Vasamsetti Subash
February 27, 2025 at 05:03 PM
• *శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు* • **శివదీక్ష విరమించిన మంత్రి వాసంశెట్టి సుభాష్* *శ్రీశైలం ఫిబ్రవరి27:రాష్ట్ర* కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం శివ దీక్షను విరమించినారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 11 రోజులపాటు శివదిక్షను చేపట్టిన అయన ఈనెల 26 తో దీక్ష ముగింపు నేపథ్యంలో గురువారం శ్రీశైలం వెళ్ళిన మంత్రి సాయంత్రం మల్లన్న ను దర్శించుకుని ఆయన సన్నిధిలో దీక్ష విరమించి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శివ దీక్ష ద్వారా భక్తితో పాటు మనిషికి మానసిక ప్రశాంతత, ఆరోగ్యం సమకూరుతాయని, కార్యదక్షతకు ఆటంకాలు తొలగిపోతాయని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. మంత్రికి ఆలయ కమిటీ వారు సాదర స్వాగతం పలికి అనంతరం వేద పండితుల ఆశీర్వాదం అందించి సత్కరించారు. #teamsubash
❤️ 1

Comments