
🪷 తిరుమల వైభవం 🪷 ( Tirumala vaibhavam Telugu )
February 25, 2025 at 02:22 AM
🔔 *తిరుమల వైభవం* 🔔
*శ్రీమహావిష్ణువు కి చిహ్నాలైన శంఖు చక్రాది పంచ ఆయుధాలను *ఆయుధాలలో ఉన్నతమైన చక్రం.. "చక్రత్తాళ్వార్"అని కీర్తించబడుతున్నది. తిరుమల తిరుపతిలో …శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై అనేక లీలా విశేషాలు చూపించాడు.*
*తొండైమాన్ చక్రవర్తి పుట్టలోనున్న అర్చావతారమూర్తిని పాలతో అభిషేకించి, ఆ మూర్తిని వెలుపలికి తీసుకువచ్చి పిండితో చేసిన సిరి ధాన్యాల ఆహారపిండిని నివేదించాడు. అతని భక్తికి సంతోషించిన మహావిష్ణువు తొండైమాన్ తో స్వయంగా సంభాషించాడు. ఇద్దరూ స్నేహితులయ్యారని పురాణగాధ. క్రమంగా తొండైమాన్ భక్తి, మహావిష్ణువు అభిమానము పెరుగుతూ వచ్చాయి.*
*ఒకనాడు తొండైమాన్ చక్రవర్తి సభకి కొంతమంది మునులు వచ్చారు. చక్రవర్తి వారిని సకల మర్యాదలతో ఆహ్వానించి వారి రాకకు కారణాన్ని వినయంగా అడిగాడు.*అందుకు ఆ మునులు " మేము ఈ ప్రక్కనున్న కొండమీద తపస్సు చేసుకునే మునులం. అక్కడ ‘సిమ్మాదనుడు’ అనే దానవుని హింసలు భరించలేక పోతున్నాము. మా యజ్ఞయాగాలకు తపస్సుకు విఘాతం కల్పిస్తున్నాడు. మీరు ఆ దానవుని సంహరించి మమ్మల్ని కాపాడండి." అని కోరారు.*
*తొండైమాన్ ఆలోచనలో పడ్డాడు. సాటి రాజులతో తలపడి యుధ్ధంచేయడానికి సిధ్ధమే. కాని కౄరుడైన దానవుని సంహరించడం మానవుడినైన నాకు అంత తేలికైన పని కాదు.” అని అన్నాడు.*
*దానికి ఆ మునులు… “మీరు వేంకటేశ్వరస్వామికి మిత్రులని మాకు తెలుసు. స్వామివారి అనుమతితో మీరు ఆ దానవునితో యుధ్ధం చేసినట్లైతే మీరు తప్పక విజయం సాధిస్తారు. మా మాట కాదనకండి" అని అన్నారు.*తొండైమాన్ సంతోషించాడు. "ముని శ్రేష్టులారా.. మీరు చెప్పినది వాస్తవం. స్వామి, నాకు యుధ్ధం చేయడానికి అనుమతి యిస్తే, తప్పకుండా యుధ్ధం చేస్తాను." అన్న తొండైమాన్ చక్రవర్తిని మునులు ఆశీర్వదించారు.*
*తల ఎత్తి చూసిన చక్రవర్తికి ఇంద్రాది దేవతలు సాక్షాత్కారమిచ్చారు.*
*తొండైమాన్ కి ఆశ్చర్యం కలిగింది. మహా సంతోషంగా మహావిష్ణువు వద్దకు వెళ్ళాడు.*
*మహావిష్ణువు చక్రవర్తిని ఆహ్వానించాడు. మహావిష్ణువు కి సంగతి తెలిపి ఆ దానవునితో యుధ్ధానికి సమ్మతి కోరాడు."నీవు సిమ్మాదనునితో యుధ్ధం చెయ్యి, విజయం నీకే లభిస్తుంది. నీకు సహాయంగా నా శంఖు, చక్ర, గద, ధనుర్బాణ, కరవాల మొదలైన పంచాయుధాలను యిస్తున్నాను. నా అనుగ్రహం నీకు లభిస్తుంది." అని ఆశీర్వదించి పంపాడు.*
*యుధ్ధం చాలా తీవ్రంగా సాగింది. ఆఖరికి తొండైమాన్ ప్రయోగించిన చక్రాయుధం దానవుని శిరస్సు ఖండించినది.*దేవతలు పుష్పవాన కురిపించారు.*తొండైమాన్ మహావిష్ణువు వద్ధకు వచ్చి పంచ ఆయుధాలను తిరిగి సమర్పించాడు.*
*కాని మహావిష్ణువు "రాజా.. నేను ఒకరికి యిచ్చిన వస్తువును తిరిగి తీసుకునే ఉద్దేశ్యంతో అనుగ్రహించను. ఇవి నీ దగ్గరనే వుండనీ, నీవు,నేను వేరు కాదు." అని అన్నాడు.*తొండైమాన్ దానికి అంగీకరించలేదు. కారణమేమిటి అంటే శంఖు చక్రాలు మహావిష్ణువుకే సొంతమైనవని, వాటిని పొందే అర్హత తనకు లేదని భక్తిపూర్వకంగా చెప్పాడు.*
*"దేవా! శంఖు, చక్రాలు మీ యొక్క చిహ్నాలుగా భక్తులు భావిస్తారు" అని అన్నాడు.*మహావిష్ణువు యొక్క అర్చావతారమూర్తికి శంఖు, చక్రాలు ప్రధాన చిహ్నాలు. అంతేకాని శంఖు, చక్రాలు ధరించిన మూర్తులు మహా విష్ణువుమూర్తి కాలేవు. ఆలయాల వద్ద వుండే ద్వారపాలకులు కూడా శంఖు చక్రాలు ధరిస్తారు కాని మహావిష్ణువు కాలేరు కదా..*
*శ్రీ మహా విష్ణువుకి నిరంతరమైన చిహ్నం ఒకటి వుంది. అదే శ్రీవత్సం. అది ఒకటే చాలు శ్రీ మహావిష్ణువు కి చిహ్నం అని చెప్పడానికి అని ఆళ్వారులు కీర్తిస్తారు.*
*శ్రీ మహావిష్ణువు చక్రవర్తిని అర్ధం చేసుకున్నాడు.*
*తొండైమాన్ తో.. "నీకు యిచ్చిన పంచ ఆయుధాలు నీకు అవసరం లేకపోతే తిరుమలలో ఏదో ఒక ప్రాంతాన విడిచిపెట్టు. భవిష్యత్ లో నా భక్తుడే వాటిని తిరిగి నాకు సమర్పిస్తాడు. అంతవరకు నేను శంఖు, చక్రాలు లేకుండానే దర్శనమిస్తాను." అని తొండైమాన్ చక్రవర్తిని అనుగ్రహించాడు వేంకటేశ్వరుడు.*
*మహావిష్ణువు చెప్పిన విధంగా తొండైమాన్ చక్రవర్తి పంచ ఆయుధాలను ఒక్కొక్క ప్రాంతంలో వదలి వేశాడు. కాలక్రమేణా ఆ ప్రాంతాల్లో పుణ్య తీర్ధాలు ఏర్పడినవి. ఈనాటికీ తమని దర్శించ వచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నవీ పంచాయుధ తీర్ధాలు.*
*కొన్ని వేల సంవత్సరాలు గడిచాక తిరుమల తిరుపతి వేంకటేశ్వరునికి. శ్రీ రామానుజాచార్యుల వారు శంఖు, చక్రాలు సమర్పించారు. ఆ శంఖు చక్రాలనే ఈనాడు మనము దర్శిస్తున్నాము.*
https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🙏
❤️
😂
😮
55