న విద్యా సంవత్సరం మొదలైనా... ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు మార్కెట్లోనూ విక్రయానికి పుస్తకాలు తీసుకురాలేక పోయారు. విద్యాశాఖ, ఇంటర్బోర్డు, తెలుగు అకాడమీల మధ్య సమన్వయం లేకపోవడం సమస్యగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఆదర్శ పాఠశాలలు, జనరల్ గురుకుల కళాశాలలు, కేజీబీవీల్లోని విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను అందించాల్సి ఉంది. ఒకవైపు విద్యార్థుల సంఖ్య పెంచాలని లక్ష్యాలు విధిస్తున్న అధికారులు... కళాశాలలు తెరిచేలోగానే పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచకపోవడం ఏమిటని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు.* *💥నాలుగున్నర లక్షల మందికి ఎదురుచూపులు* *🌀రాష్ట్రవ్యాప్తంగా 9.50 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు చదువుతున్నారు. వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండేళ్లకు కలిపి 1.56 లక్షల మంది, విద్యాశాఖ పరిధిలోని ఇతర విద్యా సంస్థల్లో మరో 75 వేల మంది ఉంటారు. వీరందరికీ ఉచితంగా పుస్తకాలు ఇవ్వాల్సి ఉంటుంది. కార్పొరేట్ కళాశాలల్లోని విద్యార్థులకు ఆ కళాశాలలు సొంతగా ముద్రించిన మెటీరియల్ను అందిస్తాయి. ఇతర ప్రైవేట్ కళాశాల్లోనూ సగం మందే తెలుగు అకాడమీ పుస్తకాలను కొంటుంటారు. ఈసారి వారైనా కొనేందుకు అవి మార్కెట్లో లేకపోవడం గమనార్హం. మొత్తానికి నాలుగున్నర లక్షల మంది పుస్తకాలు లేకుండానే నెలన్నర రోజులు చదువుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తెలుగు అకాడమీలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, ఒక అధికారిణికే ఐదు పోస్టుల బాధ్యతలున్నాయని, అకాడమీకి పూర్తిస్థాయి డైరెక్టర్ లేకపోవడంతో ముద్రణపై పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వస్తున్నాయి.* *💥ప్రతిపాదనల తిరస్కరణ... అయినా ఆలస్యమే...* *💠పాఠ్య పుస్తకాల్లో సిలబస్ మార్పుపై 2024 నవంబరు నుంచి ఇంటర్ బోర్డులో కసరత్తు జరుగుతోంది. ఎన్సీఈఆర్టీతో పోల్చితే ఇంటర్లో సిలబస్ అధికంగా ఉందని, దాన్ని తొలగిస్తే విద్యార్థులపై గణితం, భౌతికశాస్త్రంలో 15-20% భారం తగ్గుతుందని బోర్డువర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపారు. అదే నెలాఖరులో వాటిని ప్రభుత్వం తిరస్కరించింది. 2025-26 విద్యా సంవత్సరానికి పాత సిలబస్తోపాటు ఇతరత్రా మార్పుల్లేకుండా యథాతథంగా అమలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ సిలబస్లో మార్పులు చేస్తే... జూన్ 2లోగా పుస్తకాలు ఇచ్చే విషయమై ఇంటర్ బోర్డు అధికారులు భరోసా ఇవ్వని కారణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే... కళాశాలల పునఃప్రారంభానికి నెల రోజుల సమయమున్నా సకాలంలో పుస్తకాలను ముద్రించలేదు. ఈ విషయమై తెలుగు అకాడమీ మేనేజరు, ప్రింటింగ్ ఇన్ఛార్జి స్వర్ణలత మాట్లాడుతూ... ప్రథమ సంవత్సరం పుస్తకాల ముద్రణ పూర్తయిందని, ద్వితీయ సంవత్సరం పుస్తకాల ముద్రణ కొనసాగుతోందన్నారు. పుస్తకాలకు జిల్లాలకు చేర్చిన తర్వాత కళాశాలలకు నేరుగా పంపించాల్సి ఉంటుందన్నారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
https://youtu.be/2xURaZttEhA?si=kAVrkY6wcTafLw-4
