
HT Telugu
February 25, 2025 at 06:28 AM
> మారుతీ సుజుకీ సియాజ్ సెడాన్కి సంస్థ గుడ్బై చెబుతోంది! నెక్సా ప్రీమియం రిటైల్ నెట్వర్క్ ద్వారా విక్రయించే ఈ సియాజ్ ప్రొడక్షన్ని 2025 మార్చ్లో ఆపేయాలని, ఇప్పటికే ఉన్న యూనిట్స్ని ఏ ఏడాది ఏప్రిల్ నాటికి విక్రయించాలని సంస్థ ప్లాన్ చేస్తోంది. హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, ఫోక్స్వ్యాగన్ విర్టస్ వంటి ప్రత్యర్థులతో పోటీ పడుతున్న ఈ సియాజ్ని నిలిపివేయడంతో ఇండియాతో పాటు ప్రపంచ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఎస్యూవీ, క్రాసోవర్ మధ్యలో నలిగిపోతున్న సెడాన్ పరిస్థితికి అద్దంపడుతోంది. మరీ ముఖ్యంగా నెక్సా రిటైల్ చెయిన్ ద్వారా తమ తొలి ఎలక్ట్రిక్ వాహనం మారుతీ సుజుకీ ఈ విటారాని విక్రయించేందుకు ఓవైపు ప్లాన్ చేస్తూనే, మరోవైపు సియాజ్ని నిలిపివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది.