
Maadhava Reddy
February 19, 2025 at 02:28 PM
#adminpost
ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి
ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలోపరిధిలోని జనసేన పార్టీఇంచార్జి మాధవ్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు బుధవారం నాడు శివాజీ 395 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయుల సంరక్షణకి అనేక యుద్ధాలు చేసిన మహావీరుడని,బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు.నేటి యువత ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మాధవ్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ Dr. మాధవరెడ్డి చందానగర్ డివిజన్ ప్రెసిడెంట్ అరుణ్ కుమార్, చందానగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వులిసి శ్రీనివాసరావు ,హఫీస్పేట్ ప్రధాన కార్యదర్శి నిరంజన్ కుమార్ ,మియాపూర్ డివిజన్ ప్రెసిడెంట్ హరి నాయక్ మరియు పార్టీ నాయకులు విష్ణువర్ధన్ నాయుడు , శివ , పంతం రంగా శ్రీనివాస్, గుంటూరు శ్రీనివాస్ మరియు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు🙏
#serilingampally

👍
1