🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
6.5K subscribers
About 🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩
*AP &TS* *🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩* *24×7*
Similar Channels
Swipe to see more
Posts
*కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు పేరుపేరునా బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి గారి ఆహ్వానం.* ... *నేటి నుండి 3వరకు బెస్తరపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ బొమ్మలింగేశ్వర స్వామి జాతర మహోత్సవ ఆహ్వానం.* .. 👉🏽 **94ఏళ్ల తర్వాత జాతర జరగనుండడంతో భారీ ఏర్పాట్లు.** .. 👉 *ఈ జాతరకు వేలాది మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కట్టుదార్లు తెలిపారు .* .. 👉 *కళ్యాణదుర్గం ప్రాంతం మరియు కర్ణాటక ప్రాంతాల నుండి భారీగా తరలిరానున్న భక్తాదులు.* .. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఐదుగురు కట్టుదార్లు, చుట్టాలు, బంధు మిత్రులు బెస్తరపల్లి గ్రామం లో నేటి నుండి 3వరకు జరిగే *శ్రీశ్రీశ్రీ క్యాతి లింగేశ్వర స్వామి,శ్రీబొమ్మలింగేశ్వరస్వామి, శ్రీశ్రీశ్రీ ఈరన్న స్వామి, శ్రీ శ్రీ శ్రీ యల్లమ్మ, శ్రీశ్రీశ్రీ మారెమ్మల ఆలయ ప్రవేశ మరియు చర ప్రతిష్ఠ జాతరకు అందరూ రావాలని పేరుపేరునా ఇదే నా ఆహ్వానంగా భావించి హాజరు కావాలని బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శనివారం బెస్తరపల్లి గ్రామంలో ఆయన మీడియా తో మాట్లాడారు. ఈ జాతర మా గ్రామంలో ఎప్పుడో 94 సంవత్సరాల క్రితం యాదవ సామాజిక వర్గానికి చెందిన చిత్తముత్తి, చంద్ర ముత్తి,రామముత్తి, దేవగిరి యాదవ వంశీకులైన తాము చేసేవరమన్నారు. గ్రామంలో శ్రీశ్రీశ్రీ క్యాతి లింగేశ్వర స్వామి,శ్రీబొమ్మలింగేశ్వరస్వామి, శ్రీశ్రీశ్రీ ఈరన్న స్వామి, శ్రీ శ్రీ శ్రీ యల్లమ్మ, శ్రీశ్రీశ్రీ మారెమ్మల ఆలయ ప్రవేశ మరియు చర ప్రతిష్ఠ జాతరలో తాను అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు. . అయితే దాదాపు ఈ జాతరకు వేలాది మంది జాతరకు హాజరయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. అయితే వచ్చిన భక్తాదులు అన్నదానం స్వీకరించి స్వామి వార్ల కృపకు పాత్రులు కాగలరు అని ఆయన అన్నారు. ఈ జాతర లో ఐదుగురు కట్టుదార్లు యజమాన, గౌడ, దళవాయి, పూజారి, పారుపార్తెగార్, కమిటీపెద్దలతో కలిసి సంబదించిన ఏర్పాట్ల ను పరిశీలించారు.శనివారం సాయంత్రం నుండి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ అన్నదానం ఉంటుందని తెలియజేశారు. మరొక్క సారి అన్నదమ్ములకు, బంధు మిత్రులకు, శ్రేయోభిలాషులకు, చిన్ననాటి స్నేహితులకు ఇదే ఆహ్వానంగా భావించి జాతరకు అందరూ హాజరు కావాలని కోరారు. https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42

*అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025* *ఈనెల 8 వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , రాష్ట్ర హోం మంత్రి వి. అనిత, రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా, ఐపిఎస్., ,గుంటూరు రేంజ్ ఐజిపి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఐపిఎస్ ఆదేశములతో మహిళా దినోత్సవం వారోత్సవాలు జరగనున్నాయి.* ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయం నందు పల్నాడు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలోని మహిళా పోలీసు సిబ్బందికి మరియు సచివాలయం మహిళా పోలీసులకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ హాజరై మెడికల్ క్యాంపు ను ప్రారంభించడం జరిగింది. పోలీసు శాఖ నందు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తూ వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. *ఈ మెడికల్ క్యాంపు నిర్వహించుటకు గాను* 1. డాక్టర్ రామలింగారెడ్డి మ్యాక్సీ విజన్ కంటి వైద్యశాల 2. కొండవీడు ENT హాస్పిటల్ 3. గాయత్రి స్కిన్ కేర్ వైద్యశాల 4. లిఖిత ఆర్థో వైద్యశాల 5. హన్విత జనరల్ వైద్యశాల 6. వసంత డెంటల్ కేర్ వైద్యశాల 7. హిమబిందు గైనిక్ వైద్యశాల వారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 151 మంది మహిళా సిబ్బంది వైద్య పరీక్షలు చేయించుకోవడం జరిగింది. *అనంతరం ఎస్పీ నరసరావు పేట లోని రైల్వే స్టేషన్ వద్ద గల SC,ST బాలికల వసతి గృహాన్ని పరిశీలించి చట్టపరంగా ఏమైనా సమస్యలు ఉన్న యెడల తమ దృష్టికి వెంటనే తీసుకు రావాలని* తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (పరిపాలన) J.V. సంతోష్ , అదనపు ఎస్పి (AR) V. సత్తి రాజు , మహిళా పోలీస్ స్టేషన్ డి ఎస్పీ M.వెంకట రమణ ,RI వెల్ఫేర్ L. గోపీ నాథ్ ,అడ్మిన్ RI M. రాజా ,హోమ్ గార్డ్ RI S. కృష్ణ పాల్గొన్నారు.
సముద్రంలో నిర్మించిన 182 కిలోమీటర్ల (113 మైళ్లు) పొడవైన ఈ రహదారి ఒక ఇంజనీరింగ్ అద్భుతం. దీన్ని తేలియాడే రహదారి (ఫ్లోటింగ్ హైవే) అని పిలుస్తారు. నీలిరంగు సముద్రంలో తేలియాడే ఈ రహదారి అమెరికాలోని ఫ్లోరిడా స్థితిగతుల్ని మార్చేసింది. మయామి నుంచి ఫ్లోరిడాలోని కీవెస్ట్ ద్వీపానికి ప్రయాణించడం ఒకప్పుడు పెద్ద ప్రహసనంగా ఉండేది. ఇప్పుడది సులభంగా మారింది. 20వ శతాబ్దపు తొలి నాళ్లలో ఈ మార్గంలో ప్రయాణించడానికి పడవలే దిక్కు. కూడా సముద్రంలోని ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఒక రోజంతా పడవ ప్రయాణం చేయాల్సి వచ్చేది. కానీ, ఈ ఇంజనీరింగ్ అద్భుతం కష్టాలను దూరం చేసింది. ఈ ఓవర్సీస్ హైవే ఫ్లోరిడాలోని ప్రధాన భూభాగం దక్షిణ కొన నుంచి 44 ద్వీపాల మీదుగా 42 వంతెనలపై సముద్రంలో 113 మైళ్ల దూరం విస్తరించింది. అంటే హైదరాబాద్లోని నాంపల్లి నుంచి విజయవాడ మార్గంలో కోదాడ వరకు ఎంత దూరం ఉంటుందో అంత అన్నమాట. దూరదృష్టి గల డెవలపర్ హెన్రీ మోరిసన్ ఫ్లాగ్లర్ అద్భుత సృష్టి ఈ ఓవర్సీస్ హైవే. హెన్రీ మోరిసన్కు ‘ది ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఫ్లోరిడా’’ అనే పేరుంది. ఓవర్సీస్ హైవే నిజానికి ‘‘ఓవర్-సీ రైల్రోడ్’’గా ప్రారంభమైంది. 1912లో ఈ రైలుమార్గం పూర్తయినప్పుడు, దీన్ని ప్రపంచంలోని ఎనిమిదో వింతగా పిలిచారు. మయామి నుంచి కీవెస్ట్కు ఈ మార్గాన ప్రయాణించిన తొలి రైలులో, అప్పటికే 82 ఏళ్ల వయస్సున్న ఫ్లాగ్లర్ ప్రయాణించారు. ఈ సందర్భంగా తన స్నేహితుడితో ‘‘ఇక ఇప్పుడు నేను సంతోషంగా చనిపోతాను. నా కల నెరవేరింది’’ అని చెప్పారు. 