*🔊సాంకేతిక విద్య కంటే అగ్రి, వెటర్నరీ డిప్లొమా కోర్సులే ప్రియం* *🔶విద్యార్థుల ఆవేదన* *🍥ఈనాడు, హైదరాబాద్: పదో తరగతి అనంతరం ఉపాధి అవకాశాల లక్ష్యంతో విద్యా ర్థులు పాలిటెక్నిక్లలో ప్రవేశాలకు ముందుకొ స్తున్నారు. రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖతో పాటు వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ వర్సిటీల పరిధిలో డిప్లొమా కోర్సులను నిర్వహిస్తు న్నారు. అయితే సాంకేతిక విద్యాశాఖ పరిధి లోని కళాశాలల కంటే డిప్లొమా కోర్సులకు అధిక రుసుంలు ఉండడంతో భారంగా మారు తోందని విద్యార్థులు వాపోతున్నారు. సాంకేతిక విద్య పాలిటెక్నిక్ లో ప్రవేశాలకు దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.300, ఇత రులకు రూ.600 కాగా.. ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ పాలిటెక్నిక్లలో ప్రవేశాలకు ఎస్సీ, ఎస్టీలకు రూ.600, ఇతరులకు రూ.1,100 ఉంది. సాంకేతిక విద్య పాలిటెక్నిక్లలో వార్షిక రుసుం రూ.3,800 కాగా ఉద్యాన, వ్యవసాయ, వెటర్నరీ వర్సిటీ పరిధిలోని కోర్సులకు మొదటి సెమిస్టర్ కు రూ.19,120 చెల్లించాలి. ఈ ఫీజు లను చూసి విద్యార్థులు ఆవేదన చెందుతు న్నారు. సత్వర ఉపాధి అవకాశాల కోసం పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరుదామని భావిస్తుంటే.. కోర్సులు ప్రియంగా మారాయని చెబుతు న్నారు. విద్యా ప్రమాణాలు, ప్రాక్టికల్స్, శిక్షణ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రుసుంలు ఖరారయ్యాయని వర్సిటీల అధికారులు చెబుతున్నారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊కేజీబీవీల్లో కొత్త మెనూ* *🔶విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యం* *🔷స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి* *🍥దిశ, తెలంగాణ బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా కేజీబీవీ పాఠశాలల్లో నూతన మెనూ అమలు చేస్తున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి తెలి పారు. రాష్ట్రస్థాయిలో నిర్దేశించిన ఎస్ఓపీ ప్రకారం ఆహార పదార్థాలను వండాలని, కొత్త మెనూ ప్రకారం నాణ్యమైన ఆహార పదార్థాలను వండి వడ్డించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 495 కేజీబీవీలకు చెందిన వంట సిబ్బందికి నూతన మెనూ, వండేటప్పుడు, వడ్డించేట ప్పుడు పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) పై ఒకరోజు శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణా కార్య క్రమం హైదరాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ (ఐహెచ్ఎం ) డీడీ కాలనీలో జరిగింది. ఇందులో 31 జిల్లాల నుంచి 93 మంది వంట సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర సమగ్ర శిక్ష, పాఠశాల విద్య డైరెక్టర్ నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న అంశాల ను జిల్లా రిసోర్స్ పర్సన్స్ జిల్లా స్థాయి లో అమలు చేయాలని, ముఖ్యంగా విద్యా ర్థులకు సరైన వయసులో సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సం యుక్త సంచాలకులు వెంకట నరసమ్మ, రాజీవ్, సంజయ్ ఠాకూర్, ఐహెచ్ఎం హైదరాబాద్ ప్రిన్సిపల్, జెండర్ ఈక్విటీ కోఆర్డినేటర్ శిరీష పాల్గొన్నారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊జేఈఈ అడ్వాన్స్డ్లో 9,404 మంది మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత* *🔶జేఈఈ అడ్వాన్స్డ్లో 9,404 మంది మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత* *🔷2017 తరువాత అత్యధికం* *🍥న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాలు లింగ ప్రాతినిధ్యంలో పురోగతిని చూపిస్తున్నాయి. ఈ ఫలితాల ప్రకారం రికార్డు స్థాయిలో 9,404 మంది మహిళా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. 2017 తరువాత మహిళా అభ్యర్థులు ఈ స్థాయిలో ఉత్తీర్ణత సాధించడం ఇదే మొదటిసారి. 2017లో 7,137 మంది (14.1 శాతం) మహిళా అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. తాజాగా మళ్లీ 9,404 మంది (17.3 శాతం) మహిళా అభ్యర్థులు ఉత్తర్ణీత సాధించడం ఎక్కువ మంది మహిళలు స్టెమ్ కోర్సుల్లోకి ప్రవేశించేలా ప్రోత్సహిస్తుందని విద్యా రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. మోషన్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకులు, సీఈఓ నితిన్ విజరు మాట్లాడుతూ మహిళా అభ్యర్థులు సానుకూల ధోరణిలో విజయాలు సాధిస్తున్నారని చెప్పారు. 2023లో ఐఐటిల్లో కొత్తగా 1,364 బిటెక్ సీట్లు పెంచడం, అలాగే, 20 శాతం మహిళా సూపర్న్యూమరీ కోటా జతచేయడంతో మహిళా అభ్యర్థులకు అవకాశాలు పెరిగాయని తెలిపారు. మహిళా అభ్యర్థుల ఉత్తీర్ణత సంఖ్య పెరుగుతుండటం, వారికి అవకాశాలు కూడా పెరుగుతుండటంతో భవిష్యత్లో దేశంలోని ప్రధాన సాంకేతిక సంస్థల్లో లింగ ప్రాతినిధ్యంలో అంతరాలు తగ్గుతాయనే విశ్వాసం కలుగుతుందని అన్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2025కి మొత్తంగా దాదాపు 1.90 లక్షల మంది విద్యార్థులు హాజరుకాగా, వీరిలో సుమారు 43 వేల మంది మహిళా అభ్యర్థులు. ఐఐటీల్లో 20 శాతం మహిళా సూపర్న్యూమరీ కోటా అమలు కొనసాగుతున్న కారణంగా అఖిల భారత ర్యాంకుల్లో టాప్- 25 వేల వరకూ ర్యాంకుల్లో నిలిచిన మహిళలకు ప్రవేశం లభించే అవకాశం ఉంది.కాగా, మేలో జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష కఠినంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా గణితం పేపరు చాలా కష్టంగా ఉందని చెప్పారు. సమాధానాలు రాబట్టడానికి ఎక్కువ సమయం తీసుకునే ప్రశ్నలు ఉన్నాయని తెలిపారు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం పేపర్లు కూడా ఇదే విధంగా ఉన్నాయని చెప్పారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊నెట్ వాడకం హైజంప్!* *🔶రాష్ట్ర యువతలో భారీగా పెరిగిన ఇంటర్నెట్ వినియోగం* *🔷2016లో 22 ఏళ్ల వారిలో ప్రతి 10 మందిలో ముగ్గురులో నెట్ వాడకం* *🔶2023 నాటికి మూడు రెట్లు పెరుగుదల* *🔷అదే కాలానికి టెన్త్, ఇంటర్లో పెరిగిన ఉత్తీర్ణత శాతం* *🔶బాల్య వివాహాలు, త్వరగా తల్లులైన వారిలోఇంటర్ చదివిన వారు 15 శాతమే* *🔷యంగ్ లైవ్స్ రౌండ్ 7 సర్వేలో వెల్లడించిన సెస్* *🍥సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర యువతలో ఇంటర్నెట్ వాడకం భారీ స్థాయిలో పెరిగినట్లు ‘ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం (సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్’యంగ్ లైవ్స్ రౌండ్ 7 పేరిట నిర్వహించిన సర్వే వెల్లడించింది. 2016లో 22 ఏళ్ల వయస్కుల్లో ప్రతి 10 మందిలో ముగ్గురు ఇంటర్నెట్ వాడగా 2023 నాటికి వారిలో ఏకంగా 8 మంది ఇంటర్నెట్ వాడినట్లు సర్వే పేర్కొంది.