🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
March 1, 2025 at 11:45 AM
*కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు పేరుపేరునా బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి గారి ఆహ్వానం.* ...
*నేటి నుండి 3వరకు బెస్తరపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బొమ్మలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ ఆహ్వానం.* ..
👉🏽 **94ఏళ్ల తర్వాత జాతర జరగనుండడంతో భారీ ఏర్పాట్లు.** ..
👉 *ఈ జాతరకు వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కట్టుదార్లు తెలిపారు .* ..
👉 *కళ్యాణదుర్గం ప్రాంతం మరియు కర్ణాటక ప్రాంతాల నుండి భారీగా తరలిరానున్న భక్తాదులు.* ..
కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదుగురు కట్టుదార్లు, చుట్టాలు, బంధు మిత్రులు బెస్తరపల్లి గ్రామం లో నేటి నుండి 3వరకు జరిగే *శ్రీశ్రీశ్రీ క్యాతి లింగేశ్వర స్వామి,శ్రీబొమ్మలింగేశ్వరస్వామి, శ్రీశ్రీశ్రీ ఈరన్న స్వామి, శ్రీ శ్రీ శ్రీ యల్లమ్మ, శ్రీశ్రీశ్రీ మారెమ్మల ఆలయ ప్రవేశ మరియు చర ప్రతిష్ఠ జాతరకు అందరూ రావాలని పేరుపేరునా ఇదే నా ఆహ్వానంగా భావించి హాజరు కావాలని బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శనివారం బెస్తరపల్లి గ్రామంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ జాతర మా గ్రామంలో ఎప్పుడో 94 సంవత్సరాల క్రితం యాదవ సామాజిక వర్గానికి చెందిన చిత్తముత్తి, చంద్ర ముత్తి,రామముత్తి, దేవగిరి యాదవ వంశీకులైన తాము చేసేవరమన్నారు. గ్రామంలో శ్రీశ్రీశ్రీ క్యాతి లింగేశ్వర స్వామి,శ్రీబొమ్మలింగేశ్వరస్వామి, శ్రీశ్రీశ్రీ ఈరన్న స్వామి, శ్రీ శ్రీ శ్రీ యల్లమ్మ, శ్రీశ్రీశ్రీ మారెమ్మల ఆలయ ప్రవేశ మరియు చర ప్రతిష్ఠ జాతరలో తాను అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. . అయితే దాదాపు ఈ జాతరకు వేలాది మంది జాతరకు హాజరయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. అయితే వచ్చిన భక్తాదులు అన్నదానం స్వీకరించి స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరు అని ఆయన అన్నారు. ఈ జాతర లో ఐదుగురు కట్టుదార్లు యజమాన, గౌడ, దళవాయి, పూజారి, పారుపార్తెగార్, కమిటీపెద్దలతో కలిసి సంబదించిన ఏర్పాట్ల ను పరిశీలించారు.శనివారం సాయంత్రం నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ అన్నదానం ఉంటుందని తెలియజేశారు. మరొక్క సారి అన్నదమ్ములకు, బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, చిన్ననాటి స్నేహితులకు ఇదే ఆహ్వానంగా భావించి జాతరకు అందరూ హాజరు కావాలని కోరారు.
https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42
