
Telugu Helper
February 5, 2025 at 03:48 PM
*పంచాయతీల పారదర్శకత్వం పై ప్రభుత్వం కసరత్తు ...*
☛ పంచాయతీ ఆదాయ వనరుల్లో అవినీతి, అక్రమాలు, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.
☛ ప్రజలకు పారదర్శకంగా సమాచారం అందించేందుకు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నది. ఇందుగాను 'స్వర్ణ గ్రామ పంచాయతీ' వెబ్సైట్ను ప్రారంభించింది.
☛ పంచాయతీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన లావాదేవీలను 'స్వర్ణ పంచాయతీ' పేరిట ఆన్లైన్ ద్వారా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
☛ దీంతో ఏ రోజుకారోజు పంచాయతీకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు అయ్యింది అన్నది తెలుస్తుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు నివాస గృహాలకు సంబంధించిన పన్నుల సమాచారాన్ని ఆయా కార్యదర్శులు సచివాలయాల సిబ్బంది సంబంధిత వెబ్సైట్లో నమోదు చేసారు.
☛ 'స్వర్ణ పంచాయతీ' వెబ్సైట్లో ఇల్లు/ షాపు/కంపెనీ/ పరిశ్రమ విస్తీర్ణం, హద్దులు, యాజమాని వివరాలు, ఏడాదికి ఎంత పన్ను చెల్లిస్తున్నారు వంటి వివరాలను నమోదు చేస్తారు.
☛ ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేసి డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామపంచాయతీల్లో డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు.
☛ పన్నుల చెల్లింపుతోపాటు పంచాయతీ ద్వారా జారీ అయ్యే వివిధ రకాల ధ్రువపత్రాలు, భవన నిర్మాణ అనుమతులు కూడా పొందవచ్చు.
⬜ 𝗝𝗼𝗶𝗻 𝗧𝗲𝗹𝗲𝗴𝗿𝗮𝗺 :
https://t.me/teluguhelper
👍
😮
3