APTEACHERS
February 20, 2025 at 02:52 AM
*♻️నేటి వార్తలు (20.02.2025)* *✳️నేటి ప్రత్యేకత:* ▪️ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం ▪️ఆంధ్ర, తెలంగాణలకు చెందిన నాయకుల మధ్య 1956 ఫిబ్రవరి 20వ తేదీన న్యూఢిల్లీలో పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం తర్వాత 1956 నవంబర్ 1 ప తేదీన రెండు రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించాయి. *✳️అంతర్జాతీయ వార్తలు::* ▪️సుంకాల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో స్వయంగా చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ▪️పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ పరిధిలోని బర్ఖాన్ ప్రాంతంలో ప్రయాణికులతో వెళుతున్న బస్సును ఆపి సాయుధమూకలు కాల్పులు జరిపిన సంఘటనలో ఏడుగురు మృతి చెందారు. ▪️అమెరికా నుంచి పంపివేసిన దాదాపు 300 మంది అక్రమ వలసదారులను పనామా రాజధాని పనామా సిటీలోని హోటల్ లో అధికారులు నిర్బంధించి వారిని స్వదేశాలకు పంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ▪️మాజీ ప్రధానమంత్రి పుమియో కిషిద పై బాంబు దాడి చేసిన వ్యక్తికి జపాన్లోని స్థానిక న్యాయస్థానం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ▪️శాశ్వత కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయిల్ అంగీకరిస్తే మిగిలిన బంధీలందరినీ ఒకేసారి విడుదల చేయడానికి తమ సిద్ధంగా ఉన్నామని హమాస్ నిన్న ప్రకటించింది. ▪️ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) ప్రతి సంవత్సరం విడుదల చేసే వ్యాధి గణాంకాల నమోదు విశ్లేషణ వ్యాఖ్యానాల సంకలనం ( ఐసిడి-11) లో భారతదేశీయ వైద్యరీతులైన ఆయుర్వేద, సిద్ధ, యునానీలకు స్థానం కల్పించింది. ▪️ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్ స్కీ ఓ నియంత అని అందుకే దేశంలో ఎన్నికలు నిర్వహించడం లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయం వ్యక్తం చేశారు. *✳️జాతీయ వార్తలు:* ▪️ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖ గుప్తాను ఎంపిక చేసింది. ▪️కర్ణాటకలో మైసూరు నగరాభివృద్ధి సంస్థ (ముడా) స్థలాల పంపిణీ అక్రమాలలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆయన బంధువుల పాత్ర లేదంటూ కర్ణాటక లోకాయుక్త పోలీసులు తమ విచారణ నివేదికను సమర్పించారు. ▪️రాజస్థాన్లోని ఉదయపూర్ లో అఖిలభారత స్థాయి జల వనరుల మంత్రుల సమావేశం సందర్భంగా సమావేశమైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మంత్రులు నీటి వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకోవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ▪️రీఛార్జబుల్ బ్యాటరీ ఎలా తయారీలో కీలకమైన లిథియం అన్వేషణతో పాటు గనుల రంగంలో పరస్పరం సహకరించుకునే విషయమై భారతదేశం. అర్జెంటీనాలు నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ▪️మహాకుంభమేళాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలపై ఇంతవరకు పది కేసులలో 101 సామాజిక మాధ్యమ ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలియజేశారు. ▪️ప్రభుత్వ భవనాలు నిర్మించేటప్పుడు శిశు సంరక్షణకు ప్రత్యేక గదులు నిర్మించాలని సుప్రీంకోర్టు నిన్న రాష్ట్రాలకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ▪️వివాద పరిష్కారానికి మధ్యవర్తి ఇచ్చిన తీర్పులలో కోర్టులు మార్పులు చేర్పులు చేయవచ్చుననే అంశంపై నిన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తమ తీర్పును వాయిదా వేసింది. ▪️భారతదేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి)గా జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషి నిన్న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ▪️కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ 608.08 కోట్లు, తెలంగాణకు రూ 231.75 కోట్ల వరద సాయాన్ని ప్రకటించింది. *✳️రాష్ట్ర వార్తలు:* ▪️కాకినాడలోని ఆంధ్ర సాహిత్య పరిషత్ మ్యూజియం నిర్మాణానికి 10 కోట్ల నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న పరిపాలన అనుమతులు జారీ చేసింది. ▪️గులియన్ బారీ సిండ్రోమ్ (జిబిఎస్ ) తో బాధపడుతూ గుంటూరు జి జి హెచ్ లో చేరిన 66 ఏళ్ల మహిళ మరణించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ▪️ఇకపై ఫీజు రీయింబర్స్మెంట్ సొమ్మును సెమిస్టర్ వారీగా కళాశాలల ఖాతాలలో జమ చేస్తామని ▪️2028-29 నాటికి రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలలో ప్రకృతి సేద్యం సాగు చేసే విధంగా ఆందమ విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. ▪️రాష్ట్రంతో కలిసి పని చేయడానికి పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్ నిన్న ముఖ్యమంత్రిని కలిసి సంసిద్ధత వ్యక్తం చేసింది. ▪️ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగంలో రాబోయే ఐదు సంవత్సరాలలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులు సాధించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి తెలియజేశారు. ▪️రాష్ట్రంలోని ఎంపిక చేసిన 7 జిల్లాలలో గిరిజనులు, మత్స్యకారుల కుటుంబాలకు సంచార కేంద్రాల ద్వారా "మీ డాక్టర్ మీ ఇంటికి" విధానంలో జిల్లాకో అంబులెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ శాఖ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ▪️నేడు ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ▪️రాష్ట్రంలో విద్యుత్ నిల్వ కోసం 500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ సిస్టం (బిఈఎస్ఎస్) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ ఎన్.హెచ్.పి.సి.) టిండర్ ప్రకటన జారీ చేసింది. *✳️క్రీడా వార్తలు:* ▪️అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 9వ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ పోటీల లో. నేడు దుబాయ్ లో జరిగే మ్యాచ్ లో భారత్ బాంగ్లాదేశ్ లు తలపడనున్నాయి.

Comments