
nalini.durgamma
February 28, 2025 at 06:59 AM
ఆదిశక్తి,,అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి అయిన అమ్మవారు,,అనేక రూపాల్లో అనేక నామాలతో మనకు దర్శనం ఇస్తున్నారు..
అందులో ఒక రూపమే సంతోషిమాత అమ్మవారు,,అసలు అమ్మవారు ఎవరు? ఆవిడ ఆవిర్భావం ఎలా జరిగింది ?అమ్మవారి కి పులుపు పదార్థాలు ఎందుకు నిషేధం,,అలాగే అమ్మవారి వ్రతం ఎలా చేయాలో మనం తెలుసుకుందాం..
శ్రావణ శుక్ల పూర్ణిమ రోజు శివుడు మెడలో ఉండే సర్పం,,విఘ్నేశ్వరుడికి రాఖీ కడుతూ ఉంటాది,, అది చూసిన విఘ్నేశ్వరుడి కుమారులు అయిన లాభం,,క్షేమం వాళ్ళు కూడా రాఖీ కట్టమని మారాం చేస్తారు,,ఈలోగా నారదమహర్షి అక్కడకు వస్తారు,,నారదమహర్షి విఘ్నేశ్వరుడికి ఇలా చెప్పుతారు,,స్వామి ఈ సమస్యకు ఒక్కటే పరిష్కారం,,మీరు ద్యానం చేసి ముగ్గురమ్మలు అయినటువంటి,,మహాలక్ష్మి,,మహాకాళి,,మహాసరస్వతి స్వరూపిణులను వారి శక్తులను ఒక అష్టాదళపద్మములో ఆవాహన చేయండి..
అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్తారు,,అలాగే విఘ్నేశ్వరుడు కొన్ని ఏళ్ళపాటు తమస్సు చేసి సరస్వతీ దేవి లో అన్ని కళలను,,లక్ష్మి దేవి లో ఉన్న అన్ని సంపదలను,,పార్వతి దేవి లో ఉన్న అన్ని శక్తులను ఆవాహన చేసి,,స్వామి వారు తన నేత్రాలను తెరుస్తారు,,తెరవగానే స్వామి వారి నేత్ర కాంతి ఆ పద్మంలో పడగానే ఆ పద్మం నుండి ఒక బాలిక రూపంలో చతుర్భుజాలను కలిగి ఒక చేతిలో శూలం,,ఒక చేతిలో ఖడ్గం,,ఒక చేతిలో పాయసం పాత్ర(కుంకుమ బరిణి)అని కూడా అంటారు,,మరో చేయి అభయ హస్తంగా ఉండి ఒక పాప ఉద్భవిస్తాది..
ఆవిడ ఉద్బవంతో లోకాలు అన్నీ సంతోషమయముగా,,ఆవిడ రూపం ముక్కోటి దేవతలకు సైతం సంతోషాన్ని కలిగించింది,,అందుకే ఆవిడ ను సంతోషిమాతగా,,రూపంలో ముగ్గురమ్మల కన్నా తేజోవంతంగా ఉండటం వల్ల రూపాదేవిగా,,సంతోషిరూపాదేవిగా నారదమహర్షి నామకరణం చేశారు..
ఈ అమ్మవారి కి ఎవరు అయితే ప్రతి శుక్రవారం నాడు సుచిగా,శుభ్రంగా,ఆ వ్రతం చేసిన ఆ ఒక్క శుక్రవారం పులుపు పదార్థాలు తినకుండా చేస్తారో,,వారికి ముగ్గురమ్మల అనుగ్రహంతో పాటు అమ్మ సంతోషిమాత అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం,,అయితే అమ్మవారి కి పులుపు పదార్థాలు ఎందుకు నిషేధం అంటే?రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది,,అంటే కామం,క్రోధం,లోభం లాంటి గుణాలను ప్రేరేపిస్తుంది,,అందుకు అమ్మ వ్రతం చేసిన ఆ ఒక్క శుక్రవారం తినకుండా ఉండాలని అంటారు..
అయితే ఈ వ్రతాన్ని మనం 3 , 5, 9,11,16,21,41 వారాలు మీ శక్తి కొలది చేయవచ్చు,,మీ వారాలు పూర్తి అవ్వగానే ఉద్యాపన చేయాలి,,అయితే ఈ వ్రతాన్ని చేసే వారు ఆ శుక్రవారం నాడు శుచిగా శుభ్రంగా తలకు స్నానమాచరించి, ,అమ్మవారి పటాన్ని ఒక పీఠంపై ఉంచి,,దీపారాధన చేసి,,పసుపు గణపతిని ఒక తమలపాకు మీద ఉంచి,,అమ్మవారి వ్రత పుస్తకం ఉంటుంది అందులో అమ్మ నామాలు చదువుతూ కుంకుమ పూజ చేసుకుంటారు,,అమ్మ కు నైవేద్యంగా బెల్లం,,డోలపప్పు(అంటే వేపిన చేనాగపపు,,చెట్నీ పప్పు తింటాం కదా అది) సమర్పించి,,అమ్మవారి వ్రత కథ చదువుకుంటారు,,తరువాత మంగళ హారతి ఇచ్చి పూజ ను ముగిస్తారు,,ఇలా మీరు అనుకున్న అన్ని రోజులు చేయండి,,తప్పకుండా అమ్మవారు మీ కోరికను తీరుస్తారు,,ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు..
శుక్రవారం వ్రతం చేస్తే శనివారం ఉదయం యధాస్థానంలో అమ్మ పటాన్ని పెట్టుకోవచ్చు,,అంతేకాదు ముఖ్యమైనది ఉద్యాపన,,అది మనం సంతోషిమాత దేవాలయంలో మాత్రమే చేసుకోవాలి,,అది వ్రతం ముగిసిన చివరి శుక్రవారం గుడిలో ఉద్యాపన ఇచ్చుకోవాలి,,ముందుగానే పూజారి గారిని అడిగి కనుక్కోండి..
ఇక ఉపవాసం విషయానికి వస్తే,,ఒకప్పుడు ఈ వ్రతానికి ఉపవాసం ఆచరించేవారు,,కానీ ఈ రోజుల్లో ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటున్నాయి కాబట్టి,,మితంగా స్వీకరించండి ముఖ్యమైనది పులుపు పదార్థం ఉండకూడదు,,ఇంట్లో వాళ్లకి వండి పెట్టుకోండి కానీ మీరు మాత్రం తినకండి..
పూజ అయ్యాక తప్పకుండా ప్రసాదాన్ని స్వీకరించండి,,అంతేకాదు ఒకవేళ మీ ఇంటి దగ్గరికి గోమాత వస్తూ ఉంటే,,గోమాతకి కొంచెం ప్రసాదం ముందుగానే తీసి ఉంచి గోమాతకు కూడా పెట్టండి,,ఇంకా కుదిరితే మీ ఇంటి దగ్గర సంతోషిమాత దేవాలయం ఉంటే ఒకసారి వెళ్లి దర్శించుకుని రండి..ఒకవేళ పుస్తకం దొరకకపోతే సంతోషిమాత అష్టోత్తరాలు కూడా చదువుకోవచ్చు..
అమ్మ దయతో నేను వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నాను 16 శుక్రవరాలు చేసుకుంటున్న..
శ్రీ మాత్రే నమః..🙏🚩🚩
🙏
❤️
👍
💐
💚
👌
👏
💞
😂
🙇
136