Vasamsetti Subash
February 15, 2025 at 04:06 PM
15-2-2025.
రామచంద్రపురం.
*పట్టభద్రుల్లో నిరుద్యోగ నిర్మూలనకు కూటమి ప్రభుత్వం కృషి*
*కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా మంత్రి సుభాష్, గన్ని కృష్ణ విస్తృత ప్రచారం*.
రామచంద్రపురం, ఫిబ్రవరి 15: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పట్టబద్రుల్లో ఉన్న నిరుద్యోగాన్ని నిర్మూలించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కృషి చేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ మంత్రి వాసంశెట్టి సుభాష్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు, గన్ని కృష్ణ ఆధ్వర్యంలో శనివారం రామచంద్రపురంలోని పలు వార్డుల్లో విస్తృత పర్యటన చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి పార్టీ సీనియర్ నాయకులు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం,జనసేన ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రామచంద్రపురం ఎన్నికల పరిశీలకులు కాకినాడ రామారావు, పట్టణ అధ్యక్షులు కడియాల రాఘవన్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ నేరుగా పట్టభద్రులైన ఓటర్లను కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అఖండ విజయం అందించాలని కరపత్రాలు పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. పట్టభద్రుల సమస్యల పట్ల అవగాహన ఉన్న కూటమి అభ్యర్థిని బలపరచి, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా శాంతి భద్రతల పరిరక్షణ, విద్యారంగ పటిష్టత, అభివృద్ధి, సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి సుభాష్ వెంట పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
#perabathularajashekaram #mlcelection2025 #mlcelection #mlc2025 #ramachandrapuram
❤️
🙏
2