1935 వరకు రైల్రోడ్ పని చేసింది. శతాబ్దంలోనే అత్యంత ఘోరమైనదిగా పిలిచే ఒక తుపాను కారణంగా కొన్ని మైళ్ల దూరం వరకు ఈ రైల్వే ట్రాక్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ట్రాక్లను పునర్నిర్మించడానికి బదులుగా, ఫ్లాగ్లర్ మాస్టర్వర్క్కు అమెరికన్లు పునర్జన్మను ఇచ్చారు. అది అమెరికన్లు ఆటోమొబైల్స్ వైపు మళ్లుతున్న తరుణం. ఆటోమొబైల్స్కు అనుగుణంగా ప్రపంచంలోనే అతిపొడవైన ఓవర్ వాటర్ రోడ్లను నిర్మించాలని అమెరికా ప్రభుత్వం భావించింది. ఈ మేరకు, గంటకు 200 మైళ్ల వేగంతో వీచే గాలులను తట్టుకోగలిగేలా నీళ్ల మీద ఫ్లాగ్లర్ నిర్మించిన వంతెనల మీదనే ఈ పొడవైన రహదారి నిర్మాణాన్ని అమెరికా ప్రభుత్వం ప్రారంభించింది. రైల్వే ట్రాక్లను కార్లు తిరిగేందుకు వీలుగా రహదారుల్లాగా మార్చేశారు. కొత్తగా రూపొందించిన ఈ ఓవర్సీస్ హైవే సుదూరంలోని ఫ్లోరిడా కీస్ను పర్యాటక కేంద్రంగా మార్చింది. https://whatsapp.com/channel/0029VaOcoLL0Qeai6TcRRX42

*గోరంట్ల మాధవ్ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ, జనసేన నాయకులు* *అంతర్యుద్ధం అంటే అర్థం ఏంటి.. కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేస్తున్నారా..?* *మాధవ్ వ్యాఖ్యలపై టీడీపీ, జనసేన నాయకుల ఆగ్రహం* *మాధవ్ ని అరెస్ట్ చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు* *మాధవ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఎస్పీ జగదీష్ కు అందజేసిన నాయకులు* *రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు* *ప్రజల మధ్య, వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు* *ఈ కుట్రలు రాజద్రోహం కిందకు వస్తాయన్న టీడీపీ, జనసేన నాయకులు* *మాధవ్ ని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి* *మాధవ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ జగదీష్*

*దాడులు చేసిన వారి చిట్టాను పింకు బుక్లో రాసుకుంటాం: కవిత హెచ్చరిక* సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తామన్న కవిత సింగోటం ఆలయానికి కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేశారన్న కవిత ఆ నిధులను జూపల్లి కృష్ణారావు రద్దు చేశారని ఆరోపణ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారి చిట్టా పింకు బుక్లో రాసుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమకు సమయం వచ్చినప్పుడు వారి సంగతిని తేలుస్తామని ఆమె హెచ్చరించారు. నేడు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ, సింగోటం లింగాకార లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం కోసం గతంలో కేసీఆర్ రూ.17 కోట్లు మంజూరు చేస్తే, ఆ నిధులను జూపల్లి కృష్ణారావు రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు. ఒక ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలు తర్వాత ప్రభుత్వం కొనసాగించాలని అన్నారు. అప్పుడే ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ప్రజల మీద కక్ష కట్టినట్లుగా దేవుడిపై కూడా కక్ష కట్టి రూ.17 కోట్లను రద్దు చేయించడం విడ్డూరమని అన్నారు. ఈ రద్దు చేసిన నిధులను తక్షణమే ఆలయ అభివృద్ధి కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్న బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. జూపల్లి కృష్ణారావు టూరిజం మంత్రిగా కాకుండా, కొల్లాపూర్ నియోజకవర్గానికి అప్పుడప్పుడు వస్తూ 'టూరిస్ట్ మంత్రి'గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

*బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఈటెల రాజేందర్ ⁉️* - రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నాయకుడు - ఉద్యమ సమయంలో కేసీఆర్ తర్వాత స్థానం - బీసీ నాయకుడుగా ప్రతిపక్షాలను ధీటుగా పోరాటం - షార్ట్ లిస్ట్ లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; తెలంగాణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక క్లైమాక్స్కి చేరుకుంది. రాష్ట్ర బీజేపీకి కొత్త రథసారథి వస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించడంతో.. కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్…? అంటూ కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.. అయితే.. ఇదే కొశ్చన్పై గతకొన్ని రోజులుగా పొలిటికల్ సర్కిల్స్లో హాట్హాట్ డిబేట్స్ నడుస్తున్నాయ్. అయితే టీబీజేపీ అధ్యక్షుడి ఎన్నిక ఆల్ మోస్ట్ క్లైమాక్స్కి చేరుకుంది. షార్ట్లిస్ట్ సైతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో ముగ్గురు నేతలు ఉన్నట్లు పేర్కొంటున్నారు. షార్ట్లిస్ట్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, రామచంద్రరావు పేర్లు ఉన్నట్లు సమాచారం.. పార్టీలో మొదట్నుంచి ఉండడం, ఆర్ఎస్ఎస్ మద్దతుతో.. అధ్యక్ష పదవి కోసం రామచంద్రరావు ప్రయత్నాలు చేస్తున్నారు. సునీల్ బన్సల్, బీఎల్ సంతోష్ సహా ముఖ్యనేతలతో.. ఇప్పటికే అధ్యక్ష పదవి ఆశిస్తున్న నాయకులు సమావేశమయ్యారు.. అయితే.. హైకమాండ్ మహిళా కోటాలో డీకే అరుణ పేరు పరిశీలిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. రెడ్డి సామాజికవర్గ సమీకరణాలు డీకే అరుణకు ప్లస్ పాయింట్స్ గా చెబుతున్నారు.. అయితే.. ముగ్గురిలో రేసులో ఈటల రాజేందర్ ముందున్నట్లు చెబుతున్నారు. తెలంగాణలో బీసీ నినాదం వినిపించేందుకు ఈటల ఆప్షన్ అని.. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఈటలకు ప్లస్ పాయింట్ అవుతుందని చెబతున్నారు. అయితే.. షార్ట్ లిస్ట్ లో ఉన్న పేర్లను పరిశీలించిన తర్వాత త్వరలోనే కొత్త అధ్యక్షుడిని మోదీ, అమిత్ షా ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి ప్లేస్లో గతకొన్ని రోజులుగా చాలా పేర్లే వినిపించాయి. ఈటలతో పాటు ధర్మపురి అర్వింద్, రఘునందన్రావు పేర్లు తెరపైకి వచ్చాయి. కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా ఉంటారనే ప్రచారం కూడా జరిగింది. ఐతే అన్నీ తోసిపుచ్చుతూ.. ఇప్పుడు 3 పేర్లను షార్ట్లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఈటల, డీకే అరుణ, రామచంద్రరావు.. ఈ ముగ్గురిలో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

> నార్సింగి అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి. G+2 భవనంలో జరిగిన ప్రమాదం. గ్రౌండ్ఫ్లోర్లో చెలరేగిన మంటలు.
పోలీసులు నాకు బేడీలు వేశారు: నటుడు సునీల్ శెట్టి Feb 28, 2025, పోలీసులు నాకు బేడీలు వేశారు: నటుడు సునీల్ శెట్టి నటుడు సునీల్ శెట్టికి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి తాజాగా తెలిపాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి జరిగినప్పుడు మేం ‘కాంటే’ షూట్ కోసం లాస్ ఏంజెల్స్కు వెళ్లాం. అక్కడి వారు నా గెటప్ చూసి పరుగులు తీశారు. ఇంతలో పోలీసులు నేను దుండగుడినని భావించి ‘నాకు తుపాకీ గురి పెట్టి.. చేతులకు బేడీలు వేశారు. హోటల్ మేనేజర్ నేను నటుడినని పోలీసులకు చెప్పడంతో విడిచిపెట్టారు’ అని సునీల్ శెట్టి తెలిపాడు.