అలాగే 2023లో 22 ఏళ్ల వయసు వారిలో నెట్ వాడకం మూడు రెట్లు పెరిగిందని.. ప్రతి 10 మందిలో 9 మంది ఇంటర్నెట్ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు సర్వే తెలిపింది. 2016లో ఇంటర్నెట్ వినియోగం పేదల్లో 6 శాతం ఉంటే ఇప్పుడది ఏకంగా 86 శాతానికి పెరిగినట్లు సర్వే గుర్తించింది. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి దేశంలో రోజువారీ డిజిటిల్ కార్యకలాపాల వాడకాన్ని మరింతగా అందుబాటులోకి తెచ్చిందని సర్వే అభిప్రాయపడింది.అయితే కంప్యూటర్ వినియోగం మాత్రం సంపన్నుల్లోనే కొనసాగుతోందని వివరించింది. విద్యార్హతలు పెరిగినా వారిలో సమగ్రంగా చదవడం మాత్రం పెరగలేదని సర్వే అభిప్రాయపడింది. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక వెనుకబాటు ఉన్న ఎస్సీ, ఎస్టీ, ప్రతికూలతలు ఉన్న సామాజిక వర్గాలు, బాల్యవివాహాలు చేసుకున్న వారు ఉన్నత విద్యను ఇంకా అందుకోలేకపోతున్నారని ‘సెస్’నివేదిక స్పష్టం చేసింది.* *💥టెన్త్, ఇంటర్ వారిలో పెరుగుదల..* *🌀రాష్టంలో విద్యారంగం వేగంగా మారుతోంది. పదో తరగతి, ఇంటర్ పూర్తి చేసుకుంటున్న యువత శాతం గణనీయంగా పెరుగుతోంది. అదే సమయంలో యూనివర్సిటీల్లో చేరికలు కాస్త తక్కువగా ఉంటుండగా బాల్య వివాహాలు చేసుకుంటున్న వారు చదువుకు దూరమవుతున్నారు. ఏడేళ్ల వయసు తేడా ఉన్న యువతను లక్ష్యంగా చేసిన ఈ సర్వేను ‘సెస్’నిర్వహించింది. 2016 22 ఏళ్ల వారిని, 2023లో 22 ఏళ్ల వారిని పరిగణనలోకి తీసుకొని ఈ సర్వే నిర్వహించారు.* *💠పదో తరగతిలో..: ఈ సర్వే ప్రకారం పాఠశాల విద్యలో విద్యార్థులు పురోగతి సాధించారు. సెండరీ విద్య పూర్తి చేసిన వారు 2016లో 74 శాతం మంది ఉంటే అది 2023 నాటికి 83 శాతానికి చేరింది. అలాగే హయ్యర్ సెకండరీలో 53 శాతం నుంచి 61 శాతానికి పెరిగిందని సర్వే వెల్లడించింది. ఈ రెండు దశల్లోనూ ఉత్తీర్ణతలో లింగభేదం పెద్దగా లేదని సర్వే వివరించింది.ఇక యూనివర్సిటీ స్థాయి విద్యలో 10 % ఎన్రోల్మెంట్ పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. బాల్య వివాహాలు చేసుకున్న వారు లేదా త్వరగా తల్లులైన వారిలో హయ్యర్ సెకండరీ విద్య పూర్తి చేసిన వారు 15 శాతం మాత్రమేనని.. అదే ఆలస్యంగా వివాహాలు చేసుకున్న వారు 67 శాతం మంది ఇంటర్ విద్యను పూర్తి చేసుకున్నట్లు సర్వే తెలిపింది.* *💥ఉన్నత విద్య..* *🥏గ్రామీణులకు ఉన్నత విద్య పట్టణాల్లోని వారితో పోలిస్తే అంతగా అందుబాటులో లేదని సర్వే వెల్లడించింది. పట్టణ ప్రాంతాల్లోని వారికి 65 శాతం యూనివర్సిటీలు అందుబాటులో ఉంటే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 43 శాతమే అందుబాటులో ఉన్నాయని నివేదిక తెలిపింది. అలాగే ఆర్థిక స్తోమతపరంగా చూస్తే సంపన్నులకు 66 శాతం, పేదలకు 38 శాతమే అవకాశాలున్నాయని వివరించింది.సామాజిక రంగాలవారీగా చూస్తే ఎస్సీలకు 42 శాతం అవకాశాలు ఉంటే ఇతర వర్గాలకు 68 శాతం ఉన్నత విద్య అందుబాటులో ఉన్నట్లు సర్వే తేల్చింది. గత ఏడేళ్లలో దిగువ తరగతి వారిలో హయ్యర్ సెంకడరీ పూర్తి చేసిన వారి నిష్పత్తి 2016లో 40 శాతంగా ఉంటే అది 2023 నాటికి 54 శాతానికి పెరిగినట్లు సర్వే వివరించింది.యూనివర్సిటీ ఎన్రోల్మెంట్లో వారి సంఖ్య 27 శాతం నుంచి 38 శాతానికి పెరిగినట్లు తెలిపింది. అదే ఎగువ తరగతి వారిలో యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ 61 శాతం నుంచి 66 శాతానికి పెరిగినట్లు సర్వే గుర్తించింది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊కాలేజీలు స్టార్టయే..పర్మిషన్ రాదాయే!* *🔶ఇంటర్మీడియట్ విద్యాసంస్థలు ప్రారంభం* *🔷1,130 కళాశాలకు మాత్రమే బోర్డు గుర్తింపు* *🔶క్లారిటీ ఇవ్వని అధికారులు.. పేరెంట్స్ లో టెన్షన్* *🍥దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కాలేజీలకు సమ్మర్ హాలీడేస్ పూర్తయ్యాయి. కానీ ఇంటర్మీ డియట్ కాలేజీలకు బోర్డు గుర్తింపు ప్రక్రియ పూర్తిస్థాయిలో కంప్లీట్ కాలేదు. మార్చి 31 నుంచి మే 31వ తేదీ వరకు అన్ని కాలేజీలకు ఇంటర్మీడి యట్ బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 2 నుంచి కొత్త విద్యాసంవ త్సరం ప్రారంభం కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీ లతో పాటు గురుకులాల్లోనూ ఫస్టియర్, సెకండియర్ క్లాసెస్ మొదలయ్యాయి. అయితే ఇప్పటివరకు 1,126 కాలేజీ లకు మాత్రమే ఇంటర్ బోర్డు గుర్తింపు ఇచ్చింది. అందులో ప్రైవేట్, కార్పొరేటు కాలేజీలు 230 మాత్రమే ఉన్నాయి. గతంలో మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఉండే కాలేజీల్లో కార్పొరేట్ విద్యాసం స్థలు కూడా ఎక్కువగా ఉండటంతో పిల్లల భవిష్యత్ కోసం ఇవ్వాలని చాలా మేనేజ్ మెంట్లు కోరడంతో అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇలా అదే ధీమాతో ప్రతి విద్యాసంవత్సరం ప్రైవేటు కాలేజీల అడ్మిషన్ల ప్రక్రియను ప్రారం భించాయి. తాము చేరే కాలేజీకి గుర్తింపు ఉన్నా లేకున్నా ఇబ్బంది లేదని, తమ ఇష్టపూర్వకంగానే కాలేజీలో చేరు తున్నట్లు విద్యార్థుల నుంచి లిఖిత పూర్వక లేఖలు రాయించుకోవాలని కొన్నిసార్లు సూచించిన సంఘటనలు ఉన్నాయి. ఈ కారణంగానే అందులో ఏ కాలేజీకి గుర్తింపు ఉందనే విషయాన్ని ఇంటర్ బోర్డు అధికారికంగా వెల్లడిం చాలని పేరెంట్స్ కోరుతున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవలే ఇంటర్మీడియట్ బోర్డు 2025-26 అకాడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. అందులో భాగంగానే 226 వర్కింగ్ డేస్, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా సెలవులు, వచ్చే జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, వచ్చే ఏడాది మార్చి ఫస్ట్ వీక్ లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయని పేర్కొంది.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
*🔊నాలుగు ఎడ్ టెక్ సంస్థలకు త్వరలో నోటీసులు* *🍥ఈనాడు, హైదరాబాద్: అనుమతి లేకుండా ఇంజినీరింగ్ విద్యను అందిస్తామని వందల మంది విద్యార్థులను చేర్చుకుంటున్న నాలుగు ఎడ్ టెక్ సంస్థలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి త్వరలో నోటీ సులు జారీ చేయనుంది. తమకు డీమ్డ్ వర్సిటీలతో ఎంఓయూ ఉందని, వాటి పేరిటే ఇంజినీరింగ్ పట్టాలు వస్తాయని, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్య శిక్షణ ఇస్తామని పేర్కొంటూ హైదరాబాద్ మాదాపూర్, నానక్ రామ్ గూడ ప్రాంతంలోని నాలుగు ఎడ్ టెక్ సంస్థలు విద్యార్థులను చేర్చుకుంటూ.. రూ. లక్షల ఫీజు వసూలు చేస్తున్నాయి. దీనిపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందడంతో నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m